-
నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం
తుళ్లూరు, హైదరాబాద్లలో పాల్గొననున్న చంద్రబాబు హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరుతోపాటు హైదరాబాద్లో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానిస్తారు. అక్కడినుంచి నెక్లెస్రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు, అక్కడ కూడా జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు సన్మానం చేస్తారు. ఏప్రిల్ 11 నుంచి సంస్థాగత ఎన్నికలు టీడీపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికలను వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ నిర్ణయించిందని కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు శనివారం ఓప్రకటనలో తెలిపారు. ఆరు, ఏడు తేదీల్లో మండల, పట్టణ, డివిజన్, అనుబంధ కమిటీల ఎన్నికల అధికారులకు ఎన్టీఆర్ భవన్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. 11 నుంచి 21 వరకూ ఆయా కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మే ఆరు నుంచి ఎనిమిది వరకూ జిల్లా పార్టీ, అనుబంధ కమిటీల ఎన్నికలు జరుపుతారు. మే 11 నుంచి 24 వరకూ అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతాయి. మే 27 నుంచి 29 వరకూ మహానాడు నిర్వహిస్తారు. -
మిన్నంటిన సంబరాలు
ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పతాకాల ఆవిష్కరణ, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు పేదలకు అన్నదానం రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు వాడవాడలా వైఎస్సార్ సీపీ పతాకాన్ని ఎగుర వేసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాలుగేళ్ల ప్రస్థానాన్ని నేతలు మననం చేసుకున్నారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తూ ఆదర్శ నేత అని నిరూపించుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తరువాత ఒక్క హామీ కూడా నెరవేర్చక ప్రజలను మోసగించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బాబు మోసాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరుబాట సాగిస్తున్న విషయం ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని, వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోయి వారికి అండగా నిలవాల్సిన అవసరముందని వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విప్లవాత్మక రీతిలో అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు మరింతగా కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరులో పలుచోట్ల జరిగిన వేడుకల్లో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవితోపాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పూతలపట్టులో రాజారత్నంరెడ్డి ఆధ్వర్యంలో, ఐరాలలో మహిళా నాయకురాలు శైలజాచరణ్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో మండల కన్వీనర్ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గవ్యాప్తంగా పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.మదనపల్లె నియోజకవర్గపరిధిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబ్జాన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచారు. సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని మండలాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ఎంపీ కోటాలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు పంపిణీ చేశారు. పుత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపల్ చైర్మన్తోపాటు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రముఖుల పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యక్రమాలను నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచారు. మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ వేడుకలను నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. -
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావదినోత్సవం
సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నేడు ఘనంగా నిర్వహించాలని పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిశీలకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కె. శివకుమార్లు తెలిపారు. బుధవారం రాత్రి వారు సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. ఇందులో ముఖ్యనాయకులందరూ పాల్గొనాలని చెప్పారు. అనంతరం గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో, రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement