-
అమెరికాలో దుమ్ము బీభత్సం
హర్డిన్: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్ సమీపంలో మోంటానా ఇంటర్ స్టేట్ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి. దారి కనిపించక ట్రాక్టర్ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు. -
ఢిల్లీలో బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం ఉన్నట్టుండి చల్లబడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే బలమైన ఈదురు గాలులు వీస్తూ వర్షం మొదలైంది. నగరంలోని కొన్ని చోట్ల ఓ మోస్తరుగా మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఘజియాబాద్, నౌయిడాలలో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి, నగరవాసులను ఎండ వేడిమి నుంచి సేద దీర్చింది. అనేకమంది ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ వాతావరణ వీడియోలను షేర్ చేశారు. What a stormy weather . It’s Unbelievable that we are in mid May . Whatever, the weather is really awesome.#Rain #hailstorm pic.twitter.com/isizAX9S47 — Mehak Prabhakar (@MehakPrabhakar2) May 14, 2020 heavy hailstorm♥️♥️Delhi like kashmir♥️ #delhirains pic.twitter.com/wDZYKgTg26 — MOHAMAD KAIF (@mr_kaifu10) May 14, 2020 Hail storm in Delhi NCR pic.twitter.com/Lsv5AMMppj — Ajeet Singh (@Ajit5666Singh) May 14, 2020 -
ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో పగటిపూటే చీకట్లు అలుముకున్నాయి. ముఖ్యంగా ఘాజీపూర్ ప్రాంతంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిమేర తగ్గిపోయాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరోవైపు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. కాగా, ఢిల్లీలో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే రానున్న రెండు రోజులు ఆకాశం మేఘావృతంగా ఉండనుందని వెల్లడించింది. కాగా, కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడుతున్న ఢిల్లీ వాసులకు.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు చల్లబడటం కొద్దిమేర ఉపశమనం కలిగించింది. -
అక్కడ మరోసారి భయానక వాతావరణం
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో మొన్నటిదాకా ప్రజలు కార్చిచ్చుతో అతలాకుతులం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజల్లో వరుస తుఫాన్లు, సుడిగాలులు మరోసారి భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో సుడిగాల్పులు బీభత్సంతో తీవ్ర కలకలం రేగింది. గంటకు 107 మైళ్ల వేగంతో వీచిన గాలులకు ప్రజా భవనాలు, గృహాలు, కార్లు ద్వంసమవడంతో పాటు వేలాది చెట్లు నేలకొరిగాయి. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పవర్ కట్ అవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్రిస్బేన్, క్వీన్స్లాండ్లోని గోల్డ్కోస్ట్ ప్రాంతాలలో శనివారం వడగళ్ల వాన చుట్టముట్టడంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలా ఆస్ట్రేలియాలో ఒకదాని తర్వాత మరొకటి చోటుచేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. రెండు నెలల క్రితం న్యూసౌత్ వేల్స్ అడవుల్లో మొదలైన కార్చిచ్చును చల్లార్చాడానికి ఈ అకాల వర్షాలు మంచివే అయినా ఆస్ట్రేలియాలోని రెండు ప్రధాన నగరాల్లోని ప్రజలకు మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించిందనే చెప్పుకోవాలి. అయితే కార్చిచ్చు దాటికి 28 మంది మరణించగా, వేలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. కార్చిచ్చు దాటికి 10.4 మిలియన్ హెక్టార్లు కాలిపోయింది. కార్చిచ్చుకు హరించుకుపోయిన ఈ మొత్తం యూఎస్ఏలోని ఇండియానా రాష్ట్రంతో సమానం కావడం విశేషం. Narromine dust storm - Jan 19th pic.twitter.com/GeFSqby8NY — Mick Harris (@mickharris85) January 19, 2020 Fires, hottest day on record, floods, dust storm, hail storm. All in a month. Climate apocalypse starts in Australia. Are we gonna let this be the new normal?#ClimateCrisis pic.twitter.com/rPGg20JsV2 — Veronica Koman (@VeronicaKoman) January 20, 2020 -
పొల్యూషన్.. సిగ్నల్లో కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్.. లండన్.. సింగపూర్ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్సిగ్నల్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్లైట్లను మ్యాన్యువల్గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య ఇలా.. వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్లైట్లు ఆన్ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్(ఫ్రాన్స్)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే.. ► టికెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు. ► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి. ► స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ► ప్లాట్ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ► పార్కింగ్ లాట్ వద్ద బైక్లకు నెలవారీ పాస్ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్లకు దూరంగా ఉంటున్నారు. ► మెట్రో కారిడార్లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ► మెట్రో గమనంలో సడెన్బ్రేక్లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement