-
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న యూత్.. ఇలా తయారయ్యారేంటి?
నేటి తరం.. ఒక కన్ఫ్యూజన్. తానేంటో తనకే తెలియదు. తనకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలో తెలియదు. అవతలి వ్యక్తి పర్సనాలిటీని కనిపెట్టలేరు. ఉద్రేకంతో మోహించి , అదే ప్రేమ అని భ్రమించి పెళ్ళాడి , మోజు తీరగానే కొట్లాడి పెటాకులు తెచ్చుకొని, ఇక పెళ్లి యుగం అయిపోయిందని తీర్పులు ఇస్తున్న చదువుకొన్న నాగరికులు. అయినా తప్పు వీళ్లది కాదు వీళ్ల చదువులది. అది అమెరికాలో ఉద్యోగం అయితే ఇప్పించింది. కానీ ఎలా బతకాలో చెప్పలేదు. ఇంకేముంది బతుకు బస్టాండ్ ,ఆపై డిప్రెషన్లు, సూసైడ్లు... పెళ్ళయితే ?.. భార్య భార్య / భర్త , పిల్లలే సంసారం. పెళ్లికి లీవ్, హనీమూన్కి లీవ్, మెటర్నిటీ లీవ్.. పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే రెండు, మూడు రోజులు లీవ్. భార్య,భార్తల్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా మరొకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదేమంటే, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే ఉద్యోగం అంటారు. ఇప్పుడప్పుడే పెళ్లి గట్రా వద్దంటున్నారు ఈ బ్రహ్మచారులు. 30దాటినా.. అప్పుడే పెళ్లికి, లివ్ఇన్కి తొందరేముంది? అంటూ నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఆపై ఉద్యోగమే సర్వస్వం అనుకొని కంపెనీ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఆఫీస్ జిందాబాద్, పెళ్లి, కుటుంబం డౌన్డౌప్ అంటూ పిచ్చి వాగుడు వాగేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి కుటుంబం ఛిన్నాభిన్నమేనా? మావోయిస్టుల కాలంలో చైనాలో.. “కుటుంబ వ్యవస్థ మనిషిలో స్వార్థాన్ని పెంపోందిస్తుంది.. కానీ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తేనే అసలుసిసలు కమ్యూనిజం వస్తుంది” అని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ కొన్నాళ్లకే అది తస్సుమంది. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కాపిటలిస్ట్ అమెరికాలో బహుళ జాతి కంపెనీలు.. కంపెనీ బానిసలను తయారుచేయడం కోసం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి. మన దగ్గర్నుంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మనోళ్లు(కొత్తతరం) ఈ ట్రాప్లో పడిపోయి పెళ్లి శకం ముగిసింది అని బ్రహ్మచారి జీవితానికి సిద్ధమయిపోతున్నారు. -ఈ వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు మన దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇంకా ఈ ట్రెండ్ ముదిరిపోక ముందే వేకప్ కాల్ అనుకొని పరిస్థితులను సమీక్షిస్తే మంచిది. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
వాటిపై మోజు,ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు...కారణమిదే!
కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు.. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ కూలి పోతుంది అనే అభిప్రాయం ఈమధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ..తూ...మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుషులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతోంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు!అసలు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అతి తెలివి చిన్న తప్పును కూడా భరించే శక్తి,సహనం లేవు. అందరూ సమానమే అనే వింత భావన పెరగటం (డెమాక్రసి). పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకోక పోవడం. ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు, ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు.కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది. చిన్న చిన్నదానికీ అలిగి, దగ్గరి వారికి కూడా దూరం అవుతున్నారు. ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది . ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం. ఇంట్లో భార్యా భర్తలు (తల్లిదండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసుకుంటున్నారు.అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. "ముఫై దాటినా" పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత ముఫై నలభై ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు. ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం, తదితర కారణాలు అధికమయ్యాయి . మనుషులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ విలాస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెగింపుతనం వచ్చింది. మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవరిష్టం వారిదే అయ్యింది. కుటుంబ నిర్వహణ ఒక కళ. అది అందరికీ లేకపోవడం వల్ల వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది. మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను, నా భార్య/భర్త, అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది.పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు ఇక ఉండవు. ఎవరిష్టం వాళ్లదే అయ్యే రోజులు వచ్చేశాయి. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో.. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. డిజిటల్ ప్లాట్ఫాంపై ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. మెరుగైన ప్యాకేజీలు, విలాస జీవితాలపై మోజు పెంచుకుంటున్న యువతులు సాధారణ ఉద్యోగులను పెళ్లి చేసుకునే పరిస్థితి రావడం లేదు. 30 ఏళ్లు దాటిపోతున్నా ఎంతోమంది యువకులు పెళ్లిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఇదంతా ఊరికే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే!! -
అసలే లవ్ మ్యారేజ్.. స్వేచ్ఛ ఎక్కువే.. ఇంకేముంది.. పెళ్లయిన మూణ్ణాళ్లకే పెటాకులు!
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం పోలీస్స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు. విభేదాలకు కారణాలు.. ►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33% ►వరకట్న వేధింపులు – 31% ►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26% ►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5% ►ఇతర కారణాలు – 5% చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు. – వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. – ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్ -
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రెండు ముసలి ప్రాణాలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. అందులో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న రెండు ముసలిప్రాణాలు.. పలకరించే నాథులు లేరు.. అవసరమైతే ఆదుకునే ఆప్తులు కరువు.. పిల్లలు ఉన్నా ఎక్కడో.. ఏ దేశంలోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉద్యోగాలు చేస్తూ వారి బతుకు వారిది.. వీరి బతుకు వీరిది.. ఒంటరి జీవితం.. నేడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.. కొడుకులూ, కోడళ్లూ.. కూతుళ్లూ, అల్లుళ్లూ.. మనవళ్లు, మనవరాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నా.. లోలోపల తమ బిడ్డలు తమతో లేకపోతిరే అనే ఆవేదన ఏదో ఒక మూలన ఆ ముసలి ప్రాణాలను తోడేస్తూనే ఉంటుంది.. ఇలా వృద్ధదంపతులు నేడు ఒంటరి పక్షులుగా మారిపోయారు.. మీరక్కడ.. మేమిక్కడ అన్నట్లుగా తల్లిదండ్రులు.. పిల్లలూ తలొకచోట ఏకాకులుగా మారి కుటుంబ వ్యవస్థ కడు దయనీయంగా మారింది. సాక్షి, నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరికి జీవితంలో వారి కుటుంబం ముఖ్య భూమిక పోషిస్తుంది. కానీ నేడు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నామైపోతోంది. ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించని పరిస్థితి. ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మారిన జీవన విధానం, సంపాదన, ఉద్యోగంతో చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. బంధుత్వాలు తగ్గాయి. బంధువులు దూరమవుతున్నారు. చిన్నారులు, యువత.. చదువు, ఉద్యోగాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉండగా నేడు పల్లెల్లోనూ ఇలాంటి కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు ఏకాకులుగా మిగిలిపోతున్నారు. మారిన పరిస్థితులతో.. ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పరంగా సమస్యలు సృష్టించి మనుషులను వేరు చేస్తున్నాయి. ప్రస్తుత నాగరిక సమాజంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో ఆర్థిక వనరులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ధరల ప్రభావంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. జల్సాలు, ఉన్నతమైన జీవనం అలవడుతున్నాయి. దీంతో సంపాదనపై మోజు పెరిగింది. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళుతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ఈ కార్యక్రమాలతో బిజీగా కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇతర దేశాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లితండ్రులు ఒంటరిగా మారడం, కుటుంబాలు విడిపోవడం జరుగుతోంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. తమ పిల్లలు రూ.లక్షలు సంపాదించారని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పిల్లలు తమ వద్ద లేని తమ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. సంపాదన, ఉన్నత స్థానానికి చేరడం నిజమైన ఆనందం కలిగించదని, తరచి చూస్తే అదంతా నీటిబుడగే అని చెబుతున్నారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ కళ్ల ఎదుటే ఉంటే తల్లితండ్రులు ఆనందపడతారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఏడాది పొడవునా బిజీగా గడిపినా ఏదైనా పండగకు పది రోజులు వచ్చి వెళితే.. మిగిలిన 355 రోజులు ఆ జ్ఞాపకాలతో బతికేస్తున్నామని చెప్పుకుంటుంటారు. కానీ విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది రెండు మూడేళ్ల కొకసారి వచ్చి వెళుతుంటారు. మళ్లీ ఎప్పుడు వస్తారా అని కన్నీటితో ఎదురుచూస్తున్న తల్లితండ్రులు అనేక మంది ఉంటున్నారు. ఆదరణ లేని కొందరు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ఇరుగుపొరుగుతో మాటలు కలపాలి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ రచ్చబండ, వీధుల్లో కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఇరుగుపొరుగు వారు కలసిమెలసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారితో మాటలు కరువయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవిస్తున్నారు. జీవితం సాఫీగా సాగాలంటే పది రూపాయలతో కాదు పది మందితో జీవితం పంచుకోవాలన్న మాట వాస్తమనేది గ్రహించాలి. అది బలపడితే కష్టసుఖాలు పంచుకునేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అందరూ ఉన్నా ఏకాకులే కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరంలో ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో కుటుంబాలు ఉన్నా.. అగ్గిపెట్టెలాంటి గదుల్లో ఇరుక్కుపోయి జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పండగ, పబ్బాల సమయంలో ఒకరినొకరు చూసుకునే వింత ధోరణిలో అపార్ట్మెంట్ జీవితాలు సాగుతున్నాయి. కలసి ఉన్నా కలివిడితనం తక్కువగానే ఉంటోంది. పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారంటే మానవీయ విలువలు ఎంత దిగజారుతున్నాయో అర్థమవుతోంది. ఏటా వృద్ధుల శాతం కూడా పెరుగుతోంది. వారు 2001లో 4.5 శాతం ఉండగా నేడు అది 6.0 శాతానికి చేరింది. 2050 నాటికి 30 శాతానికి చేరుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక శాతం వయోవృద్ధులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మంచి ఉద్యోగం కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇది తప్పని అనుకోకూడదు. ఎవరికైనా భవిష్యత్ ముఖ్యమే. అలా అని తల్లిదండ్రులను దూరం చేసుకోవడం చాలా తప్పు. లేటు వయస్సులో వారికి కావాల్సింది డబ్బు, సౌకర్యాలు కాదు. స్వాంతన కలిగించాలి. పిల్లల నుంచి వారు ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అప్పుడే వారి చివరి మజిలీ ఆనందంగా సాగిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఆ కోరిక తీరకుండానే మరణిస్తున్నారు. – డాక్టర్ శ్రీనివాసతేజ, మానసిక వ్యాధుల నిపుణుడు నెల్లూరు జిల్లాలో ప్రస్తుత జనాభా – సుమారు 32 లక్షలు 2011 లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 29 లక్షలు జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు – సుమారు 150 వీరిలో వృద్ధులు – సుమారు 7 లక్షలు ఆశ్రయం పొందుతున్న వృద్ధులు – సుమారు 3000 మంది -
బంధాలను కాపాడుకోవాలి!
ఆత్మీయం కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడు! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? దురదృష్టవశాత్తూ పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు... కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి... దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి. దీని నుంచి బయట పడాలి. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, అప్పులతోనో, సమస్యలతోనో, ఒంటరితనంతోనో అలమటిస్తున్న వారిని బాధపడవద్దని వెన్నుతట్టి ‘నీకు నేనున్నాను, మనందరికీ పైన దేవుడున్నాడు’ అని ఓదార్చడం వారికి ఎంత ఉపశమనాన్నిస్తుందో తెలుసా? ప్రయత్నించి చూడండి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement