-
‘ఎర్ర’కోటలో కాషాయ కాంతులు!
అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈసారి త్రిపురలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ రాష్ట్రం కోసం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ విధానాన్ని మార్చుకుని.. ‘కమ్యూనిస్ట్ ముక్త త్రిపుర’ నినాదంతో దూసుకెళ్తోంది. 1972లో త్రిపుర ఏర్పాటైనప్పటినుంచి తొలిసారిగా ‘లెఫ్ట్–రైట్’ మధ్య పోటీ నెలకొందని ‘పీపుల్స్పల్స్’ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రతి ఊరూ వామ‘పక్ష’మే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతున్నా వారికి కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర చాలా కీలకమైనది. చిన్న రాష్ట్రమైనా 4 దశాబ్దాలుగా (1988–92 దఫా మినహా) అధికారంలో ఉండటంతో ఇంటింటికీ వేళ్లూనుకుపోయిన పరిస్థితి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వామపక్ష ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలదే పైచేయి. ‘ఎర్ర’కోటలో కమ్యూనిస్టులను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. త్రిపురలో రెండే వర్గాలుంటాయి. ఒకటి సీపీఎం అనుకూల వర్గం (దాదాపు 60%), రెండోది వ్యతిరేక వర్గం (మిగిలిన 40%). సీపీఎంను దెబ్బతీస్తూ.. త్రిపురలో బెంగాలీల జనాభా ఎక్కువ. దీనికితోడు కొంతకాలంగా త్రిపురలో గిరిజన తెగల మధ్య (సీపీఎం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య) ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఇన్నిసార్లు మద్దతిస్తున్నా కాంగ్రెస్కు అధికారం దక్కకపోవటంతో సీపీఎం వ్యతిరేక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో అధికార వ్యతిరేక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మూడేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎంపై ప్రభుత్వ వ్యతిరేకతను, రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. కమ్యూనిస్టులకు బలమైన అండగా నిలుస్తున్న కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు గాలం వేసేందుకు.. ‘అధికారంలోకి వస్తే ఏడో వేతనసవరణ అమలుచేస్తాం’ అని హామీ ఇచ్చింది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షన్నర మంది ఉద్యోగులపై, వారి కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. అటు, బెంగాలీలు, గిరిజనులను, ప్రభుత్వ అనుకూల వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా త్రిపురలో ప్రముఖులతో ప్రచారం నిర్వహిస్తూనే.. ఇంటింటికి చేరువవుతోంది. అయితే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ బలమైన కమ్యూనిస్టు కోటను ఈ ఒక్క ప్రయత్నంలోనే దెబ్బకొట్టలేరని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఈసారికి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కవచ్చని అభిప్రాయపడింది. అధికారం మాదే ఈ ఎన్నికల్లో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. 20వ బీజేపీ పాలిత రాష్ట్రంగా త్రిపుర మారనుందని ఆయన అగర్తలాలో సోమవారం పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఓటర్లకు భరోసానిచ్చారు. మణిపూర్, అస్సాంలలోనూ గతంలో ఒక్కసీటు కూడా లేని పరిస్థితినుంచి ఏకంగా అధికారాన్ని అందుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
టీ‘ఢీ’పీ
జిల్లా తెలుగుదేశంలో గ్రూపుల పోరు పనులు, పదవుల కోసం పోటీ పరాకాష్టకు చేరుతున్న వివాదాలు తలపట్టుకుంటున్న అధిష్టానం జిల్లా టీడీపీలో గ్రూపుల పోరు పెరిగింది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారస్థారుుకి చేరింది. పదవుల కోసం, పనుల కోసం నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో వర్గ పోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల మంత్రుల ముందే ‘నువ్వెంతంటే..నువ్వెంతన్న’ స్థారుులో మాటల యుద్ధాలు, వాగ్వాదాలు నెలకొన్నారుు. జనచైతన్య యాత్రల్లోనూ ఇవి బయటపడ్డారుు. దీంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిం ది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని జిల్లా పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి : గత ఎన్నికల్లో టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ, వైఎస్సార్సీపీ 8 చోట్లా గెలుపొందారుు. సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో కొద్ది మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కింది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లాపై దృష్టి పెట్టారు. నామినేటెడ్ పదవులిస్తాననీ, పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తాననీ, కాంట్రాక్టు పనులిప్పిస్తామని హామీలిచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటివేమీ జరగలేదు. దీంతో పట్టణ, మండల స్థారుు నాయకుల్లో పార్టీపై అసంతృప్తి మొదలైంది. పదవులున్న వారు ఏదో ఒక రకంగా ఎదుగుతుంటే తొలినుంచీ పార్టీ జెండా మోసిన నాయకులకు ప్రాధాన్యత లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో కుమ్ములాటలు మొదలయ్యారుు. చిత్తూరు, నగరి, మదనపల్లి, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నారుు. చిత్తూరులో టీడీపీ నాయకుల మధ్య వర్గ రాజకీయాలు నెలకొన్నారుు. ప్రధానంగా ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధికి, మరో సామాజిక వర్గానికి చెందిన నాయకులకూ నడుమ సఖ్యత లేకుండా పోరుుంది. కార్పొరేషన్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కుమ్ములాడుకుంటున్నారు. కార్పొరేషన్ లోని పలు పనులను తాము చెప్పిన వాళ్లకే ఇవ్వాలని ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. కార్పొరేషన్లో ఇటీవల డిప్యూటీ ఇంజనీరును టీడీపీ చెందిన ఓ సామాజిక వర్గ నాయకులు మాతృశాఖకు సరెండర్ చేరుుంచారు. తనకు తెలియకుండా వ్యవహారం నడవడంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధి, సదరు డీఈఈని మళ్లీ చిత్తూరు కార్పొరేషన్కే తెప్పించుకున్నారు. గంగనపల్లె డివిజన్ ఉప ఎన్నికల విషయంలోనూ ఇది ప్రస్ఫుటమవుతోంది. నగరిలో ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడుతో పాటు ఆయన కుమారులు నియోజకవర్గంలో తిరుగుతున్నా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను అదుపు చేయలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాతినిధ్యం ఇస్తున్నారని తమకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు అలకవహించిన సందర్భాలు కూడా ఉన్నారుు. పట్టణ టీడీపీ అధ్యక్షునికీ, ఎమ్మెల్సీకి మధ్య విభేదాలు ఏర్పడి పార్టీ పట్టణ అధ్యక్షున్ని తొలగించినట్లు ఆ పార్టీ పరిశీలకుడు ప్రకటించడం, ఆ తర్వాత కొందరు నాయకుల సంప్రదింపులతో వారిని పార్టీలో కలుపుకోవడం లాంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నారుు. పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యులు తమ వార్డులకు నిధులు కేటారుుంచలేదంటూ తలుపులు వేసుకొని చైర్మన్తో కాంట్రాక్టుల విషయంలో వాగ్వాదాలకు దిగడం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని తెలియజేస్తోంది. మున్సిపల్ పీఠంపై ఒప్పందాన్ని కాదని ఒకరినే కొనసాగిస్తుండటం విభేదాలకు ఆజ్యం పోస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో ముదివేడుకు చెందిన ఓ మాజీ సర్పంచు, ఓ మండలస్థారుు ప్రజాప్రతినిధి, పార్టీ మండల నేత ఈ ముగ్గురే అభివృద్ది పనులన్నీ చేస్తుండటంతో టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. బి.కొత్తకోట మండలంలో అభివృద్ధి పనులన్నీ కొందరికే కట్టబెట్టారంటూ నెలక్రితం జరిగిన పార్టీ మండలస్థారుు సమావేశంలో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటూ.. ఆరోపణలు చేసుకున్నారు. పెద్దమండ్యం మండలంలో పార్టీ మండల నేత, మరో నాయకుడి మధ్య వర్గపోరు సాగుతోంది. ములకలచెరువు మండలంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరు సాగుతోంది. అంగన్ వాడీ పోస్టులు, నీరు-చెట్టు పనుల కోసం గొడవలు పడ్డారు. తంబళ్లపల్లె మండలంలోనూ ఇదే తీరు. ఎమ్మెల్యే శంకర్పై పార్టీ అధినేత తనయుడు లోకేష్ బాబుకు ఫిర్యాదు చేసేందుకు అసంతృప్తి నాయకులు నిర్ణరుుంచారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తొలినుంచీ ఈయన ఆగమనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement