-
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
కుంగిన సైదాబాద్–సంతోష్నగర్ ప్రధాన రహదారి
సాక్షి, సంతోష్నగర్: సైదాబాద్–సంతోష్నగర్ ప్రధాన రహదారిపై రోడ్డు గురువారం రాత్రి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. ఐ.ఎస్.సదన్ చౌరస్తా నుంచి సంతోష్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో పిల్లర్ల కోసం గోతులు తీసి అలాగే వదిలేశారు. దీంతో భూమి కుంగిపోవడంతో రోడ్డుపై భారీగా గుంత ఏర్పడింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాఫిక్ను నియంత్రించారు. ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులతో సంతోష్నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చివేశారు. చదవండి: ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ? -
Heavy Rains: రోడ్లకు వర్షాఘాతం
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ జిల్లాల్లో దాదాపు 1,500 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే దాదాపు 800 కి.మీ. మేర రోడ్లు దెబ్బతినగా... నెల్లూరు జిల్లాల్లో దాదాపు 400కి.మీ., అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మరో 300 కి.మీ. మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా ఆ జిల్లాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. వరద తగ్గితేగానీ ఎంతమేరకు రోడ్లు దెబ్బతిన్నాయన్నది కచ్చితంగా చెప్పలేమని ఆర్ అండ్ బీ అధికారులు అంటున్నారు. మరోవైపు దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.100 కోట్లు అవసరమని కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్ అండ్ బీ అధికారుల బృందాలు ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దెబ్బతిన్న హైవేలు మరోవైపు పలుచోట్ల జాతీయ రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లా కమలాపురం వద్ద పాపాగ్నిపై వంతెన కూలిపోయింది. 1977లో నిర్మించిన ఈ వంతెనపై ఉన్న ఏడు స్లాబుల్లో ఒకటి కూలిపోగా.. మిగిలిన ఆరు స్లాబులు కుంగిపోయాయి. దాంతో ఆ వంతెనకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతపురం నుంచి కడప వెళ్లే వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లిస్తున్నారు. కూలిన వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దారమడుగు వద్ద జాతీయ రహదారి–16 తెగిపోయింది. చెన్నై–కోల్కతా జాతీయ రహదారి మార్గం ధ్వంసమైంది. పడుగుపాడువద్ద రహదారి కోతకు గురైంది. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి. తిరుపతి–శ్రీకాళహస్తి మార్గంలో వాహనాలను తొట్టంబేడు వద్ద నిలిపివేసి.. కడప, పామూరు, దర్శి మీదుగా మళ్లిస్తున్నారు. దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు తక్షణ మరమ్మతులు వర్షాలకు గండ్లు పడిన గ్రామీణ రోడ్లను రూ.30.57 కోట్లతో తక్షణం మరమ్మతులు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో 241 రోడ్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించినట్టు ఆయన చెప్పారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 116 ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లకు గండ్లు పడగా.. నెల్లూరు జిల్లాలో 72, అనంతపురం జిల్లాలో 53 రోడ్లకు గండ్లు పడినట్టు గుర్తించారు. మరో 772 గ్రామీణ రోడ్లు రోజుల తరబడి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడినట్టు గుర్తించామన్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 463 రోడ్లు గుంతలు పడి దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 2,254 కి.మీ. గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నట్టు వివరించారు. 4 జిల్లాల్లో 9 చోట్ల ప్రభుత్వ భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. -
భారీ వర్షాలతో ధ్వంసమైన లింక్ రోడ్డు
-
హైదరాబాద్లో పదే పదే.. అదే సీన్
వర్షం కురిసిన ప్రతిసారీ నగరం వణికిపోతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఎప్పటిలాగే పలు కాలనీలు, బస్తీలతోపాటు ప్రధాన రహదారులు నీట మునిగాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల మేరకు నగరంలో 200 వాటర్లాగింగ్ ప్రాంతాలుండగా, లెక్కలో లేనిప్రాంతాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో శుక్రవారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ మధ్య కేంద్రీకృతమైందని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగ రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటి ంచింది. బేగంపేటలోని ద్వారకాదాస్ సొసైటీలో ఇలా.. కాగా గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో 9–10 సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీ ల వా సులు నానా అవస్థలు పడ్డారు. కాగా రాత్రి 10 గంటల వరకు ఆర్సీ పురంలో 4.8 సెం.మీ., శేరిలింగంపల్లి 3.0, ఖాజాగూడ 2.6, మణికొండ 2.5, బీహెచ్ఈఎల్ 2.4, రాయదుర్గం 1.9, షేక్పేట్ 1.9, లింగంపల్లి 1.6, మెహిదీపట్నం 1.5, గుడిమల్కాపూర్లో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం ► మూడు గంటల్లోనే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ ప్రభావం కనిపించింది ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట, కూకట్పల్లి, కృష్ణాగర్, లక్డీకాపూల్,పంజగుట్ట తదితర ప్రాంతాల్లో వర్ష తాకిడికి ప్రజలు అల్లాడిపోయారు ► ప్రధాన రహదారుల ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిపోవడంతో ముందుకు కదల్లేక వాహనవారులు పడరాని పాట్లు పడ్డారు ► నగర ప్రజలకు సుపరిచితమైన రాజ్భవన్రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, మైత్రీవనం, విల్లామేరీ కాలేజ్, లేక్వ్యూ గెస్ట్హౌస్ వంటి ప్రాంతాల్లోనే కాక పలు కొత్తప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయింది ► జీహెచ్ఎంసీకి 59 ఫిర్యాదులందాయి. వీటిల్లో 40 నీటినిల్వలకు సంబంధించినవి కాగా, 19 ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఫిర్యాదులందని సమస్యలు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement