-
రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు వచ్చి చేరాయి. గోవా పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెండు కుక్క పిల్లలను ఢిల్లీలోని తన నివాసానికి తీసుకొచ్చారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన మూడు నెలల వయసు రెండు కుక్క పిల్లలను పెంచుకునేందుకు తీసుకున్నారు. కాగా బుధవారం సాయంత్రం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ గురువారం ఉదయం మళ్లీ ఢిల్లీ చేరుకున్నారు. తన పర్యటనలో గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పట్కర్తో ఓ హోటల్లో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై వారితో చర్చించారు. పర్యటన ముగించుకొని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ముందు షేడ్స్ కెన్నెల్ అనే పెంపుడు జంతువుల విక్రయ సంస్థను సందర్మించారు. శివాని పిత్రే అనే మహిళ తన భర్తతో కలిసి నార్త్ గోవాలోని మపుస ప్రాంతంలో దీనిని నడుపుతోంది. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఒక మగ, ఒక ఆడ కుక్కను కొనుగోలు చేశారు. అయితే విమానయాన నిబంధనల కారణంగా ఒక కుక్కను మాత్రమే తనతో దిల్లీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే పేర్కొన్నారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు ఆయన అత్యంత నిరాడంబరుడని, తమతో ఓ స్నేహితుడిలా మాట్లాడారని తెలిపారు. కెన్నెల్లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ రెండు కుక్క పిల్లలను కొనుగోలు చేశారని, వీటిలో ఒక పప్పీని ఆయన ఇంటికి తీసుకెళ్లారని మరో దానిని తరువాత పంపిస్తామని శివాని తెలిపారు. ముందుగా రాహుల్ గాంధీ సిబ్బంది ఒకరు వచ్చి పప్పీల గురించి తెలుసుకున్నారని, అయితే వాటిని కొనుగోలు చేసే ముందు ఆయనే స్వయంగా వాటిని చూసేందుకు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజీమ్ ప్రేమ్ జీ, కరీనా కపూర్ వంటి పలువురు ప్రముఖులు ఈ జాతి కుక్కలను కొనుగోలు చేశారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతి శునకాలకు బ్రిటన్లో విపరీతమైన జనాదరణ ఉంది. వీటి ఆహార్యం చిన్నగా కన్పించినా.. అవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. 4 నుంచి 7 కిలోల బరువుండే ఈ కుక్కలు 25 సెంటీమీటర్ల దాకా ఎత్తు పెరుగుతాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువే. రష్యాకు చెందిన మందుపాతరలు, బాంబులను పసిగట్టినందుకు ఇదే జాతికి చెందిన పీట్రన్ అనే శునకానికి ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పతకాన్ని బహూకరించారు. చదవండి: అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు -
తల్లి ప్రేమకు ప్రతీక
ఒడిశా,కొరాపుట్: సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లలపై ప్రేమను చూపిస్తాయి. అందుకు ఈ చిత్రమే నిరద్శనం. స్థానిక పూజారిపుట్ రోడ్డులో బుధవారం ఉదయం బైక్ ఢీకొని ఒక కుక్కపిల్ల మృతి చెందింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న శునకపు మృతదేహం వద్ద తల్లి శునకం కన్నీరు కారుస్తూ గంటల తరబడి కూర్చొంది. అది చూసిన వారంతా ఆ శునకం పడుతున్న ఆవేదనను, తల్లి ప్రేమను అర్థం చేసుకుని బాధాతప్తులయ్యారు. -
శునకాలకు వింతరోగాలు
పెద్దపల్లి, ముత్తారం(మంథని): ఒక ప్రక్క రాష్ట్రంలో కరోనా వైరస్తో ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్న తరుణంలో మండలంలో వీధుల వెంట తిరిగే కుక్కలు(శునకాలు) సైతం వింత వ్యాధులతో మృతి చెందడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. మండలంలోని ఓడేడ్ గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయి. రెండు రోజులుగా గ్రామంలో సుమారుగా 12 కుక్కల వరకు రోడ్లపై కుప్పకూలి చనిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియాలో అమెరికాలోని బ్లాంక్జూలో పులికి కరోనా వ్యాధి వచ్చిందని వార్తలు రావడంతో కుక్కలకు కూడా ఏదైన రోగం వచ్చిందా? ఆందోళన చెందుతున్నారు. . ఈవిషయంపై పశు వైధ్యాధికారి హన్నన్ను వివరణ కోరగా గ్రామంలో కుక్కలు మృతిచెందాయని తమ దృష్టికి వచ్చిందని మూడు రోజుల క్రితం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంను పిచికారి చేయడంతో గ్రామంలోని గడ్డిని తిని ఇలా చనిపోయి ఉంటాయని అన్నారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్ట్మార్టం చేస్తామని తెలిపారు. అ లాగే గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరకకకూడా చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయ బ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. -
24 గంటల్లో 20 పిల్లలకు జన్మ..
లండన్ : ఇంగ్లాండ్లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క 24 గంటల్లో 20 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్లోని స్విన్డన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్విన్డన్ విల్ట్షైర్కు చెందిన ఆంబర్ రీస్ అనే వ్యక్తి కాలి అనే బుల్డాగ్ను పెంచుకుంటున్నాడు. గర్భంతో ఉన్న కాలి మార్చి 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ పిల్లకు జన్మనిచ్చింది. అలా రాత్రి 12.50గంటల వరకు వరుసగా 12 పిల్లలకు జన్మనిచ్చింది. కాలి(ఎడమ) గురువారం మధ్యాహ్నం సమయానికి మరో ఎనిమిదిటికి జన్మనిచ్చింది. ఆరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుందని భావించిన ఆంబర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా ఓ కుక్క 20 పిల్లలకు జన్మనివ్వటం అరుదైన సంఘటనా పేర్కొన్నాడు. అయితే దురదృష్టవశాత్తు వీటిలో తొమ్మిది పిల్లలు మృత్యువాత పడ్డాయని, మిగిలిన 11 క్షేమంగా ఉన్నాయని తెలిపాడు. కాలి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించాడు. -
పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్
న్యూఢిల్లీ : హాంకాంగ్లో నివసిస్తున్న యువన్నె చెవ్ హౌ యీ అనే వృద్ధురాలితోపాటు ఆమె పెంచుకుంటున్న పొమరేనియన్ జాతికి చెందిన కుక్క పిల్లకు కూడా కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిందని తేలింది. హాంకాంగ్లో జుహాయ్ మకావో వంతెనకు సమీపంలో నివసిస్తున్న యువన్నె చెవ్కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెను అదే రోజు సమీపంలోని నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఆ మరుసటి రోజు బుధవారం నాడు వైద్య అధికారులు వచ్చి ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను తీసుకొని పోయి పరీక్షలు నిర్వహించారు. దానికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అవడంతో కుక్క పిల్లను కూడా 14 రోజులపాటు నిర్భంద వైద్య శిబిరానికి తరలించారు. ఈ వార్త తెల్సిన వెంటనే హాంకాంగ్లో పలువురు తమ కుక్క పిల్లలకు కూడా ముందు జాగ్రత్తగా ముక్కుకు, నోటికి మాస్కులు తగిలిస్తున్నారు. కోవిడ్ సోకిన కుక్క పిల్లల నుంచి తిరిగి మనుషులకు వైరస్ సోకుతుందనడానికి తమ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యాధికారులు తెలియజేశారు. అయితే ఎందుకైనా మంచిదని వైరస్ సోకిన కుక్క పిల్లల యజమానులను కూడా పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. (చదవండి: అన్ని వైరస్ల కన్నా ప్రాణాంతకం ఇదే..) చైనాలోని వుహాన్ మార్కెట్లో బయట పడిన అత్యంత ప్రమాదకర కోవిడ్-19 ఇంత వరకు కుక్కలకు, పిల్లులకు సోకినట్లు వార్తలు రాలేదు. పెంపుడు కుక్కల నుంచి యజమానులకుగానీ, యజమానుల నుంచి పెంపెడు కుక్కలకుగానీ ఈ వైరస్ సోకదని ‘యూసీ డేవిస్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్’ ప్రొఫెసర్, పెంపుడు కుక్కలు, పిల్లులకు సోకే వ్యాధుల నిపుణుడైన డాక్టర్ నీల్స్ పెడర్సన్ ‘యూసీ డెవిస్ వెబ్సైట్’లో తెలియజేశారు. ఈ విషయమై హాంకాంగ్ వైద్యాధికారుల నుంచి వివరణ లేదు. (కోవిడ్ 19: ‘ఆ మాంసం తిని ఎవరూ చనిపోలేదు’)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement