-
ఢిల్లీ మహిళలకు ‘ఉచితమేనా’ ప్రయాణం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలనే స్కీమ్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మంగళవారం నాటి నుంచి అధికారికంగా ప్రారంభించిన విషయం తెల్సిందే. ఢిల్లీ మహిళలకు పెద్దన్నలా చెప్పుకునే కేజ్రివాల్. సోదరి–సోదరుల అనుబంధానికి గుర్తుగా జరపుకునే ‘భాయ్ దూజ్’ పండుగ నాడు ప్రారంభించడం ఓ విశేషం. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కేజ్రివాల్ ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారని విపక్షాలు గోల చేస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ మోదీ, రైతులకు ఆరేసి వేల రూపాయల చొప్పున రెండు విడతల ఆర్థిక పథకాన్ని ప్రకటించలేదా?! మన ప్రజా నాయకులు మామూలప్పుడు ఎలాగు ప్రజలను పట్టించుకోరు, కనీసం ఎన్నికలప్పుడైనా ప్రజలకు మేలు చేయడాన్ని ఎందుకు కాదనాలి! పథకాన్ని ఎప్పుడు ప్రకటించారన్న విషయాన్ని పక్కన పెట్టి పథకంలో మంచి, చెడులను గురించి ఆలోచించడమే ఎప్పుడైనా మంచి పద్ధతి. ఢిల్లీని రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యం స్కీమ్ మంచిదని చెప్పవచ్చు. ఒకటి, మహిళలకు భద్రత లేకుండా పోవడం. రెండు, వాయు కాలుష్యం సమస్య. చీకట్లోనే కాకుండా, పగలు కూడా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల బస్సుల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మహిళల సంఖ్య, సందడి పెరుగుతుంది. ఒకరికి, నలుగురు తోడవడం వల్ల వేధింపులు తగ్గుతాయి. ఆడ పిల్లలకు భద్రతగా తల్లులు కూడా వెంట వెళ్ల వచ్చు. ఈ రోజుల్లో తల్లులు వెంట రావడం ఆడ పిల్లలకు ఇష్టం లేకపోవచ్చు. అది వేరే విషయం. బస్సుల్లో మహిళలకు ర„ý ణగా 13 వేల మంది మార్షల్స్ను రంగంలోకి అదనంగా దించుతున్నట్లు కూడా కేజ్రివాల్ మంగళవారం ప్రకటించారు. దాని వల్ల కూడా భద్రత మరింత పెరుగుతుంది. రెండో సమస్య కాలుష్యం. బస్సు రవాణా సదుపాయం పెరగడం వల్ల ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గుతుందనే విషయం తెల్సిందే. ఉచిత ప్రయాణం కారణంగా ఆడ పిల్లలను స్కూళ్ల వద్దనో, కాలేజీల వద్దనో దించి వచ్చే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కార్లు ఎక్కువగా తగ్గకపోవచ్చు. సరదాగా స్నేహితులతో కలిసి బస్సుల్లో వెళ్తే బాగుంటుంది అనుకునే ఆడ పిల్లలు కార్లలో ప్రయాణాన్ని కాదనుకోవచ్చు. ‘ఈ నిర్ణయం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని ప్రాంతాలు తిరగాలనుకుంటున్నాం. విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకు అవసరమైయ్యే డబ్బులను కూడ బెట్టాలనుకుంటున్నాం’ అని బస్సుల్లో ఉచితంగా ప్రయణిస్తున్న ఆడ పిల్లలు చెప్పారు. వారు ఉల్లాసంగా తమకు కండక్టర్ ఇచ్చిన గులాబీ రంగు టిక్కెట్లు చూపించారు. ఈ గులాబీ టిక్కెట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఒక గులాబీ రంగు టిక్కెట్ విలువ పది రూపాయలనుకుంటే అలాంటివి రోజుకు ఎన్ని, నెలకు ఎన్ని, ఏడాదికి ఎన్ని జారీ చేశారో లెక్కించి ఆ డబ్బుల మొత్తాన్ని రాష్ట్ర బస్సు కార్పొరేషన్కు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ విజయవంతం అయితే సీనియర్ సిటిజెన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తానని కేజ్రివాల్ ఇప్పటికే హామీ ఇచ్చారు. దీని విజయం కండక్టర్ల నిజాయితీ, వారిపై నిఘా నీడలు ఎలా ఉంటాయన్న దాని మీద ఆధార పడి ఉంది. అంతేకాకుండా ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల సంఖ్య మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ఈ బస్సు రవాణా వ్యవస్థ అదనపు ఒత్తిడిని ఎలా తట్టుకుంటుందనే విషయంపై కూడా విజయం ఆధారపడి ఉంది. -
మహిళల భద్రతపై కేజ్రీవాల్ మరో నిర్ణయం
న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డిటిసి) బస్సులో ప్రయాణం చేసే మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు మంగళవారం నుంచి మరో 13వేల మంది మార్షల్స్ పనిచేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. ఇప్పటికే మహిళలకు రక్షణగా 3400 మంది మార్షల్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎంపిక చేసిన 13 వేలమంది మార్షల్స్ మంగళవారం నుంచే విధుల్లో చేరతారని ఆయన స్పష్టం చేశారు. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో మహిళలకు కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇది మా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ నగరంలో లేని విధంగా మేము మహిళలకు రక్షణగా మార్షల్స్ను నియమించామని తెలిపారు. 'ఈ రోజు మీ అందరిముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతీ మహిళకు రక్షణ కల్పించడమే మీ బాధ్యత. ఇది చూసి ప్రతీ మహిళ ప్రభుత్వ బస్సును సొంత వాహనంగా భావించేలా విశ్వాసం కల్గిస్తారని ఆశిస్తున్నా' అంటూ కొత్తగా ఎంపిక చేసిన మార్షల్స్తో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రభుత్వం రూపొందించడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. -
అక్కా నన్ను బదిలీ చేయించు
ఎంపీ కవితకు మహిళా డ్రైవర్ సరిత వినతి సంస్థాన్ నారాయణపురం: ‘‘అక్కా నేను తెలంగాణ బిడ్డనే.. నన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి బదిలీ చేయించు’’ అని దేశంలోనే మొదటి మహిళా డ్రైవర్ అయిన వాంకుడోతు సరిత విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో కవితను కలసి వినతిపత్రం సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం సీత్యతండాకు చెందిన సరితకు మూడేళ్ల నుంచి ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ పరిధిలోని సరోజిని డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తోంది. తల్లిదండ్రుల బాధ్యత ఉండడంతో రెండుమూడు నెలలకోసారి ఇంటికి వచ్చి వెళుతోంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండడంతో సంస్థాన్ నారాయణపురం జెడ్పీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్ సహకారంతో హైదరాబాద్లో కవితను కలిసింది. -
ఇక బస్సు షెల్టర్లపై సౌర విద్యుత్..
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకూ కరెంట్ సమస్య ఉత్పన్నమవుతుండటంతో దాన్ని అధిగమించే దిశగా ఢిల్లీ ఆమ్ఆద్మీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే సౌర విద్యుత్ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సు షెల్టర్లపైభాగంలో సోలార్ ప్యానెల్ను నిర్మించి సౌరవిద్యుత్ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ప్రతి సంవత్సరం సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరిగిపోతుండటంతో భవిష్యత్త్లో విద్యుత్ ఉత్పత్తి సమస్యను నివారించాలంటే ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఒక్కటే మార్గమని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. సోలార్ ప్యానెల్స్ను సిటీ బస్సు షెల్టర్ల పైకప్పు భాగంలో అమర్చడం వల్ల ఎక్కువమొత్తంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చనని మంత్రి సత్యేందర్ జైన్ పిటీఐతో చెప్పారు. ఈ సోలార్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. బస్సు షెల్టర్ల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ నిర్మించడం వల్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వానికి సులభంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్ కలిగిన షెడ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు జైన్ తెలిపారు. వీటి నిర్మాణం ఆధునిక సాంకేతికతో తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి జైన్ పేర్కొన్నారు. కాగా, సోలార్ విద్యుత్ ధరలు సాంప్రదాయ విద్యుత్ ఒకేలా ఉంటాయనీ, కానీ రానున్న సంవత్సరాల్లో సోలార్ విద్యుత్ ధరలు చాలా తక్కువ ఉంటాయని సత్యేందర్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)తో కలిసి బస్సుల ప్రమాణాల పరీక్షించి నివేదికను సమర్పించడంలో విఫలమైన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)పై జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బస్సులను ఎవరు పర్యవేక్షిస్తారని, ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించిన ఒక్క బస్సు నివేదికనైనా తమకు ఇవ్వాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుండడంతో వాటి మూలాలను కనుగొని అడ్డుకట్ట వేయాలని వర్ధమాన కౌశిక్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు. డీటీసీ బస్సులు, గ్యాస్ ఆధారిత బస్సుల ప్రమాణాలను డీటీసీ, సీపీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యుల బృందం పరీక్షించి నివేదిక ఇవ్వాలని, నిబంధనలకు విర్ధుంగా ఉన్నవాటిని రోడ్ల మీద తిరగనివ్వద్దని 2014 నవంబరు 26న ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో బస్సులన్ని ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని న్యాయవాది అవ్నిష్ అల్హావాట్ డీటీసీ తరుఫున వాదించారు. కానీ ధర్మాసనం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రవాణా శాఖ సంయుక్త కమిషనర్ 186 బస్సులు కాలుష్య నియంత్ర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 2014 డిసెంబర్ 28న నివేదిక సమర్పించారు. దీంతో 15 ఏళ్లనాటి వాహనాలను రోడ్ల మీద తిరగకుండా నిషేధం విధించింది, ఒక వేళ అలాంటి వాహనాలు దేశ రాజధానిలో తిరిగితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
Advertisement