-
ఇది సినిమా కాదు జీవితం: డైరెక్టర్ తంగర్ బచ్చాన్
సినిమాటోగ్రాఫర్, దర్శకుడు తంగర్ బచ్చాన్ లేటెస్ట్ గా తీసిన సినిమా 'కరుమేఘంగళ్ కలైగిండ్రన'. దర్శకుడు భారతీరాజా లీడ్ రోల్ పోషించిన ఇందులో దర్శకుడు గౌతమ్మీనన్, ఎస్ఏ.చంద్రశేఖర్, ఆర్వీ.ఉదయకుమార్, యోగిబాబు, అదితిబాలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీ.వీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా బుధవారం ఉదయం చిత్ర యూని ట్ చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) ఈ కార్యక్రమంలో దర్శ కుడు తంగర్బచ్చాన్ మాట్లాడుతూ.. ఇది చిత్రం కాదనీ, జీవితం అనీ పేర్కొన్నారు. ఇందులో న్యాయవాది రామనాథ్ పాత్రను భారతీతాజా కాకుండా వేరెవరూ నటించలేరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రాసుకున్న నవలే ఈ చిత్రమని తెలిపారు. ఇటీవల వస్తున్న కొన్ని కమర్షియల్ చిత్రాలను ప్రేక్షకుల ఎందుకు ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తుపాకులతో కాల్చుకోవడం, చంపుకోవడం వంటి చిత్రాలతో భవిష్యత్ తరాలకు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకోవాలన్నారు. మంచి కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లేదని తంగర్ బచ్చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరుమేఘంగళ్ కలైగిండ్రన వంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనీ, చిత్ర పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని భారతీరాజా పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) -
క్రేజీ కాంబినేషన్: మరో తమిళ దర్శకుడితో మూవీ ప్లాన్ చేస్తున్న రామ్
టాలీవుడ్ యుంగ్ హీరో రామ్, దర్శకుడు గౌతమ్మీనన్ల క్రేజీ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్లో టాక్. కోలీవుడ్లో స్టైలిష్ దర్శకుడుగా పేరు గాంచిన గౌతమ్మీనన్కు టాలీవుడ్లోనూ మంచిపేరు ఉంది. తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఏ మాయచేసావే చిత్రానికి దర్శకుడు ఈయనే అన్నది తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించి నాగచైతన్య, సమంతల కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. కాగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించడానికి చాలామంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా నటుడు రామ్ ఈయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్మీనన్ ఒక భేటీలో స్వయంగా పేర్కొన్నారు. ఈయన తాజాగా శింబు కథానాయకుడిగా తెరకెక్కించిన వెందు తనిందదు కాడు చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై టాక్కు అతీతంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులోనే రూ.10 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో స్రవంతి మూవీస్ రవికిషోర్ విడుదల చేశారు. కాగా నటుడు రామ్ హీరోగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని ఈయనే నిర్మించనున్నట్లు సమాచారం. నటుడు రామ్, నిర్మాత స్రవంతి రవికిషోర్లతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నట్టు గౌతమ్మీనన్ పేర్కొన్నారు. తమ కాంబినేషన్లో రూపొందిన చిత్రం చాలా కొత్తగా ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది సెట్పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. -
గౌతమ్ మీనన్తో ముచ్చటగా మూడోసారి
తమిళ హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ మూడోసారి ఒక ప్రాజెక్ట్కి కలవనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో ‘విన్నైత్తాండి వరువాయా, అచ్చం ఎన్బదు మడమయడా’ (ఈ రెండు సినిమాలను ‘ఏ మాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’గా నాగచైతన్యతో తెలుగులో తెరకెక్కించారు గౌతమ్ మీనన్) చిత్రాలు వచ్చాయి. లాక్డౌన్లో ‘కార్తీక్ డయల్ సెయ్ ద ఎన్’ అనే షార్ట్ఫిల్మ్ కూడా చేశారు శింబు, గౌతమ్ మీనన్. ఐ ఫోన్తో ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ లఘు చిత్రం చేశారు. తాజాగా ఓ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఇషారీ కే గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘కొన్ని కథలు చాలా స్పెషల్గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్ కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది’’ అన్నారు గౌతమ్ మీనన్. ఇది ‘విన్నైత్తాండి వరువాయా’కు సీక్వెల్ అని ప్రచారంలో ఉంది. -
షార్ట్ ఫిలిం.. లాంగ్ హెయిర్
ఇప్పటివరకూ పెద్ద పెద్ద (నిడివి ఎక్కువ) సినిమాలు చేసిన హీరో సూర్య ఇప్పుడు ఓ చిన్న (షార్ట్) ఫిలిం చేస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ మూవీలో ఓ కథలో సూర్య హీరోగా కనిపిస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణ మంగళవారం ఆరంభమైంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింలో సూర్య లాంగ్ హెయిర్తో కనిపిస్తారు. నిజానికి ‘ఆకాశమే నీ హద్దురా’ తర్వాత ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఈ సినిమా కోసమే జుట్టు పెంచారు. అదే లుక్ లో ‘నవరస’లో కనబడనున్నారు. ‘వెబ్ ఫిలిం స్టార్ట్ చేశాం. ఈరోజు సెట్స్ లో ఎనర్జీ రెండింతలు. దానికి కారణం సూర్య’ అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్. మిగతా ఎనిమిది కథలను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. వాటిలోనూ పేరున్న నటీనటులు కనబడతారు. -
సీక్వెల్కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement