-
‘సుకన్య’ పథకం .. బాలికలకు వరం
అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో దరఖాస్తులు సింహాద్రిపురం : ప్రధాని నరేంద్రమోడి 2015 జనవరి 22న ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పడావోలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికలకు వరంగా మారింది. తల్లిదండ్రులు తమ బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖాతాలు ప్రారంభిస్తే ఆడపిల్లలు అదృష్ట లక్ష్ములుగా మారుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆడపిల్లల చదువు, వివాహ ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది. ఖాతా ప్రారంభం ఇలా... : ఐదేళ్లలోపు బాలికల పేరుతో సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ) ప్రారంభించవచ్చు. బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ ద్వారా ఖాతా తెరవవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు మాత్రమే ఈ ఖాతాలు తెరవవచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దినసరి కూలీలు ఎవరైనా ఇందులో ఖాతాదారులు కావచ్చు. ఉచిత దరఖాస్తులు : సమీప పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. దరఖాస్తు ఫారాలను కార్యాలయంలో ఉచితంగా పొంది సమాచారాన్ని పొందుపరచాలి. దరఖాస్తుతోపాటు తండ్రి, తల్లి లేదా సంరక్షకుడి వివరాలు, బాలిక ఫొటో, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రం, ఆధార్ చిరునామా తెలిపే ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని జతపరచాలి. ఖాతా ప్రారంభ సమయంలో రూ.1000లు చెల్లించాలి. తర్వాత రూ.100లపైబడిన మొత్తాన్ని జమ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1000లనుంచి రూ.1.50లక్షల వరకు ఒకేసారి లేదా వేర్వేరు కంతుల్లో జమ చేయవచ్చు. అలా ఖాతాను ప్రారంభించిన నాటినుంచి నేరుగా అత్యధికంగా 14ఏళ్ల వరకు జమ చేసుకోవచ్చు. బాలికలకు 21ఏళ్లు వచ్చేవరకు లేదా వివాహం జరగనంతవరకు డిపాజిట్లు కొనసాగించవచ్చు. పథకంవల్ల ఉపయోగాలు : బాలికకు 18ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత చదువుకు గానీ, వివాహానికైనా ఖాతాలో ఉన్న మొత్తంలో సగం సొమ్మును డ్రా చేసుకొనే అవకాశం ఉంది. 2014-15లో డిపాజిట్కు 9.1శాతం వడ్డీ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాలికకు 14ఏళ్లు పూర్తయ్యే వరకు ఈ వడ్డీ ఖాతాకు జమ అవుతుంది. పాసు పుస్తకం సదుపాయం ఉంటుంది. ఖాతా ఎక్కడికైనా బదిలీ చేసుకొనే వీలు ఉంటుంది. ఏడాది వయసున్న బాలిక పేరుతో నెలకు రూ.1000లు చెల్లిస్తే ఏడాదికి ఖాతాలో రూ.12వేలు జమ అవుతుంది. అలా 14ఏళ్లపాటు జమ చేస్తే రూ.1.68లక్షల వరకు పొదుపు చేయగలుగుతారు. జమ చేసిన నాటి నుంచి 18ఏళ్లు నిండిన తర్వాత 21ఏళ్లు నిండకముందే వివాహమైతే ప్రభుత్వ ఖాతా నిలిపివేస్తారు. -
‘బాలికా సంరక్షణ’ ఏదీ ?
పథకానికి రెండేళ్లుగా ప్రీమియం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం.. రూ.181 కోట్లు బకాయి సాక్షి, హైదరాబాద్: బాలికల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందిలే అన్న పేద తల్లిదండ్రుల నమ్మకాన్ని, చిన్నారుల పేరిట ఎంతో కొంత సొమ్ము జమ అవుతోందన్న ఆశను రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేస్తోంది. వింత కొర్రీలతో వారి ఆశలకు గండికొడుతోంది. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్)కు గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడమే దీనికి నిదర్శనం. ఈ పథకం కింద ప్రీమియం కోసం చెల్లించాల్సిన దాంట్లో రూ.181 కోట్లను ప్రభుత్వం బకాయి పడింది. అసలు ఈ పథకాన్ని మూసివేసిన సర్కారు.. బంగారు తల్లి పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. కానీ, పాత పథకానికి ప్రీమియం చెల్లింపులను ఆపేసింది. దాంతో ఎప్పుడో 20 ఏళ్లకు మెచ్యూరిటీ తీరే తమ బాండ్లు ఉంటాయో, రద్దవుతాయో? అనే ఆందోళన ఈ పథకం కింద లబ్ధి పొందే 5.6 లక్షల మంది చిన్నారులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. రెండేళ్ల నుంచి నయా పైసా లేదు.. 2005లో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి పేద బాలికలకు భరోసా ఇచ్చేందుకు బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్)ను ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఒకే ఆడపిల్ల జన్మిస్తే రూ. లక్ష, ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కో బాలికకు రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. ఈ మొత్తాన్ని ఆ బాలికలకు 20 ఏళ్ల వయసు నిండిన తర్వాత అందజేస్తుంది. ఇందుకోసం ప్రతియేటా ప్రీమియం కింద ఎల్ఐసీకి కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. 2005-06 సంవత్సరంలో ప్రారంభమయిన ఈ పథకం వైఎస్సార్ మరణం వరకు సజావుగానే సాగింది. తర్వాత అన్ని పథకాల్లాగానే ఆర్థిక అవాంతరాలను ఎదుర్కొని.. గత రెండేళ్ల నుంచి పూర్తి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2005 నుంచి 2011 వరకు మొత్తం 4.77 లక్షల మందికి ఈ పథకం కింద ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి బాండ్లు జారీ చేశారు. వీటికి గడువు ముగిసేంతవరకు ఏటా ప్రీమియం చెల్లించాలి. దాంతో పాటు 2011-12, 2012-13లో, 2013-14లోని ఒక నెల (బంగారుతల్లి పథకం అమల్లోకి వచ్చేంత వరకు) దాదాపు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి కూడా ప్రీమియం చెల్లించి బాండ్లు జారీ చేయాల్సి ఉంది. కానీ, కొత్తవారికే కాదు ఆరేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నవారికి కూడా ప్రీమియం చెల్లింపు ఆపేశారు. దాంతో ఆ మొత్తం రూ. 181 కోట్లకు చేరింది. ఈ సొమ్ము చెల్లిస్తేనే 5.56 లక్షల మంది బాలికల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. మరి ఏం జరుగుతోంది? రూ. 181 కోట్ల ప్రీమియం బకాయిలను వెంటనే చెల్లించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు ఎల్ఐసీ ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాయి. కానీ, ఆ విజ్ఞాపనలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఆ నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తూ ఫైలును తిరిగి పంపుతున్నారు. ‘ఈ పథకం కింద ఎంపికైన బాలికల్లో మధ్యలో చదువుమానేసిన వారెంతమంది..? చనిపోయిన వారికి ప్రీమియం చెల్లింపు నిలిపివేశారా..? ఆ వివరాలన్నింటినీ పంపండి.. అప్పుడే నిధులు విడుదల చేస్తాం’ అంటూ అధికారులు జాప్యం చేస్తుండడం గమనార్హం. అయితే, బాలికా శిశు సంరక్షణ పథకం కింద లబ్ధి పొందుతున్న చిన్నారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని, మెచ్యూరిటీ పొందేంత వరకు ప్రీమియం డబ్బు చెల్లిస్తామని ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అసలు ఈ పథకం గురించే మరిచిపోయారన్న భావన వ్యక్తమవుతోంది. కొత్త పథకాన్ని ప్రారంభించి, తగినంత ప్రచారం పొందిన ప్రభుత్వం.. ఇక ఈ పాత పథకానికి నిధుల చెల్లించడం కష్టమేనని, ఆ పథకం కింద లబ్ధి పొందిన 5.66 లక్షల మంది భవితవ్యం ప్రశ్నార్థకమేనని ప్రభుత్వ అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement