-
మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ
సాక్షి,రామగిరి: మండలంలోని రాజాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ మురికి కాలువను తలపిస్తుంది. గ్రామం పరిధిలో సుమారు 400 మీటర్ల పొడవున ఎస్సారెస్పీ కాలువ ప్రవహిస్తుంది. గ్రామం పరిధిలో కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు నివాస గృహాల్లోని వృథానీరు కాలువలోకి వదిలేస్తుండంతో ఈదుస్థితి నెలకొంది. కాలువ పొడవునా ఆనుకుని నిర్మించిన సుమారు 200 ఇళ్లలోని మరుగుదొడ్లు, వృథా నీరుకూడా ఇందులోకి పైపులైన్ల ద్వారా వదిలివేయడంతో కాలువ పొడవునా దుర్గంధం వెలువడుతుంది. కాలువ నుంచి సాగునీరు విడుదల అయ్యే సమయంలో మినహా మిగతా సమయంలో ఎస్సారెస్పీ కాలువ మురికి కాలువను తలపిస్తోంది. కాలువలో మురికినీరు నిలిచిపోవడం వల్ల కాలువ పొడవునా తుంగ, చెత్తా చెదారం పేరుకు పోయి పందులకు స్థావరంగా మారి దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల సింగరేణి స్థంస్థ ఓసీసీ2 విస్తరణ కోసం ఎల్6 కాలువను మళ్లీస్తున్నారు. దీంతో దీన్ని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. కాలువ గురించి ఎవరు పట్టించుకోపోవడం వల్ల మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు రూపకల్పన చేయడంతో రాజాపూర్ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలనలోనైన మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు మురికి కాలుగా మారిన ఎస్సారెస్పీ కాలువ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భరించలేకపోతున్నాం.. కాలువలోకి ఇండ్లల్లోని నీరు వదిలేయడం వల్ల వస్తున్న గలీజు వాసన భరించలేకపోతున్నాం. కాలువ నుంచి వచ్చే వాసన వల్ల కడుపులో వికారం ఏర్పడి వాంతులు చేసుకుంటున్నాం. కాలువ నిండి తుంగ మొలిచి పందులు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునేటోళ్లే లేకుండా పోయారు. –రొడడ బాపు, రాజాపూర్ కాలువ శుభ్రం చేయాలి కాలువలో చెత్తాచెదారం నిండిపోవడం వల్ల దోమలు పెరిగి రోగాల భారిన పడుతున్నాం. నీళ్లు వచ్చినప్పుడు ఎలాంటి వాసన రావడం లేదు, నీళ్లు బంద్ అయిన తరువాత వచ్చే వాసన వల్ల మాగోస చెప్పుకోలేము. అధికారులు కాలువను శుభ్రం చేయించాలి. –బర్ల కుమార్, రాజాపూర్ -
ఆ కాంట్రాక్టర్పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన * ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు * దోచిపెడుతున్న ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది. అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్ల ద్వారా ట్రిపుల్ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే... ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచాం నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. - కే హనుమంతరావు, ఇన్చార్జి డెరైక్టర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement