-
వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ దాడి
యడ్లపాడు (చిలకలూరిపేట) : వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం వేదికగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు వైఎస్సార్సీపీ వర్గీయులు గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలు గ్రామం బొడ్డురాయి సెంటర్లో వైఎస్సార్సీపీ వర్గీయులు వినాయక చవితి పందిరి ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని గురువారం నిమజ్జనం చేసేందుకు మ.12 గంటల కు భారీ ఊరేగింపుతో బయల్దేరారు. దివంగత సీఎం వైఎస్సార్ పాటలతో ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ వర్గీయుడు బాసా నాగరాజును టీడీపీ వర్గీయుడు బాసా రాంబాబు కుమారుడు సైకిల్తో వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో నాగరాజు.. జనాన్ని చూసి వెళ్లమని వీపును చరుస్తూ చెప్పాడు. అనంతరం మైదవోలు–లింగారావుపాలెం గ్రామాల మధ్య ఉన్న పీబీసీ కెనాల్ వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. రాత్రి 8 గంటలకు నాగరాజు ఇంటిపైకి టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా వచ్చారు. తమ పిల్లవాడిని కొట్టారంటూ దుర్భాషలాడుతూ రాళ్లతో దాడికి దిగారు. ఘటనలో వైఎస్సార్సీపీకి చెందిన బాసా నాగరాజు, కాసినబోయిన నాగేంద్రబాబులకు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలు యడ్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చి బాధితులతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మరోమారు దాడి.. కాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ శ్రేణులపై ఘర్షణకు దిగారు. సెంట్రింగ్ కర్రలు, పదునైన ఆయుధాలతో దాడిచేశారు. ఘటనలో బాసా కోటేశ్వరరావుకు తీవ్రంగా గాయాల య్యాయి. కడుపు భాగంలో లోతుగా తెగడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ టీడీపీ వర్గీయులు బాసా సర్వేశ్వరరావు, రామాంజనేయులు, రాంబాబు, పేరయ్య, శ్రీను, చిన్న శ్రీను, కోటేశ్వరరావు, చిన్న కోటేశ్వరరావులపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. కాగా పోలీసులు మైదవోలులో 144 సెక్షన్ విధించి పికెట్ ఏర్పాటు చేశారు. -
'గంగలోనే గణేశ్'పై భగ్గుమన్న వారణాసి
వారణాశి: ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో హిందూత్వ ప్రతినిధులు, పోలీసులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. హిందూత్వ సంస్థల ప్రతినిధులపై సెప్టెంబర్ 22న జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ ఈరోజు (సోమవారం) ఉదయం నిర్వహించిన ర్యాలీ.. చివరికి హింసాయుతంగా మారింది. ఒక దశలో పోలీసు బలగాలపై రాళ్లదాడికి పాల్పడ్డ ఆందోళనకారులు.. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. కొద్ది నిమిషాల్లోనే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. నగరంలోని దశాశ్వమేధ, చౌక్, కొత్వాలీ, లుక్సా ఏరియాల్లో సోమవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. గణేశ్ విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేసే విషయంలో ప్రభుత్వాధికారులకు, మండపాల నిర్వాహకులకు మధ్య తలెత్తిన విబేధాలే ప్రస్తుత అల్లర్లకు మూల కారణం. క్లీన్ గంగా ప్రాజెక్టులో భాగంగా గణపతి విగ్రహాలను సైతం గంగా నదిలో నిమజ్జనం చేయరాదంటూ అధికారులు నిర్ణయించారు. అయితే మండపాల నిర్వాహకులు మాత్రం 'గంగలోనే గణేశ్ నిమజ్జనం జరగాలి' అని పట్టుపట్టారు. ప్రభుత్వాధికారుల తీరును నిరసిస్తూ సెప్టెంబర్ 22న పలువురు ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న లాఠీచార్జిలో పలువురు వీహెచ్ పీ, బజరంగ్ దళ్ నేతలు గాయపడ్డారు. అప్పటినుంచి చిన్నా చితకా సంఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ సోమవారం నాటి ర్యాలీ వారణాసిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
మంచి సేయనోడు.. మతలబులు సేత్తన్నాడు
No Headline
నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇలా
చూపుడు వేలు లేకుంటే సిరాచుక్క ఎక్కడ?
గత చరిత్రను మార్చిన నేతకే నా ఓటు
అన్ని పనులు సక్కగా జరుగుతున్నాయి..
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement