-
ఎందుకింత నిర్లక్ష్యం?
సాక్షి, నిజామాబాద్ : జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం మార్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలలు గడుస్తున్నా కార్యాలయం తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. జిల్లా కేంద్రంలోని బాలుర ఐటీఐ ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఉండేది. అయితే, సమీపంలోనే నూతనంగా నిర్మించిన భవనంలోకి కార్యాలయాన్ని మార్చడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిర్లక్ష్యం.. అలసత్వం.. ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి కొత్త భవనం అందుబాటులో ఉంది. పాత కార్యాలయంలోంచి, కొత్త కార్యాలయంలోకి సామగ్రి తరలించడానికి నెల రోజులు పట్టింది. తరలింపు పనులు ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. కరెంట్ కనెక్షన్ ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ కార్డు కో సం దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర పనుల నిమి త్తం వస్తే సమాధానం చెప్పే వారే ఇక్కడ కరువయ్యారు. నిరుద్యోగులు కార్డుల రెన్యూవల్తో పాటు కొత్త కార్డులు తీసుకోవాలంటే మీ సేవకు వెళ్లాల్సిందే. సమస్యలు వస్తే కార్యాలయానికి వస్తే సమాధానాలు చెప్పే వారే ఉండడం లేదు. ఎప్పుడు ఖాళీ కుర్చీలే.. కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నా కూర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అధికారి ఉన్నంత సేపు మాత్రమే ఉద్యోగులు ఉంటున్నారు. అధికారి ఇలా వెళ్లగానే, సిబ్బంది అలా బయటకు వెళ్లిపోతున్నారు. ఇది రోజు జరుగుతున్న తంతు. పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, ఇన్చార్జి అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సిబ్బంది ఇష్టారాజ్యమై పోయింది. దీంతో రెండు నెలలు గడుస్తున్నా సామగ్రి తరలింపు పూర్తి కాకపోవడం, కార్యాలయం ఇంకా సిద్ధం కాకపోవడం గమనార్హం. సిబ్బంది లేక ఆలస్యం మా కార్యాలయంలో సరైన సిబ్బంది లేరు. అందుకే ఆలస్యం అవుతోంది. కంప్యూటర్ ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం యత్నిస్తున్నాం. పనులన్నీ ఒక్కడినే చేయాల్సి వస్తోంది. అందువల్ల కొంత ఆలస్యం జరుగుతోంది. – మోహన్లాల్, ఇన్చార్జి అధికారి -
ఐటీఐ అభ్యర్థులకు నేడు జాబ్మేళా
సంగారెడ్డి క్రైం: తోషిబా కంపెనీలో ఐటీఐ ట్రేడ్ ఉద్యోగాల భర్తీ కోసం మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కె.రజని ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ట్రేడ్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, గ్య్రాండర్, స్ప్రే పెయింటర్ ట్రేడ్లలో అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం 11 గంటలకు పాత డిఆర్ఎడి ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అర్హత సర్టిఫికెట్లతో పాటు మూడు పాస్పోర్టు సైజు ఫోటోలు తీసుకొని రావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,041 జీతం ఉంటుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement