-
మీకు సైబోర్గ్ అంటే తెలుసా?
టోక్యో: రోబో అంటే ఆదేశాలకనుగుణంగా పనిచేసే యంత్ర పరికరమని మనందరికీ తెలిసిందే.. మరి మీకు సైబోర్గ్ అంటే తెలుసా? అంటే.. సగం కీటకం.. సగం యంత్రం అన్నమాట. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడగాస్కర్కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే అతిపలుచని, రిమోట్ కంట్రోల్తో పనిచేసే బ్యాక్ప్యాక్లను అమర్చారు. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టులు ఉద్దేశం. అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్పీజే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. చదవండి: మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు.. -
అదిరిపోయిన స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్స్.. రేంజ్ ఎక్కువ, ధర తక్కువ..!
ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇగ్నీట్రాన్ మోటోకార్ప్'కు చెందిన స్వదేశీ ఈవీ స్టార్టప్ సైబోర్గ్ తన 3 ఎలక్ట్రిక్ బైకుల(యోడా, జీటీ 120, బాబ్-ఈ)కు సంబంధించిన ధరలను ఆవిష్కరించింది. ఈ బైక్ ధరలు వరుసగా ₹1,84,999(యోడా), ₹1,64,999(జీటీ 12), ₹1,14,999(బాబ్-ఈ)గా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో లభించే అదనపు సబ్సిడీల వల్ల వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ బైక్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. కంపెనీ త్వరలో మోటార్ సైకిళ్ల బుకింగ్ తేదీని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం రూ.999 మీకు ఇష్టమైన బైకును రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. క్రూయిజర్ యోడా భారతదేశపు మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' ఎలక్ట్రిక్ క్రూయిజర్ యోడా మోటార్ బైక్ 3.24 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. యోడా ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్(బ్లాక్, సిల్వర్) వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సేకన్లలో అందుకుంటుంది. దీనిలో 72v, 3.24 kWH బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. బాబ్-ఈ బాబ్-ఈ అనేది భారతదేశపు మొట్టమొదటి కాంపాక్ట్ స్పోర్టీ ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ డర్ట్ మోటార్ బైక్. ఇది 2.88 కెడబ్ల్యుహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. బాబ్-ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు కలర్(నలుపు, ఎరుపు) వేరియెంట్లలో లభ్యం అవుతుంది. ఇది 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సేకన్లలో అందుకుంటుంది. దీనిలో 72v, 2.88 kWH బ్యాటరీ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. సైబోర్గ్ జీటీ 120 సైబర్గ్ జీటీ 120 ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్లో 4.32 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఇది 6 కిలోవాట్ల సామర్థ్యాన్ని అందిస్తుంది. సింగిల్ ఛార్జ్తో ఈ స్పోర్ట్స్ బైక్ 180 కిలోమీటర్ల వరకు వెళ్తుందని ఈ సంస్థ స్పష్టం చేసింది. ఈ సరికొత్త సైబర్గ్ జీటీ 120 మోటార్ సైకిల్ 2.5 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. ఈ సంస్థకు చెందిన సైబర్గ్ యోడా, సైబర్గ్ బాబ్ వేరియంట్ల మాదిరిగా కాకుండా దీనికి సైజ్, వెయిట్కు తగినట్లుగా ఫిక్స్డ్ బ్యాటరీని పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. 15 ఆంపియర్ల ఫాస్ట్ హోం ఛార్జర్తో 5 గంటల్లోనే పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. సైజ్, వెయిట్కు తగినట్లుగానే ఈ బైక్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. వెదర్ ప్రూఫ్, టచ్ సేఫ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. సైబోర్గ్ జీటీ 120 మోటార్ సైకిల్లో కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో అందుబాటులోకి వచ్చింది. జియో ఫెన్సింగ్, జియో లొకేషన్, యూఎస్బీ ఛార్జింగ్, బ్లూటూత్, వైర్లెస్ ఇగ్నీశషన్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ డిస్ప్లేకో రైడర్కు బ్యాటరీ లైఫ్ లాంటి వివరాలను చూపిస్తుంది. అంతేకాకుండా దీని డిస్ప్లేకు ఐపీ65 రేటింగ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ను కలిగి ఉంది. (చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?) -
మనిషి చావును జయిస్తాడా ?
మనిషికి మరణం లేకపోతే.. దేవుడవుతాడు. అప్పుడు దేవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి వస్తుందా? వైద్య విజ్ఞాన రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న మానవుడు చావును జయంచగలడా? జయించవచ్చని అంటున్నారు జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యువల్ నోవా హరారి. జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని, జెనెటికల్ ఇంజనీరింగ్ లేదా సైబోర్గ్ టెక్నాలజీని ఉపయోగించి చావుకు చావును లిఖించవచ్చని ఆయన చెబుతున్నారు. అప్పుడు చావు, పుట్టుకలు మానవుడి చేతిలోనే ఉంటాయి. అప్పుడు పురాణాలను తిరగ రాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా మెషిన్ను, మనిషిని కలగలిపి హాలీవుడ్ చిత్రం టెర్మినేటర్లోని ష్వాజ్నెగ్గర్ పాత్రలాగా సైబోర్గ్ను సృష్టించవచ్చని, ఇప్పటికే ప్రపంచంలోని అనేక సాంకేతిక దిగ్గజ సంస్థలు ఈ దిశగా ప్రయోగాలు ప్రారంభించాయని ప్రొఫెసర్ హరారి తెలిపారు. ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రయోగాలు ఫలించి ఓ 200 సంవత్సరాల్లో మానవుడు పూర్తి సైబోర్గ్గా మారుతాడని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. మానవుడు సైబోర్గ్గా మారితే బాడీలో ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకుంటా చావు దరిదాపుల్లోకి రాకుండా చూసుకోగలడని ఆయన అన్నారు. అయితే సైబోర్గ్గా మారడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో ధనవంతులకే అజరామరులయ్యే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement