-
చైనాపై ప్రతీకారం దిశగా భారత్!
న్యూఢిల్లీ: లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి జరిగిన ఘటనతో ప్రస్తుతం భారతదేశంలోని చైనా వ్యాపారాలు, ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కొబోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతంలో చైనా వస్తువులను నిషేధించాలని పిలుపునిచ్చిన భారత పౌరులను ప్రభుత్వం శాంతింపజేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో చైనాపై రెండు అంచెల ఆర్థిక ప్రతీకారానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష్య చర్య మొదటగా ప్రత్యక్ష్య చర్యలో భాగంగా ఇక మీదట భారత్ ప్రాజెక్టులను చైనా కంపెనీలకు కేటాయించకూడదని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దాంతో చైనా కంపెనీల వాటాలు ఇబ్బందుల్లో పడతాయి. ఇప్పటికే కేటాయింపులు పూర్తైన ప్రాజెక్ట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఈ చర్యల వల్ల మొదటగా ఇబ్బంది ఎదుర్కొనే చైనా కంపెనీ షాంగై టన్నెల్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్(ఎస్టీఈసీ). ఈ కంపెనీ ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ప్రాజెక్ట్ కోసం బిడ్ వేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం చైనా కంపెనీ అవకాశాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. (చైనా కుయుక్తులకు సాక్ష్యమీ ఫొటోలు!) ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఎన్సీఆర్టీసీ) నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ న్యూ అశోక్ నగర్, సాహిబాబాద్ మధ్య 5.6 కిలోమీటర్ల భూగర్భ విభాగానికి చెందిన నిర్మాణం. ఐదు భారతీయ, బహుళజాతి కంపెనీలు ఈ ప్రాజెక్టు కోసం తమ బిడ్లను సమర్పించాయి. ఎన్సీఆర్టీసీ ప్రకారం.. ఎస్టీఈసీ ఈ ప్రాజెక్ట్ కోసం- 1,126 కోట్ల రూపాయలను ఉటంకిస్తూ L-1 గా అర్హత సాధించింది. భారతీయ కంపెనీ ఎల్ అండ్ టీ రూ.1,170 కోట్లు కోట్ చేసి ఎల్ -2గా నిలిచినట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రాజెక్ట్ టెండరింగ్ నవంబర్లో జరగగా.. ఇండో-చైనా సరిహద్దు వివాదం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత జూన్లో ఆర్థిక బిడ్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చైనా కంపెనీ ఎల్-1గా నిలవడం పట్ల ప్రతిపక్షాలతో సహా, ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకత తెలిపింది. (జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..) దేశీయ కంపెనీలకు అవకాశం కల్పించడం ప్రాజెక్ట్ టెండరింగ్ అంశంలో భారత్ నిబంధనలను కఠినతరం చేస్తే.. స్వదేశీ కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే గతంలో పలు చైనా దిగ్గజ కంపెనీలు అతి తక్కువకు కోట్ చేస్తూ దేశీయ కంపెనీలకు పోటీగా నిలిచాయి. ఈ క్రమంలో ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘దేశీయ కంపెనీలు ఈ ప్రాజెక్ట్లను దక్కించుకునేందుకు వీలుగా నియమాలను మార్చబోతున్నారు. టెండర్ల విషయంలో అమలు చేసే టెక్నికల్ నిబంధనలను మరోసారి సమీక్షించనున్నారు. అదే విధంగా బిడ్లలో చైనా కంపెనీలను గుర్తించేలా మార్పులు చేయబోతున్నారు. అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజీనెస్లో భాగంగా చైనాకు కల్పించిన అవకాశాలను తగ్గించాలని’ చూస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ సరిహద్దు దేశాల ఎఫ్డీఐ నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. -
బిజినెస్ రూల్స్ మార్చేద్దాం!
- రాయితీల అంశాలు - ఆర్థిక శాఖకు వెళ్లకుండా మార్పులు - కేబినెట్ నిర్ణయం తర్వాత మూడు రోజుల్లోనే ఉత్తర్వులు - ప్రభుత్వ పెద్దల ప్రతిపాదనలు.. ఉన్నతాధికారుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక శాఖ చికాకులు సృష్టిస్తోంది.. ఆర్థిక ఫైళ్లపై నిబంధనల పేరుతో అడ్డంగా రాస్తోంది.. దీంతో కావాల్సిన వారికి రాయితీలు ఇవ్వడానికి స్వేచ్ఛ ఉండటం లేదని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. అందుకే ఏకంగా సచివాలయ బిజినెస్ రూల్స్నే మార్చేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ పాలనకు బిజినెస్ రూల్స్ కీలకం. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చే విషయంలో ఆర్థిక శాఖ నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది. పెట్టుబడికి మించి రాయితీలు ఇవ్వాలంటూ వస్తున్న ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.. నిబంధనలను గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయితీలకు చెందిన అంశాల ఫైళ్లు ఆర్థిక శాఖకు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశాలకు చెందిన ఫైళ్లు ఆర్థిక శాఖకు పంపినప్పటికీ తిరస్కరించకుండా ఉండేలా బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని కూడా ప్రతిపాదించారు. అడ్డూ అదుపూ ఉండదిక... ఎప్పటినుంచో ఉన్న బిజినెస్ రూల్స్ను మార్చేస్తే ఇక అడ్డూ అదనపు లేకుండా ప్రజాధనాన్ని పాలకులు దోచేసుకుంటారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేబినెట్ పేరుతో పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పుడు బిజినెస్ రూల్స్నే మార్చేస్తే యథేచ్ఛగా కావాల్సిన వారికి కావాల్సినంత దోచిపెట్టవచ్చునని, అడిగే నాథుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం ఒకే రకంగా ఉండాలని, అందుకే బిజినెస్ రూల్స్, నిబంధనలు పెట్టారని, ఇప్పుడు ఆ రూల్స్నే సవరిస్తే న్యాయం అనేది ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా అమలవుతుందని చెబుతున్నారు. అలాగే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మూడు రోజుల్లోగా అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించిన తరువాత ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఆయా శాఖలకు వెళితే తగిన ఆదేశాలు జారీ చేస్తాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తీర్మానాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యం నివారించకుండా మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయాలంటే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్సియల్ కోడ్, బడ్జెట్ మాన్యువల్ పాటించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement