Advertisement
-
18 ఏళ్ల లోపు వారికి త్వరలో టీకా
గాంధీఆస్పత్రి/బౌద్ధనగర్ (హైదరాబాద్): కరోనా నియంత్రణకు త్వరితగతిన ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని సోమవారం సందర్శించిన ఆయన కోవిడ్ వార్డులో బాధితులను పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు 58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామన్నారు. తెలంగాణకు 1.68 కోట్ల డోసులు కేంద్రం అందించిందని, మరో 13 లక్షల 18 వేల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 18 ఏళ్ల వయసు లోపు వారికి కోవిడ్ టీకా ట్రయల్రన్ సక్సెస్ అయిందని, త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. సికింద్రాబాద్లోని 19 వ్యాక్సిన్ సెంటర్లలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన ఎంపీ ల్యాడ్స్ నిధులు నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా తీవ్రత ఇలాగే కొనసాగితే ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యం పథకం కొనసాగించేందుకు ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. కాగా, ఇటీవల జరిగిన జన ఆశీర్వాద యాత్రలో కారు డోరు తగిలి నుదుటికి అయిన గాయానికి కేంద్రమంత్రి గాంధీఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం బ్లాక్ఫంగస్, కోవిడ్ వార్డులను సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజారావు, డిప్యూటీ నర్సింహరావు నేత, నోడల్ అధికారి ప్రభాకర్రెడ్డి, ఆర్ఎంఓ నరేందర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బౌద్ధనగర్లో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సోమవారం సందర్శించారు. -
Gandhi Hospital: హే గాంధీ!
సికింద్రాబాద్: పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయం వంటి గాంధీ ధర్మాస్పత్రిలో ఇరువురు మహిళలపై అఘాయిత్యం జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన ఒక మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఆస్పత్రి ఆవరణలో స్పృహలేకుండా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో మహిళ ఆచూకీ సోమవారం రాత్రి వరకు లభించలేదు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్నగర్ జిల్లా వేపురిగేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు అటెండెంట్లుగా ఆయన భార్య, మరదలు(భార్య సోదరి) గాంధీ ఆస్పత్రికి వచ్చారు. గాంధీ ఆస్పత్రి ఉద్యోగి అయిన జేఎస్సీ ఉమామహేశ్వర్ రోగికి బంధువు అవుతాడు. ఇంతకాలం ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఉద్యోగం చేసిన ఉమామహేశ్వర్ ఇటీవలే రిసెప్షన్కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో అటెండెంట్లుగా ఉంటున్న ఇరువురు మహిళలు ఈ నెల 8 నుంచి కనిపించకుండా పోయారు. తన తల్లితో పాటు చిన్నమ్మ కనిపించకపోడంతో రోగి కుమారుడు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. 11న ఆ వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. ఈ నెల 15న మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆ వ్యక్తి కుమారుడు తమకు బంధువైన ఉమామహేశ్వర్తో కలసి గాంధీ పరిసరాల్లో వెతకగా, ఆస్పత్రి భవనం సమీపంలోని చెట్ల పొదల్లో అతడి చిన్నమ్మ స్పృహలేకుండా, వివస్త్రగా కనిపించింది. చిన్నమ్మను తమ గ్రామానికి తీసుకెళ్లి ఆరా తీయగా, ఉమామహేశ్వర్ అతడి స్నేహితులు తనకు, సోదరికి మత్తు కలిపిన మద్యం ఇచ్చి కిడ్నాప్ చేశారని తెలిపింది. ఆస్పత్రిలోని సెల్లార్లో బంధించి తనపై వారు అత్యాచారం చేశారని వెల్లడించింది. తాను తప్పించుకుని బయటపడ్డానని, అయితే తన సోదరి ఎక్కడ ఉందో తెలియట్లేదని మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. గాంధీ ఆస్పత్రి తమ పరిధి కాదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి చిలకలగూడ పీఎస్కు వచ్చి ఫిర్యాదు చేసింది. నాలుగు బృందాలు ఏర్పాటు: ఏసీపీ వెంకటరమణ గాంధీ అత్యాచారం ఘటనకు సంబంధించి దర్యాప్తు కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు. గాంధీలో చికిత్స తీసుకున్న రోగి భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించడం కోసం ఆమెను భరోసా కేంద్రానికి పంపించామన్నారు. వివరాలు రాగానే దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామన్నారు. అత్యాచారం ఘటన గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోనే జరిగిందా లేదా బయట జరిగిందా అన్న విషయాలపై దర్మాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన చిలకలగూడ పోలీసులు నిందితుడిగా భావిస్తున్న గాంధీ ఉద్యోగి ఉమామహేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ సంజయ్కుమార్ విచారణ ప్రారంభించారు. బాధితురాలు పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పట్లేదని, విచారణకు సహకరించట్లేదని పోలీసులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన రోగి భార్య ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురు మహిళలకు మద్యం అలవాటు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, ఉమామహేశ్వర్ వారిని కిడ్నాప్ చేసి, బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
‘గాంధీ’ ఫైల్స్ గంటల్లో క్లియర్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్యప్రదాయిని సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. శనివారం గాంధీఆస్పత్రిని సందర్శించిన ఆయన సుమారు రెండు గంటల పాటు కలియతిరిగి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించారు. ►డ్రైనేజీ, ఫైర్ఫైటింగ్ సిస్టం, వాటర్ లీకింగ్తోపాటు ప్రధానమైన సమస్యలను సూపరింటెండెంట్ రాజారావు ఆయనకు వివరించారు. ►డ్రైనేజీ పైప్లైన్లు పాడైపోవడంతో మురుగునీరు ఆస్పత్రి సెల్లార్ను ముంచెత్తుతుందని, సెల్లార్లో డైట్ క్యాంటిన్, మెడికల్ ఫార్మసీ, దోబీఘా ట్, ఫిజియోథెరపీ తదితర సేవలు అందిస్తున్నామని డాక్టర్ రాజారావు వివరించారు. ►భవన సముదాయం నిర్మించి 18 ఏళ్లు కావడం తో లీకేజీలతో తరుచు విద్యుత్ షార్ట్సర్యూ్కట్ జరిగి విలువైన వైద్యపరికరాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, గోడలు, పైకప్పులు పెచ్చు లు ఊడి పురాతనభవనాన్ని తలపిస్తుందన్నారు. ►ఫైర్ఫైటింగ్ సిస్టం కోసం దశాబ్ధకాలంగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని, సీసీ కెమెరాల నిర్వహణ ఫైల్ పెండింగ్లో ఉందని, ఆస్పత్రి ప్రాంగణంలోని సుమారు 10 దుకాణాలు ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కోర్టును ఆశ్రయించి ఇబ్బంది పెడుతున్నారని. సుమారు రూ.3 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆస్పత్రి తరుపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని నియమిస్తే కోర్టు వాజ్యాలు పరిష్కారం అవుతాయని కోరారు. ►సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, రోజుకు 39 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంతోపాటు 650 వెంటిలేటర్ పడకలు కలిగిన గాంధీ భవన సముదాయంలో శానిటేషన్, సె క్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ సిబ్బందిని మరిం త పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. సంబంధిత ఫైల్స్ తీసుకుని తన వద్దకు వస్తే తన పరిధిలో ఉన్న సమస్యలను గంటల వ్యవధిలో పరిష్కరిస్తారనని, మరికొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్తానని కలెక్టర్ శర్మన్ అన్నారు. వైద్యసేవలపై ఆరా... పలు విభాగాల్లోని వార్డులను సందర్శించిన కలెక్టర్ శర్మన్ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సెల్లార్, డ్రైనేజీ వ్యవస్థ, పంప్హౌస్, ఆక్సిజన్ ప్లాంట్స్, డైట్ క్యాంటీన్లను పరిశీలించారు. బ్లాక్ ఫంగస్, కోవిడ్ వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ శర్మన్ కోవిడ్ యాంటిజెన్ ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్లతోపాటు సీటీ స్కానింగ్ చేయించుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కార్యక్రమంలో డిప్యూటీలు నర్సింహారావునేత, శోభన్బాబు, నోడల్ అధికారి ప్రభాకర్రెడ్డి, ఆర్ఎంఓ–1 నరేందర్కుమార్, ఆఫీస్, నర్సింగ్ సూపరింటెండెంట్లు విజయ్భాస్కర్, మంగమ్మలతోపాటు వైద్యులు, సిబ్బంది, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు. -
హమ్మయ్యా.. ఇక ఆక్సిజన్ కొరత ఉండదేమో?
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ సెంటరైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. సుమారు రెండున్నర కోట్ల రూపాయల పీఎం కేర్ నిధులతో నిర్మించిన ఈ కేంద్రంలో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే రెండు యంత్రాలను సిద్ధం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ ప్లాంట్ను సందర్శించి నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డిలు ఆక్సిజన్ తయారీ ప్లాంట్ను పరిశీలించి పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన ఆక్సిజన్ ప్లాంట్ రెడీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయినట్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టరు ఆస్పత్రి పాలనా యంత్రాంగానికి తెలిపారు. శుక్ర, శనివారాల్లో ప్లాంట్ను అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ తయారు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ సమీపంలోని లైబ్రరీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన పడకలకు అనుసంధానం చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. (చదవండి: Telangana Police: వర్రీలో వారియర్స్) -
విధులు మరచి టిక్టాక్
హైదరాబాద్: టిక్టాక్.. మాయలో పడి కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే, మరికొందరు ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉంటూ టిక్టాక్ వీడియోలు చేసిన ఇద్దరు అప్రెంటీస్ విద్యార్థులను శుక్రవారం విధుల నుంచి తొలగించారు. రాంనగర్ సాధన పారా మెడికల్ కాలేజీకి చెందిన శ్యామ్మిల్టన్, అత్తాపూర్ జెన్ ఒకేషనల్ కాలేజీకి చెందిన వీణాకుమారీ.. గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో శిక్షణ కోసం అప్రెంటీస్లుగా చేరారు. విధులను మరచి ఫిజియోథెరపీ విభాగంలోనే పలు టిక్టాక్ వీడియోలు చేశారు. ఆ వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆస్పత్రి పాలనాయంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టిక్టాక్ వీడియోలు చేసిన శ్యామ్మిల్టన్, వీణా కుమారీని విధుల నుంచి తొలగించి ఆయా కాలేజీలకు సరెండర్ చేశామని ఆర్ఎంఓ–1 జయకృష్ణ తెలిపారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. వైరల్గా మారిన టిక్టాక్ వీడియోలు చేసిన వారు గాంధీ ఆస్పత్రిలో కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే వచ్చారని స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement