-
మసీదు కిందుగా పైప్లైన్, భారీ పేలుడు
ఢాకా: మసీదు కిందుగా వెళ్తున్న గ్యాస్ పైప్లైన్ పేలిపోవడంతో బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నవారిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైటుస్ సలాట్ జేమ్ మసీదులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మసీదులోని 6 ఏసీలు కూడా మంటల తీవ్రతకు పేలిపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ ఉన్నతాధికారి జయేదుల్ ఆలాం చెప్పారు. ప్రమాద తీవ్రతలో చాలా మందికి 90 శాతానికి పైగా గాయాలయ్యాయని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. (చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి) -
‘పుతిన్కు అర్ధమయ్యే భాషలోనే బదులిద్దాం’
బెర్లిన్ : రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ను తరలించే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్పై ఒత్తిడి పెరుగుతోంది. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీపై సోవియట్ స్టైల్లో విషపూరిత రసాయనాలు ఎక్కించి హత్యాయత్నం చేశారని ఆమె పేర్కొన్న అనంతరం పైప్లైన్ ప్రాజెక్టు రద్దుపై ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. బెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవాల్నీపై నోవిచోక్ రసాయనాన్ని ప్రయోగించి హత్యాయత్నం చేశారని, దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని మెర్కెల్ బుధవారం డిమాండ్ చేశారు. అయితే జర్మనీ వాదనను మాస్కో తోసిపుచ్చుతూ ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని, ఆధారాలు లేకుండా జర్మనీ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నవాల్నీపై దాడిని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. జర్మన్ రాజకీయ నేతలు పలువురు ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరుతున్నారు. ‘మనం రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..రష్యా అధ్యక్షుడు పుతిన్కు తెలిసిన భాషలోనే మనం బదులివ్వాలి..ఆయనకు తెలిసింది గ్యాస్ విక్రయాలే’నని జర్మనీ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ నాబర్ట్ రాట్జెన్ అన్నారు. నార్డ్స్ర్టీమ్ 2 పైప్లైన్ ఇప్పుడు పూర్తయితే పుతిన్ ఈ తరహా రాజకీయాలను కొనసాగించేందుకు ప్రోత్సహించినట్టేనని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి నేరుగా గ్యాస్ను తీసుకువచ్చే ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తవగా 2021 ఆరంభంలో ప్రారంభం కానుంది. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మనీపై ఒత్తిడి పెరుగుతోంది. చదవండి : ‘నమస్తే’తో మనసులు గెలుచుకున్న రాజ్నాథ్ -
పైప్ గ్యాస్ 400 జిల్లాల్లో
న్యూఢిల్లీ: రాబోయే 2–3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను 2020 నాటికి 10,000కు పెంచుతామన్నారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్వర్క్ పనులకు ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 10వ రౌండ్ గ్యాస్ లైసెన్స్ బిడ్డింగ్ను ప్రారంభించారు. 90 % కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం.. ‘కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 12 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. వీటిలో దాదాపు 6 కోట్ల ఉజ్వల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. మా ప్రభుత్వం చొరవతో దేశంలో 90 శాతం కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం లభించింది. కానీ నాలుగేళ్ల క్రితం దేశంలోని 55 శాతం మందికి మాత్రమే ఎల్పీజీ సౌకర్యం ఉండేది. అంటే గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 కోట్ల మందికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో 24 లక్షలుగా ఉన్న పైప్లైన్ గ్యాస్ కనెక్షన్లు గత నాలుగేళ్లలో 2 కోట్లకు చేరుకున్నాయి. 2014లో దేశ ప్రజలు కేవలం ప్రభుత్వాన్నే కాదు.. పనిచేసే విధానం, సంస్కృతిని మార్చేశారు అంటే అతిశయోక్తేమీ లేదు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కాలుష్యానికి అడ్డుకట్ట.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండేదని ప్రధాని వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలోని సీజీడీల సంఖ్యను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో(50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు) ఇళ్లకు వంటగ్యాస్ అందించే పనులకు శ్రీకారం చుట్టాం. 10వ రౌండ్ బిడ్డింగ్ పూర్తయితే దేశంలోని 70 శాతం జనాభాకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దేశీయ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానిస్తాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తులను పరిరక్షిస్తాం. పంట వ్యర్థాలను బయో–సీఎన్జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు. బిడ్డింగ్లో నెల్లూరుకు చోటు సీఎన్జీ పర్యావరణ హితమైనదనీ, దీని ఖర్చు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పోల్చుకుంటే తక్కువని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనను నిలిపివేశామని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
ముకేశ్ అంబానీ పైప్లైన్ వ్యాపార విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన గ్యాస్ పైప్లైన్ వ్యాపార విక్రయానికి లైన్ క్లియర్ అయింది. నష్టాల్లో ఉన్న ఈస్ట్–వెస్ట్ పైప్లైన్ లిమిటెడ్(ఈడబ్ల్యూపీఎల్)ను కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్రూక్ఫీల్డ్కు విక్రయించే ఒప్పందానికి చమురు–గ్యాస్ నియంత్రణ సంస్థ(పీఎన్జీఆర్బీ) కొద్ది వారాల క్రితం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని పీఎన్జీఆర్బీ చైర్మన్ దినేష్ కె షరాప్ వెల్లడించారు. గతంలో రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా ఉన్న ఈ సంస్థ పేరు తర్వాత ఈడబ్ల్యూపీఎల్గా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బేసిన్లో వెలికి తీసే గ్యాస్ను తరలించేందుకుగాను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి గుజరాత్లోని బారుచ్ వరకూ 1,400 కిలోమీటర్ల పైప్లైన్ను దశాబ్దం క్రితం నిర్మించారు. రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను రవాణా చేసే సామర్థ్యంతో ఈ పైప్లైన్ను ఏర్పాటు చేయగా... ఇప్పుడు ఇందులో 5 శాతం సామర్థ్యంతోనే ఇది నడుస్తోంది. రిలయన్స్ కేజీ–డీ6 క్షేత్రంలో అంచనాలతో పోలిస్తే భారీగా గ్యాస్ ఉత్పత్తి దిగజారడమే దీనికి కారణం. ఈ డీల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఆమోదం తెలిపింది. ఒప్పందం విలువను ఇరు కంపెనీలు బయటికి వెల్లడించలేదు. కాగా, భారత్ ఇంధన రంగంలో బ్రూక్ఫీల్డ్కు ఇదే తొలి పెట్టుబడి కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఈడబ్ల్యూపీఎల్ రూ.884 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.715 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. -
సూర్యారావుపేటలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సూర్యారావుపేట లైట్హౌస్ వద్ద గ్యాస్ లీకేజీ అయింది. రోడ్డు పక్కన చెట్లు కొడుతుండగా పొరపాటున గడ్డపార పైప్లైన్లోకి దిగబడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో భాగ్యనగర్ పైప్లైన్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని వెంటనే మరమ్మతులు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement