-
సాహిత్య మరమరాలు : వచ్చాక చెప్పు
ఒకరోజు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు మర్యాదలు చేసి కూర్చోబెట్టారు ఇంట్లో వారు. కాసేపటికి శాస్త్రిగారు వచ్చారు. వచ్చినాయన సంభాషణ మొదలెట్టారు. 1940 నుంచీ తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు, అల్పమైన విషయాల్ని సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుపో...తు... న్నారు. 1945, 50, 60 ... మధునాపంతుల వారిలో అసహనం పెరిగిపోతోంది. అక్కడకు కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో, ‘‘ఒరేయ్ చంటీ, ఒకసారిలా వచ్చి 1991 వచ్చాక చెప్పు, అప్పుడొస్తాను ’’ అని తన గదిలోకి వెళ్లిపోయారు. వచ్చినాయన బిత్తరపోయాడు. ఉబలాటం అనండి, లౌల్యం అనండి స్వవిషయాలు ఊకదంపుడుగా చెప్పేసుకుంటే వినేవాళ్ళకు విసుగు పుట్టిస్తాయి. ఇక ఇపుడు విచారించి ప్రయోజనం లేదు. మితంగా పరిచయం చేసుకోవాలనే జ్ఞానం ఆలస్యంగా కలిగిందాయనకు. -దాట్ల దేవదానం రాజు -
పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు
1. సి.పి.బ్రౌన్ (సి.పి.బ్రౌన్పై విమర్శ వ్యాసాలు) పేజీలు: 272; వెల: 300 2. వేమన-2 (వేమనపై విమర్శ వ్యాసాలు) పేజీలు: 232; వెల: 250 ప్రధాన సంపాదకులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రతులకు: సభ్య కార్యదర్శి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, 1-1254, సి.పి.బ్రౌన్ రోడ్, ఎర్రముక్కపల్లి, కడప-516004. ఫోన్: 08562-255517 ఉదయిని (దాట్ల దేవదానం రాజు 60వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక) సంపాదకుడు: డా. శిఖామణి పేజీలు: 254; వెల: 100 ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియా నగర్, యానాం-533464. ఫోన్: 9440105987 గోరు ముద్దలు (పిల్లల కథలు) రచన: గీతా సుబ్బారావు పేజీలు: 128; వెల: 125 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో. శాంతివనం (పిల్లలు అనుభవాలు ప్రయోగాలు) రచన: మంచికంటి పేజీలు: 244; వెల: 200 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు. శిథిల స్వర్గం (నవల) రచన: కె.వి.నరేందర్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: కె.వి.శ్రీదేవి, 7-4-264/బి, బైపాస్ రోడ్ దగ్గర, విద్యానగర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా-505327. ఫోన్: 9440402871 శాంతికపోతం (కవిత్వం) రచన: బి.భూపతిరావు పేజీలు: 44; వెల: 25 ప్రతులకు: బొడ్డేపల్లి అరుణకుమారి, అచ్చిపోలవలస గ్రామం, పొందూరు మం., శ్రీకాకుళం-532402 -
సృజనం: మళ్లీ బాల్యం
తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. కాలం పంపే సంకేతాలు అందుతున్నాయి. ఎట్లాగో శిఖరం ఎక్కి అక్కణ్నుంచి నెమ్మదిగా జారుతున్నాను. రోజులు ముడతలు ముడతలుగా సాగుతున్నాయి. నాకే అర్థం కాని మాటలు అసంకల్పితంగా వచ్చేస్తున్నాయి. నా మాటలు నాకే పెద్ద ధ్వనితో వినపడుతున్నాయి. కాసింత సంయమనం అవసరమని తెలుస్తూనే ఉంది. నా చేతిలో ఏముంది గనుక? అలా దూరంగా చెవులు కొరుక్కుంటారెందుకు? ఎవరి మీదా నింద వేయలేను. కాల మహిమకు వయసు ఊడిగం చేస్తూంది. మరో పదిహేనేళ్లలో శత వసంతాల నిండు జీవితం పూర్తవుతుంది నాకు. వీళ్లు నా పిల్లలే కదా... ఇది నా ఇల్లే కదా... ఈ ఇంటి గోడలు నా జ్ఞాపకాలెన్నింటినో దాచుకున్నాయి. పదేళ్ల క్రితం జీవన సహచరిని కోల్పోయాను. గతాన్ని తవ్వుకుని జ్ఞాపకాల్ని నెమరేసుకోవడమే పని. సావధానంగా కూర్చుని ఒక్కడంటే ఒక్కడు వినడు. ముసలితనం కంపు కొడుతుంది కాబోలు. క్రమేపీ ఎవరికీ అక్కర్లేని వాడిగా మారుతున్నాను. భవిష్యత్ మరీ హీనం కాకుండా నా స్థానం పదిలపరుచుకోవాలి. లేకపోతే దబ్బున పడేసి మీద నుంచి వెళ్లిపోతారు. డక్కా ముక్కీలు తిన్న మొండిఘటాన్ని. అయినా ఈవేళ జరిగిందేమిటి? పార్వతి తద్దినం. భానుమూర్తి, సీతారాం వచ్చారు. శాస్త్రోక్తంగా జరిగింది. భోజనాలయ్యాక తీరిగ్గా కబుర్లలో పడ్డారు కొడుకులు, కోడళ్లు, మనుమలు. ఇల్లంతా కోలాహలం. ఆరోగ్యవంతమైన కుటుంబ సాన్నిహిత్యం. అరవైకు చేరువౌతున్న నా పెద్దకొడుకు భానుమూర్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. చిన్నకొడుకు సీతారాం పేపరు చదువుతున్నాడు. యానాంలో ఉంటున్న వారు సంబంధం లేని పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఆంధ్ర వార్తలు చదువుతారు. రాజకీయాలు వినోదంగానే కాకుండా ఉత్సుకత పెంచేవిగా కూడా ఉంటున్నాయి. సీతారాంను దగ్గరకు రమ్మని సైగ చేసి పిలిచాడు భానుమూర్తి. భానుమూర్తి, సీతారాం ఇద్దరూ పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. పుదుచ్చేరి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. యానాం విడిచి వాళ్లతో వెళ్లలేను. పాపం వాళ్లు బతిమాలుతూనే ఉన్నారు. ఇక్కడ వెలగబెట్టే రాచకార్యాలు లేవు. అజమాయిషీ చేసే ఆస్తులు లేవు. కష్టసుఖాలు కలబోసుకునే నా ఈడు చిన్న సమూహం ఉంది. నా బలహీనతలు నాకున్నాయి. తమాయించుకోలేని కోపం. కోపం వస్తే నేనెవరో నీవెవరో. భానుమూర్తి వాలకం అనుమానాస్పదంగా ఉంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. తను కూడా పుదుచ్చేరి రావాలని గట్టిగా పట్టుపడతాడేమో. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కున్నారేమో. వీలుపడదని చెప్పాలి. ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోయే జన్మభూమి మంత్రం జపించాలి. పరభాషా రణగొణ ధ్వనుల మధ్య దిక్కులేని అనాథగా, మూగిగా కాలం గడపలేనని చెప్పాలి. భానుమూర్తి గొంతు సవరించుకున్నాడు. ఆప్యాయంగా, అభిమానంగా, వినమ్రంగా తమ నిర్ణయాన్ని కొంచెం భయంగానే నాముందుంచాడు. నా ముఖం కందగడ్డయ్యింది. లేదు... అలా మార్చుకున్నాను. అణచుకోలేని ఆవేశం వచ్చింది. లేదు... తెచ్చుకున్నాను. జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కుండబద్దలు కొట్టాలి. ‘‘ఎంత మాటన్నావు? మనిషిని పెట్టి సేవలు చేయిస్తావా? వంటదానికి మూడువేలు, పనిమనిషికి వెయ్యి రూపాయలు చొప్పున కుదిర్చేశావా? అక్కడితో మీ బాధ్యత తీరిపోయిందా? కుదరదు. ఒప్పుకోను. రత్నాల్లాంటి పిల్లలుండగా నాకలాంటి కర్మ వద్దు. నేను అప్పుడే పోను. మరో పదిహేనేళ్లు బతుకుతాను. అన్నదమ్ములిద్దరూ వంతులే వేసుకుంటారో వాటాలే పంచుకుంటారో నాకు తెలియదు. కుటుంబంతో సహా ఎవరో ఒకరు నా కళ్లముందుండాల్సిందే. మీ శషభిషలు నా దగ్గర పనిచేయవు’’ విరుచుకుపడ్డాను. నా కొడుకులు మంచివాళ్లు. నాకెక్కడా నొప్పి తగలనీయరు. సందేహం లేదు. కాని... కాని... అది అంతే! భానుమూర్తి బిత్తరపోలేదు. ఎప్పుడూ అదే నిదానం. ఒప్పించాలనుకుంటాడు. బలవంతం చేయడు. సీతారాం అలా కాదు. తన వాదన వినిపించడానికి చూస్తాడు. ‘‘నాన్నా! మా ఇబ్బందుల్నీ గమనించాలి. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లం. అన్నన్ని రోజులు కుటుంబాలతో ఇక్కడుండటం సాధ్యమయ్యే పనా? మాతో పాటు మీరు రారని ఈ ఏర్పాటు చేశాం. మీకన్నీ తెలుసు’’ సీతారాం అన్నాడు. పుదుచ్చేరి రానని తెలుసు. వాళ్లకున్న ప్రత్యామ్నాయం ఒకటే. ఇక్కడే ఏదో ఏర్పాటు చేయాలి. కరెంటు పోయింది. ఫ్యాన్ తిరగడం ఆగింది. యానాంలో కరెంటు కోతలుండవు. ఏదో తాత్కాలిక సమస్య వచ్చుంటుంది. అక్కడున్న అట్ట తీసుకుని విసరసాగాడు భానుమూర్తి. రాజీపడలేని అలవాట్లు కొన్ని ఉన్నాయి నాకు. స్నానానికి వేడినీళ్లుండాలి. రాత్రిళ్లు ఎవరో ఒకరు కాళ్లు పట్టాలి. లేకపోతే నిద్ర రాదు. తెల్లవారుజామున అయిదు గంటలకే గ్లాసుడు కాఫీ తయారుచేసి ముందుంచాలి. ఆలస్యం అయితే చిందులేస్తాను. పొరుగింటి వాళ్లతో కలవను. పలకరింపుగా కూడా నవ్వను. సీరియస్గా ఉంటాను. చిన్నపిల్లలు ఎక్కడున్నా వాళ్లతో కలిసిపోతాను. ఆనందంగా శేష జీవితం గడపడానికి నావాళ్లు నా దగ్గరే ఉండాలి. ఈ విషయంలో రాజీ లేదు. మెట్టు దిగకూడదు. కోపం పూనాలి. ముఖం కవళికల్ని ఆ విధంగా మార్చుకోవాలి. ఉద్వేగంగా మాట్లాడి, ఇందులో సొంత లాభం తప్ప మరేం లేనట్టు పెద్దరికానికి లోటు రాకుండా స్థిరంగా నిలబడాలి. గభాలున లేచి, నాలుగడుగులేసి, మళ్లా వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాను. నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం. ఈలోపులో కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరగడం మొదలెట్టింది. ‘‘అక్కడికే వచ్చి చద్దామంటే, మీరు ఇళ్ళెలా కట్టుకున్నారు? రెండేసి గదుల ఇళ్ళు. మీకూ మీ పిల్లలకే సరిపోతుంది. తండ్రి అనేవాడు ఒకడున్నాడు, వాడికో గది ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇది మా బెడ్రూమ్, ఇది మా పిల్లల గది అంటూ తెగ మురిసిపోతారు. మరి తండ్రి ఎక్కడుంటాడు? ఈ ఆలోచన మీకు రాలేదు. ఎందుకంటే మేం కాటికి కాళ్లు కాచుకునేవాళ్లం. మీరేమో కలకాలం ఉండేవారు. అంతేనా? కుటుంబం అంటే మీరూ మీ పిల్లలూ. అంతే కదా!’’ ‘‘అది కాదు నాన్నా. ఇప్పుడూ...’’‘‘పనిమనుషులు సొంతవాళ్లు ఎలా అవుతారు? మీరుండగా వాళ్ల అవసరం దేనికి? తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఓహో! మొన్న జరిగిన సంఘటన గురించా?’’ భానుమూర్తి, సీతారాం ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్లకేమీ గుర్తుకు రావడం లేదు. పొగాకు కాడ అందుకున్నాను. చుట్ట చుట్టుకున్నాను. నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లతో అంటించుకున్నాను. ‘‘నిజంగా మాకేమీ తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుంటే లెంపలేసుకుంటాం’’ భానుమూర్తి అన్నాడు. ‘‘కొన్ని కూరలు కొంతమందికి నచ్చవు. పొట్లకాయ, కాకరకాయ నాకు నచ్చదు. అదే వండారు. ఒళ్లు మండింది. పళ్లెం గిరాటేశాను. గదంతా చిందింది. కోపంతో వీధిలోకి పోయాను. గుమ్మంలో బిచ్చగాడున్నాడు. నా కోపం వాడి మీద చూపించాను. ఆవకాయ బద్దకే ఈ ఇంట్లో దిక్కులేదు. నీకు బిచ్చమెక్కడేస్తార్రా. పో పో అని గదిమాను కోడళ్లకు వినిపించేలా. కాకపోతే వాళ్లు ఉన్నవీ లేనివీ కల్పించి, మీ చెవులకు చేరవేసేవారు కాదు కాబట్టి మీకు తెలియలేదు.’’ అసలు సంగతి వేరు. చాపల్యం కొలదీ ఇంతింత ఆవకాయ ఎర్రగా కలుపుకుని తింటుంటాను. ఒంటికి తేడా వస్తుందేమోనని ఒక్క బద్ద మాత్రమే పెడతారని తెలుసు. అసహనంతో ముష్టోడి ముందు నా కోపాన్ని ప్రదర్శించాను. నెపాన్ని ఇతరుల మీదకు నెట్టడం వయసు తెచ్చే జబ్బేమో. కోడళ్లు మాట్లాడలేదు. జరుగుతున్న తంతు చూస్తున్నారు. ‘‘మీరందరూ ఇక్కడున్నారు. ఒక విషయం చెబుతాను. ప్రస్తుతం నా పనులు నేనే చేసుకుంటూ బాగానే తిరుగుతున్నాను. నాకూ ఒకరోజు వస్తుంది. ఆ వేళ అన్నం మీరే తినిపించాలి. చేయి కడగాలి. మూతి తుడవాలి. కదల్లేక మంచం మీదుంటే ఇక చెప్పేదేముంది? అలాగే వదిలేయరు కదా, మూలన పడేసి. ఈ కుటుంబం కోసం నేను పడ్డ పాట్లు మీకు తెలుసు కదా’’ ఊపిరి తీసుకుని తిరిగి మాట్లాడబోతుండగా భానుమూర్తి, సీతారాం అడ్డు చెప్పారు. చేతులు పట్టుకున్నారు. గద్గద స్వరంతో అనునయించారు. ఒకానొక ఉద్వేగ క్షణం అది. బహుశా నా మాటలు వారికెంతో బాధ కలిగించే ఉంటాయి. అయిదేళ్ల మనుమడు రైలుబండి కూత పెట్టుకుంటూ అక్కడికొచ్చాడు. మౌనం రాజ్యమేలుతున్న సమయం. వాడికిదేమీ పట్టలేదు. కిటికీ వార కింద ఉన్న బెలూన్ అందుకున్నాడు. గోడకు అణచిపెట్టి టప్మని పేల్చాడు. ఎక్కడిదో ప్లాస్టిక్ బొమ్మ దొరికింది. దాన్ని పీకి పారేస్తున్నాడు. సోఫాలపైనున్న రంగురంగుల అల్లికల గుడ్డను తీసుకుని కాళ్లతో తొక్కుతూ విసిరేస్తున్నాడు. ఎవరూ వారించడం లేదు. తప్పు అని చెప్పడం లేదు. మెల్లగా అడుగులేసుకుంటూ వాడి మమ్మీ దగ్గరికెళ్లింది. ఏం చేస్తుందో అందరూ ఆతృతగా చూస్తున్నాం. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. వాడి ఆగడాల్ని తగ్గించే మార్గం అదే అన్నమాట. అల్లరిని ఆమె ఆనందంగా స్వీకరిస్తోందా? ‘‘వాడికీ నాకూ తేడా ఏమిటిరా? వాడు ఎదిగేవాడు. నేను నేల జారేవాడిని. నన్నూ అలాగే భరించలేరా? నాలో వాడిని చూసుకోండి’’ అని కళ్లు మూసుకున్నాను. నుదుటి మీద తడి స్పర్శ. మెత్తని ఆలింగనం. భానుమూర్తి, సీతారాం ఒకళ్ల తర్వాత మరొకరు తమ పెదాల్ని నా నుదురుకు తాకిస్తున్నారు. మురిపెంగా చూస్తూ ముద్దు పెట్టుకుంటున్న తల్లుల్లాగే ఉన్నారు వాళ్లిద్దరూ. నా కళ్లూ వర్షిస్తున్నాయి, అనుకున్నది సాధించినందుకు. - దాట్ల దేవదానం రాజు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement