-
Telangana: ఎంసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్ విభాగానికి చెందిన ఎంసెట్ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఎంసెట్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. 16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో ఈనెల 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
విజయవాడలో ఎంసెట్ రద్దీ
► తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు ► ప్రశాంతంగా పరీక్ష ► మండుటెండలో విద్యార్థుల అవస్థలు ► కిటకిటలాడిన బస్స్టేషన్ విజయవాడ : ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో విజయవాడలో రద్దీ నెలకొంది. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. ఎంసెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల, వారి తల్లిదండ్రులు కార్లు, బైక్లు, ఇతర వాహనాల్లో వేలాది తరలిరావడంతో మధ్యాహ్నం, సాయంత్రం రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇంజినీరింగ్ పరీక్ష ముగి శాక ఇంటికి వెళ్లేవారు, మెడిసిన్ పరీక్ష రాసేందుకు వచ్చేవారితో ట్రాఫిక్ రీద్దీ ఏర్పడింది. బందరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, ఏలూరు రోడ్డు ట్రాఫిక్ వల యంలో చిక్కుకున్నాయి. కొన్ని సెంటర్ల వద్ద చివరి క్షణాల్లో విద్యార్థులు పరుగులు తీసి పరీక్షహాళ్లకు చేరుకున్నారు. విజయవాడ రీజన్లో 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 22,405 మంది హాజరవగా, 842 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ పరీక్షకు 18,984 మందికి 18,481 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్లో 96.37 శాతం, మెడిసిన్లో 97.35 శాతం మంది హాజరయ్యార కో-ఆర్డినేటర్ రత్నప్రసాద్ చెప్పారు. సకాలంలో హాజరైన విద్యార్థులు ఎంసెట్ ప్రవేశ పరీక్షకు క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు మందుగానే ప్రకటించడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 86 పరీక్ష కేంద్రాల పరిధిలో 15 మంది ప్రత్యేక పరిశీలకులు, 48 మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 48 మంది పరిశీలకులు, 1760 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. పరీక్ష హాళ్లలోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతించకపోవడంతో సిద్ధార్థ, లయోల కళాశాలల వద్ద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎండ తీవ్రతతో ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని చెట్ల కింద, కాలేజీలు ఏర్పాటుచేసిన షామినాయాల కింద సేదతీరారు. 400 ఉచిత బస్సులు ఎంసెట్ పరీక్షలకు నగరంలో నడుస్తున్న 400 సిటీ బస్సులలో విద్యార్థులను ఉచితంగా అనుమతించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 40 బస్సులు నడిపామని పేర్కొన్నారు. అయితే పరీక్షల సమయంలో ఈ బస్సులు నామమాత్రంగా నడిచాయని విద్యార్థులు ఆరోపించారు. కొందరు కండక్టర్లు తిరుగుప్రయాణంలో టికెట్లు కొట్టి చార్జీలు వసూలు చేశారని తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేసన్ కిటకిట ఎంసెట్ పరీక్షలు ముగిసి కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో సిటీ బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి. బస్స్టేషన్, రైల్వేస్టేషన్ రద్దీగా మారాయి. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ వెళ్లే విద్యార్థులు బస్సులు, రైళ్ల కోసం ఎగబడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement