-
Neena Singh: చారిత్రక అడుగు అంకితభావమే ఆభరణమై...
అల్లరికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆ ఇల్లు నీనా రాకతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయేది. ఆ ఇంట్లోని పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ కూర్చుని పాఠ్యపుస్తకాలు చదువుతూ కనిపించేవారు. పెద్ద అక్క అంటే మాటలా మరి! అక్కయ్య అంటే ఆప్యాయత, అనురాగం మాత్రమే కాదు క్రమశిక్షణ కూడా. ఆ క్రమశిక్షణే ఆమెను పోలీస్శాఖలోకి అడుగు పెట్టేలా చేసింది. వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకునేలా చేసింది. తాజాగా... సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా చరిత్ర సృష్టించింది నీనా సింగ్... నీనా సింగ్ది బిహార్ రాష్ట్రం. కుటుంబ సభ్యుల్లో తనే పెద్ద. తమ్ముళ్లు, చెల్లెళ్లకు అమ్మ తరువాత అమ్మ. నీనా తండ్రి బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండేవారు. తల్లి గృహిణి. పట్నా ఉమెన్స్ కాలేజీ, దిల్లీలోని జేఎన్యూలో చదివిన నీనా సింగ్ ‘దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎం.ఫిల్. కోసం చేరింది. హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. రాజస్థాన్ క్యాడర్, 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నీనా సింగ్ పోలీస్శాఖలో అడుగు పెట్టిన తొలిరోజు నుంచి పాదరసంలా చురుగ్గా ఉండేది. సివిల్ రైట్స్ అండ్ యాంటి–హ్యూమన్ ట్రాఫికింగ్ ఏడీజీ(ట్రైనింగ్), డీజీగా పని చేసింది. రాజస్థాన్లోని డీజీ ర్యాంక్ పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లో పనిచేసింది. కమీషన్ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించింది. పాండమిక్ కాలంలో రాజస్థాన్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ(హెల్త్)గా బాధ్యతలు నిర్వహించింది. జాయింట్–డైరెక్టర్ ఆఫ్ సీబీఐగా పీఎన్బీ స్కామ్, నీరవ్ మోదీ కేసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లలో కీలకపాత్ర పోషించింది. ‘సివిల్ సర్వీస్లో ఉన్న మా నాన్నను చూస్తూ పెరిగాను. నేను ఐపీఎస్ చేయాలనుకోవడానికి నాన్న స్ఫూర్తిగా నిలిచారు. చదువుకు సంబంధించిన విషయాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారు. మమ్మల్ని దగ్గర ఉండి చదివించేవారు. ఇంట్లో ఇతరత్రా విషయాల కంటే చదువుకు సంబంధించిన విషయాలే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం’ అంటుంది నీనా సింగ్. తన ఉద్యోగప్రస్థానంలో మహిళా సాధికారత భావన కలిగించే ఏ అవకాశాన్నీ, సందర్భాన్నీ వదులుకోలేదు నీనా సింగ్. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నీనా సింగ్ను భారతప్రభుత్వం 2015లో ‘ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్’ 2020లో ‘విశిష్ఠసేవా పురస్కారం’తో సత్కరిం చింది. నాన్న స్ఫూర్తితో... ఇంటి వాతావరణం మన కలలకు ఊపిరిపోస్తుంది. నాన్న సివిల్ సర్వీస్లో ఉండడం వలన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన ద్వారా ఎంతోమంది ఐకానిక్ ఆఫీసర్ల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్లో చేరాలనే లక్ష్యం ఏర్పడింది. కెరీర్కు సంబంధించి వేరే ఆలోచనలు ఏవీ ఉండేవి కాదు. నా ఏకైక లక్ష్యం సివిల్ సర్వీస్ అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీస్లో విస్తృతంగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఖాకీ యూనిఫాం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఖాకీ యూనిఫాంలోఉన్న వారిని చూస్తే అపురూపంగా అనిపించేది. యూనిఫాం ఎప్పుడూ ఇతరులను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ...నేను సిరోహి ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు మీలాగే పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది అన్నప్పుడు సంతోషంగా అనిపించింది. పోలీస్ ఉద్యోగం అంటే శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే కాదు రకరకాల సమస్యలు ఎదుర్కొనే ప్రజలకు ధైర్యాన్నీ, భరోసానూ ఇవ్వడం కూడా. – నీనా సింగ్ నోబెల్ విజేతలతో కలిసి పరిశోధన పోలీసుల పనితీరులో రావాల్సిన మార్పులు, ప్రజలకు మరింత చేరువయ్యే మార్గాల గురించి ‘మసాచుసెట్సు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి సంబంధించిన ప్రాజెక్ట్లో నీనా సింగ్ భాగం అయింది. తన పరిశోధన తాలూకు అంశాల ఆధారంగా ఎన్నో పోలీస్స్టేషన్లలో మార్పు తీసుకువచ్చింది. నోటెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డప్లోతో కలిసి ‘ది ఎఫీసియెంట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ రిసోర్సెస్’ అంశంపై పరిశోధన పత్రాలు రాసింది. హార్వర్డ్లో చదివే రోజుల నుంచి వారితో నీనా సింగ్కు పరిచయం ఉంది. -
‘3 నెలల్లో ఫిట్గా మారండి.. లేదా ఇంటికి వెళ్లిపోండి’
పోలీసులకు ఎత్తు, సరైన బరువు, శారీరక ధృడత్వం ఎంతో ముఖ్యం. అందుకే పోలీస్కు ఎంపికయ్యే సమయంలో రాత పరీక్షలతోపాటు ఈవెంట్స్లో కూడా తప్పక క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే పోలీస్ విధుల్లో చేరాక చాలా మందికి ఫిట్నెస్ కోల్పోవడం చూస్తుంటాం.. ఇక వయసు మీదపడుతున్న వారికైతే పొట్ట అమాంతం ముందుకు వచ్చేస్తుంటుంది. కొందరిని అయితే యూనిఫాంలో చూస్తే తప్ప వారిని పోలీసులని గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పోలీసులును ఫిట్ మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్లతో సహా అన్ని విభాగాల్లోని పోలీసులందరూ ఫిట్గా ఉండాలని సూచించింది. పోలీసులు ఫిట్ మారడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ తర్వాత వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ)నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఏపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బంది అందరికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఆ తరువాత 15 రోజులకు వారి బీఎమ్ఐ లెక్కగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఊబకాయం కేటగిరిలో(BMI 30+) ఉన్నవారికి బరువు తగ్గించుకోవడానికి మరో మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. బీఎంఐ లెక్కించుకునే వారిలో మొదటి వ్యక్తి తానేనని డీఐజీ తెలిపారు. ఇక అస్సాంలో 7,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. -
Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ బాస్ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీ రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసు వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం.. రాష్ట్ర పోలీసుశాఖలో ఐపీఎస్ 1989 బ్యాచ్కు చెందిన ఉమేష్ షరాఫ్, 1990 బ్యాచ్కు చెందిన గోవింద్ సింగ్, అంజనీకుమార్, రవిగుప్తా డీజీ (డైరెక్టర్ జనరల్) ర్యాంకులో.. 1991 బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ఇద్దరూ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. రేసులో ఎవరెవరు? అందరిలోకి సీనియర్ అయిన ఉమేష్ షరాఫ్ 2023 జూన్లో రిటైర్ కానున్నారు. దీనితో ఆయనకు డీజీపీగా అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత 1990 బ్యాచ్కు చెందిన గోవింద్ సింగ్ (ప్రస్తుత సీఐడీ చీఫ్) ఈ ఏడాది నవంబర్లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఇదే బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ (ఏసీబీ డీజీ), రవి గుప్తా (హోంశాఖ ముఖ్య కార్యదర్శి) ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. వీరు డీజీపీ పోస్టు రేసులో ఉంటారు. ఇక గోవింద్ సింగ్ పదవీ విరమణతో ఖాళీ అయ్యే డీజీ ర్యాంకు పోస్టులోకి రాజీవ్ రతన్ పదోన్నతి పొందుతారు. ఒకే బ్యాచ్కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా.. ప్రభుత్వం ఎక్స్ కేడర్ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన అంజనీకుమార్, రవిగుప్తాలతోపాటు రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ కూడా డీజీపీ రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరునూ డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్కు చెందిన అదనపు డీజీపీ జితేందర్ పేరూ నియామక ప్యానల్ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. చదవండి: (Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!) డిసెంబర్ రెండో వారంలో.. రాష్ట్ర జీఏడీ విభాగం డీజీపీ నియామకానికి సంబంధించి ప్యానల్ లిస్ట్ను డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి పంపనుంది. ఈ జాబితాలో ఉమేష్ షరాఫ్, రవిగుప్తా, అంజనీకుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్లో రిటైర్ కానున్న ఉమేష్ షరాఫ్ పేరును పరిగణనలోకి తీసుకోకున్నా డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ తిరిగి సూచిస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నియామకాల్లో కీలకం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ 2017 నవంబర్ వరకు సేవలు అందించారు. తర్వాత రెండో డీజీపీగా మహేందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా హైదరాబాద్ కమిషనర్గా పనిచేసి డీజీపీగా నియమితులైనవారే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చాలా మంది డీజీపీలు హైదరాబాద్ కమిషనర్గా పనిచేసిన వారే. ప్రస్తుతం రేసులో ఉన్న అంజనీకుమార్ కూడా హైదరాబాద్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కొనసాగుతున్నారు. -
పంజాబ్కు కొత్త డీజీపీ
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు రాష్ట్రంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రాను పంజాబ్ కొత్త డీజీపీగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులొచ్చాయి. కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) షార్ట్లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ నియమించారు. బాధ్యతలు చేపట్టాక భవ్రా కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత మూడు నెలలకాలంలో పంజాబ్కు కొత్త డీజీపీ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ పంపిన షార్ట్లిస్ట్లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దిన్కర్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. అమరీందర్ తప్పు కున్నాక చన్నీ సీఎం అయ్యారు. గత సెప్టెంబర్లో 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాను డీజీపీగా చన్నీ ఎంచుకున్నారు. అయితే సహోతా నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ ఒత్తిడికి తలొగ్గిన చన్నీ సర్కార్.. సహోతాను తప్పించింది. రెగ్యులర్ డీజీపీ నియామకం జరిగే లోపు బాధ్యతలు నిర్వహించేందుకు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను చన్నీ ప్రభుత్వం డీజీపీ పీఠంపై కూర్చోబెట్టింది. -
ఏపీలో బాగా తగ్గిన నేరాల సంఖ్య
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement