-
క్షమయే దైవము
క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి? అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి! గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు. అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు. ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం. – అమ్మాజీ ఉమామహేశ్వర్ -
క్షమాగుణం సఫల జీవితానికి చుక్కాని
తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు.ఎవరి వలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాల పునరుద్ధరణ జరగడంతోబాటు మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడిని దూరం చేసుకున్నామన్న మాట. మనిషి అనగానే కొన్ని బంధాలకు అనుబంధాలకు లోబడి వుంటాడన్నది నిజం. అందులో తన కుటుంబీకులే గాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా వుంటారు. అయితే ఈ అనుబంధాలు ఎల్లవేళలా ఒకేలా వుండవు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావొచ్చు. దాంతో మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ప్రస్తుత కాలంలో ఆ సంబంధాలు చెడిపోయినా, ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తిని ఇచ్చినవే. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయని ఆలోచిస్తే, కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్థికపరమైనవి కాగా, కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఒకటి కావటంతో కూడా కొన్ని బంధాలు ఎంతోకాలం నిలిచే వీలుంది. భౌతిక రూపానికి కూడా కొందరు ఇష్టపడతారు. అలా దగ్గరవుతారు. ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది. అక్కడే వచ్చిన చిక్కల్లా. కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు. మరికొందరికి అది కుదరకపోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో వున్న అనుబంధంలో తేడా వస్తుంది. అది ఒకోసారి పలకరింపులు కూడా లేని స్థితికి తీసుకువెళుతుంది. అసలు బంధమే చెడిపోయే స్థితికి పడిపోవచ్చు లేదా అసలు బంధమే తెగిపోయి, ఎడముఖం పెడముఖంగా మారిపోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడో మనకు అనిపించవొచ్చు... అయ్యో ఇదేమిటీ ఇలా చేసుకున్నాము అని. అటువంటి పరిస్థితి రాకుండా వుంటే బాగుండేది అనిపించవొచ్చు. ఇలాంటి భావన తర్వాతి కాలంలో కలుగవొచ్చు. కొన్ని సందర్భాలలో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నా కుదరని మానసిక స్థితి వెంటాడుతుంది కూడా. ఇలా చెడిపోవడానికి కారణం అవతలి వారిది అయినా కూడా తప్పు అర్ధం అయినా , తిరిగి సంబంధాలు తిరిగి కావాలని అనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమా గుణాన్ని ప్రదర్శించటం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేదేకాని తగ్గించేది మాత్రం కాదు. ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతలివారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు వుండి వుండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి, మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధాలను చెడకొట్టుకోవడం మంచిది కాదు. అది సరి అయిన పద్ధతి కాదు. తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు. ఎవరివలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాలను పున రుద్ధరించుకోవటం, మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లవుతుంది. ఇది ఒక కొత్త అనుభూతిని కలుగ చేస్తుంది. మనుష్యులకు దగ్గర అయ్యే కొత్త ప్రయత్నం మొదలవుతున్నట్లే కదా. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అర్థం లేని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టాలి. అసలు ఆ బంధం తెగకుండా వుంటే బాగుండేదన్న ఆలోచన రాగానే, తిరిగి మనలను గతంలోకి తీసుకువెళుతుంది. కొందరు ఇదంతా కర్మ ఫలం అంటారు. అయితే ఇక్కడ ఆ కోణంలో కూడా ఆలోచిస్తే, ఇతరుల వలన మనం పడిన కష్టాల ఆలోచన వదిలి, మనం ఇతరులకు చేసిన, కలిగించిన ఇబ్బందుల గురించిన ఆలోచన మొదలవుతుంది. గతంలో మన వలన చెడిపోయిన సంబంధాల ఆలోచన చేస్తే మన తప్పు ఉందన్న విషయం అర్ధమవుతుంది. సొంత తప్పులను ఒప్పుకోవటం అంటే ఒక మెట్టు దిగడం కాదు. వాస్తవాన్ని అంగీకరించడం. ఆ తప్పు ఒప్పుకుంటే అది మనలోని అహాన్ని హరిస్తుంది. ఆ తర్వాత ఇక ఇతరుల తప్పులను క్షమించడం అంత కష్టం కాదు. సులభంగా క్షమించ గలుగుతారు. మనుషులన్న తర్వాత, ఈ నవనాగరిక లోకంలో, ఈ యాంత్రిక ప్రపంచంలో తప్పులు చేయకుండా వుండరు. అసలు మనకు ఎవరైనా ఎందుకు ఈ విధంగా చేశారు అనే ఆలోచన వస్తే పలురకాల సమాధానాలు కనిపిస్తాయి. వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి మానసిక ప్రశాంతత అనేది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. ఇక మనం తృప్తి, అశాంతి, ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకోవాలి. కసి, కోపం, ద్వేషంతో అశాంతిని మూటకట్టుకోవాలా లేక క్షమించి కొత్త జీవితం ప్రారంభించాలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే వుంది. క్షమాగుణానికి సుఖ శాంతులను చేకూర్చే మహత్తరమైన గుణం ఇమిడి వుంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా వుండే అవకాశం ఉంటుంది. క్షమ సఫల జీవితానికి చుక్కాని. క్షమ ఒక ఆయుధం, దాన్ని ధరించితే దుర్జనుడేమీ చేయలేడు. ప్రతీకారేచ్ఛ లేకపోవడమే సహనం. ఓరిమిని కూర్చిన సద్గుణం మరొకటిలేదు. ఇక క్షమించడం మనందరం నేర్చుకుందాము. హాయిగా జీవిద్దాం. – డా. పులివర్తి కృష్ణమూర్తి -
నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా? వేచి చూడాలి కాగా 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్ అనే నలుగురు దోషులుగా (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు. సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp — Indira Jaising (@IJaising) January 17, 2020 -
సారీ చెప్పిన సుప్రీంకోర్టు జడ్జి
న్యూఢిల్లీ: కేసులో వాదనలు వినిపిస్తున్న ఓ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ నేరం మోపుతానంటూ బెదిరించిన సంఘటనలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా గురువారం క్షమాపణ చెప్పారు. తమతో వ్యవహరించే విషయంలో ఓపికగా ఉండాలన్న సీనియర్ న్యాయవాదుల సూచనకు అంగీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా... తన వైఖరి కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. భూ సేకరణకు సంబంధించిన కేసులను చూస్తున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహిస్తుండగా మంగళవారం ఒక కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న లాయర్ గోపాల్ శంకర నారాయణన్ను కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తానని బెదిరించారు. ఈ విషయంపై కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, అభిషేక్ సింఘ్వీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ ఖన్నా తదితరులు గురువారం జడ్జిని కలిసి జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ‘ఏ సమయంలోనైనా ఎవరైనా ఏదైనా అనుకునిఉంటే చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
మన్నించు మిత్రమా
ఒక జర్మన్ యాత్రికుడు చాలా దూరం ప్రయాణించి ఒక ఆధ్యాత్మిక గురువును దర్శించుకునేందుకు వచ్చాడు. ప్రయాణ బడలికలో చికాకుగా ఉన్న అతను విసుగ్గా బూట్లను విప్పి ఒక మూలకు విసిరేసి ఎదురుగా మూసి ఉన్న తలుపును కాలితో బలంగా తన్ని తెరిచి లోపలికి ప్రవేశించి గురువుకు నమస్కరించాడు. గురువు అతనితో ‘‘నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ముందు వెళ్లి ఆ తలుపునకు, నీ బూట్లకు క్షమాపణ చెప్పిరా’’ అన్నాడు. దానికతను ‘‘తలుపు నకు, బూట్లకు క్షమాపణ చెప్పమంటారేమిటి? వాటికి జీవముందా?’’ అని అడిగాడు. ‘‘తలుపును తన్నినప్పుడు, బూట్లను విసిరేసినప్పుడు వాటికి జీవం లేదు అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు. కానీ, నేను వాటికి క్షమాపణ చెప్పమన్నప్పుడు మాత్రం ఆ సంగతి నీకు గుర్తొచ్చిందా? ముందు వెళ్లి వాటికి క్షమాపణ చెప్పిరా. అంతవరకు నేను నీతో మాట్లాడను’’ అన్నాడు. ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తాను ఇంత చిన్న విషయానికి ఆయనతో మాట్లాడకుండా వెళ్లిపోవడం సమంజసం కాదని గురువు చెప్పినట్లుగా తలుపు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, ‘‘కోపంలో నిన్ను అనవసరంగా తన్ని బాధపెట్టాను. నన్ను మన్నించు’’ అని వేడుకున్నాడు. అలాగే బూట్ల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, ‘‘మిత్రులారా! మిమ్మల్ని ఒక మూలకు విసిరేసి అవమాన పరిచాను. నా తప్పును మన్నించండి’’ అని వేడుకున్నాడు. ఇలా చేసిన వెంటనే అతని మనసులోని అలజడి మాయమై అనిర్వచనీయమైన ప్రశాంతత చోటు చేసుకుంది. క్షమాపణ తంతు ముగించి గురువు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. గురువు అతనిని చూసి నవ్వుతూ, ‘‘ఇప్పుడు నాకు బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకుందాం’’ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ జీవులను, మనల్ని జీవులుగా ఉంచేవాటినీ ప్రేమించాలి. ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement