-
ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా..
ఆర్టీసీ అనగానే.. పాతబడిన, కండీషన్లో లేని డొక్కు బస్సులే సహజంగా గుర్తుకొస్తాయి. వాటి రూపం కూడాఆ భావనకు బలం చేకూర్చుతుంది. వెలిసిపోయిన రంగులు, శుభ్రత లోపించడం, వ్యాపార ప్రకటనలతో నిండిపోవడం వంటి దృశ్యాలే కళ్లముందు కదలాడతాయి. ఇప్పుడా పరిస్థితి మారనుంది. రంగురంగుల వర్ణచిత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా వాటి రూపం మారనుంది. ఇచ్చిన హామీ మేరకు ఏపీఎస్ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ప్రజారవాణ శాఖను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సుల రూపురేఖలను మార్చే దిశగా చర్యలు చేపట్టింది. మన రాష్ట్ర, తెలుగువారి సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే వర్ణరంజితమైన చిత్రాలు.. ఇప్పుడున్న వ్యాపార ప్రకటనల స్థానంలో కనువిందు చేయనున్నాయి. అలాగే డొక్కు బస్సులన్న అపప్రదను తొలగించేందుకు రీకండీషన్ కూడా చేయిస్తున్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతోపాటు.. బహుమతులు పొందిన చిత్రాలను.. సంబంధిత విద్యార్థి, పాఠశాల పేరుతో సహా బస్సులపై ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సీఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. వర్ణ చిత్రాలతో అలంకరించిన 21 బస్సులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల రూపురేఖలను దశలవారీగా మార్చనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం): ప్రగతి చక్రం కొత్త ‘కళ’ను సంతరించుకుంటోంది. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సొబగు లద్దుకుంటోంది. మన పండగలు, దర్శనీయ ప్రదేశాలు, కళలు, రమణీయ దృశ్యాలతో చిత్రీకరించిన బస్సులు ఇకపై కళ్లెదుటే సాక్షాత్కరించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ ‘మన బస్సు.. మన సంస్కృతి’ పేరిట అందంగా పెయింట్ చేస్తున్నారు. విశాఖ రీజియన్లోని 600 బస్సులను దశలవారీగా రీ కండిషన్ చేసి, పెయింటింగ్ వేయించనున్నారు. ప్రయాణికులను ఆకర్షించేలా.. చూడముచ్చటగా రూపొందిన 21 బస్సులను వాల్తేరు డిపో ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్ కమిషనర్ మాదిరెడ్డి ప్రతాప్రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇకపై బస్సులపై ఎటువంటి అడ్వర్టై ్జజ్మెంట్స్ కనిపించవు. ఏడాది పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళలు, పండుగలు, దర్శనీయ ప్రాంతాలను చిత్రీకరించిన పెయింటింగ్స్తో ఆర్టీసీ బస్సులు రూపుదిద్దుకోనున్నాయి. ఆరు నెలల్లో అన్ని బస్సులకూ కొత్త సొబగులు నిర్జీవంగా ఉన్న బస్సులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన పిమ్మట, ప్రజల మనసులకు హత్తుకునేలా స్థానిక కళాకారులచే కళాకృతులను బస్సులపై చిత్రీకరించామని ప్రతాప్రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో నగరంలోని బస్సులన్నీ కొత్త సొబగులు అద్దుకుంటాయన్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, అందుకు తగినట్లుగా బస్సులకు కొత్త కళను తెస్తున్నామన్నారు. నగరంలో 600 బస్సులున్నాయని, ప్రతి బస్సు రోజుకు 220 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నాయని తెలిపారు. బస్సులన్నింటినీ సంస్కృతి, సంప్ర దాయాలు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతామన్నా రు. ఇది పెద్దగా ఖర్చయిన వ్యవహారం కాదని, నిర్జీవమైన వాహనాలను రీ కండీషన్ చేసి పెయింట్లు అద్దడంతోనే కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెప్పారు. ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆర్టీసీ ఎండీ ప్రతాప్రెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ఆ విభాగానికి తొలి కమిషనర్గా నియమించారని, దానిని నిలబెట్టుకుని ఆర్టీసీని కొత్తపుంతలు తొక్కిస్తానన్నారు. తాను ఏయూలోనే చదువుకున్నానని తెలిపారు. అనంతరం డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడారు. మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, డ్రైవర్లు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని, వారికి పలు సూచనలు చేశారు. డ్రైవర్లు వేసుకుంటున్న యూనిఫాంపై స్పందిస్తూ టీ షర్ట్స్ వేసుకుంటే బాగుంటుదన్నారు. కార్యక్రమంలో ఈడీ రవికుమార్, రీజనల్ మే నేజర్ ఎం.యేసుదానం, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(అర్బన్) సుధాబిందు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(రూరల్) కె.వెంకట్రావు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(అర్బన్) బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్(రూరల్) అప్పలనారాయణ, వాల్తేర్ డిపో మేనేజర్ గంగాధర్తో పాటు పలు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కొలువుదీరిన కళాకృతులు ఆర్టీసీ బస్పై చక్కని ఆకృతులు, రమణీయ దృశ్యాలెన్నో సాక్షాత్కరిస్తున్నాయి. ‘అందాల కైలాసగిరి.. ఆంధ్రప్రదేశ్కు అదనపు సిరి’, ‘ప్రకృతి ఒడిలో జీవన పోరాటం’, ‘భారతదేశ అన్నపూర్ణ .. మన ఆంధ్రప్రదేశ్’, ‘రైతే మన దేశానికి వెన్నెముక’, ‘డాల్ఫిన్ నోస్ .. విశాఖ సాగర తీర అద్భుతం’, బాపూ బొమ్మలు, చేనేత వస్త్రాల సోయగం, ‘ఉభయ గోదావరి పెన్నిధి..గోదావరి’, ‘అణువణువునా ప్రకృతి..అందమైన అనుభూతి’, ‘విహంగాల సోయగాలు.. కొల్లేటి సరస్సు’, ‘వివాహ భోజనంబు.. పసందైన వంటకాలు’, ‘అబ్దుల్ కలాం కలల కోట .. శ్రీహరికోట’, ‘పక్షి జాతులకు అలవాలం.. పులికాట్ సరస్సు’.. అరకు నృత్యం థింసా.. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రత్యేకతలు.. కళలు బస్సులపై కొలువుదీరుతున్నాయి. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు ప్రతి జిల్లాలో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి, వాటిలో ఉన్నత స్థానంలో నిలిచిన పెయింటింగ్లను బస్సులపై చిత్రీకరిస్తూ..పెయింటింగ్ వేసిన విద్యార్థి పేరు, స్కూల్ పేరు కూడా పెడతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ముఖ్యంగా డ్రీమ్ అ»ౌట్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై పెయింటింగ్స్ ఉంటాయన్నారు. అమరావతి సర్వీసులతో పాటు 14.5 మీటర్ల పొడవు గల 18 వోల్వో బస్సులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాటికి డాల్ఫిన్ నోస్పై ఆర్టీసీ ఎంబ్లెమ్తో కూడిన బొమ్మలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. -
48 అవర్స్ చాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘48 గంటల సినిమా తయారీ పోటీ’లను వైభవంగా నిర్వహించేందుకు గాను విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక షార్ట్ఫిల్మ్ తీయాలంటే మామూలుగా నిడివిని బట్టి తక్కువలో తక్కువ నెలరోజులైనా పడుతుంది. కానీ 48 గంటల్లో స్క్రిప్టు రాయడం, షూటింగ్, ఎడిటింగ్ లాంటివి పూర్తి చేసి సినిమా తీయడానికి తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ కొత్త ఒరవడికి తెరలేపింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా అనే కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఫిల్మోత్సవం.. : గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ఫిల్మోత్సవం పేరిట షార్ట్ ఫిలిం పోటీల ను నిర్వహిస్తున్నారు. ఈసారి అవతరణ ఫిల్మోత్స వాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘48 అవర్స్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్’ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ మే 24 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మొదలై 26 (ఆదివారం) రాత్రి 7 గంటలకు ముగియనుంది. శుక్రవారం సాయంత్రం భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా క్యారెక్టర్ని వాడి 4 నుంచి 8 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. మే 27న పోటీదారుల జాబితాను వెల్లడిస్తారు. విజేతలను జూన్ 3న రవీంద్రభారతిలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు. ప్రతిభ చూపేందుకు మంచి అవకాశం: తమ ప్రతిభను నిరూపించుకునేందుకు గాను ఔత్సాహిక సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని ఆసక్తి ఉన్న యువత అందరూ వినియోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, తమ ప్రతిభను మెరుగు పరచడానికి సినీవారం, సండే సినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. తద్వారా తమ ప్రతిభకు వారు మెరుగులు దిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఔత్సాహిక సినిమా దర్శకులు 91 8919997465 నంబర్ను సంప్రదించవచ్చు. - మామిడి హరికృష్ణ,భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు -
స్వీటెత్తిన జనం..
సాక్షి,సిటీబ్యూరో: సంక్రాంతి పర్వదినం సందర్భంగా భాగ్య నగరవాసులకు మధురానుభూతిని పంచాలని భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం అధికారులు ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. పరేడ్ మైదానం మూడురోజుల పాటు మిఠాయిలతో ఘుమఘుమలాడింది. వెరసి సిటీజనులు ఎంతో ఎంజాయ్ చేశారు. అధికారులు ఊహించిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా జనం తరలిరావటం విశేషం. దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. నోరూరించిన బెంగాలీ రసగుల్ల.. స్వీట్ ఫెస్టివల్లో తొలిరోజు 800 రకాలు ప్రదర్శించా రు. గంటన్నరలోనే 70 శాతం అమ్ముడు పోయా యి. రెండోరోజు 1000 రకాలు ఉంచారు. రాత్రి 9 గంటలకే అన్ని అమ్ముడు పోయాయి. చివరిరోజైన 15వ తేదీన 1200 రకాలు స్వీట్లు ఉంచారు. సాయంత్రం జనం ఒక్కసారిగా ఎగబడడంతో అవి కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ప్రధానంగా జాతీయ స్థాయి మిఠాయిల్లో కొంకణి స్వీట్లు, బీహార్ స్వీట్లు బాగా అమ్ముడు పోయా యి. బీహార్కి తెలంగాణ స్వీట్లకు దగ్గరి పోలిక ఉండటంతో నగరవాసులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ప్రదర్శనలో ఉంచిన 74 రకాల పాయసాలు క్షణాల్లో అమ్ముపోయాయి. బెంగాలీ రసగుల్లలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇక అంతర్జాతీయంగా టర్కీ, కొరియా దేశాల స్వీట్లు అందరి మనస్సులను దొ చుకొన్నాయి. బూడిద గు మ్మడితో చేసిన స్వీట్ ప్ర జల ఫెవరేట్ కావటం విశేషం. దక్కన్ స్వీట్ల కోసం జనం క్యూ కట్టారు. హైదరాబాద్లో ఉ న్న బీహరీ, తమిళనాడు, మల యాళం, కర్ణాటక, కొంకణి సమాజా లు ఫెస్టివల్ విజయవంతంలో కీలకభూమిక పోషించాయి. 15వ తేదీ రాత్రి అంతర్జాతీయ పతంగుల పండగలో పాల్గొన్న కైట్ ప్లేయర్స్కి ప్లాజా హోట ల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఊహించని రీతిలో సందర్శకుల రాక.. 13 నుంచి 15 వరకు జరిగే స్పీట్ ఫెస్టివల్కు మూడు రోజులకు కలిపి లక్ష మంది జనం వస్తారని టూరిజం – సాంస్కృతిక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసు అధికారులు మందస్తుగా అడిగితే అదే సమాచారం అందించారు. కానీ పరిస్థితి మొదటి రోజే మారిపోయింది. ఊహించిరీతిలో తొలిరోజు ఇటు స్వీట్– కైట్ ఫెస్టివల్కు 1.50 లక్షల మంది హాజరయ్యారు. రెండోరోజైన 14వ తేదీన ఏకంగా 3 లక్షల మంది హాజరయ్యారు. దీంతో సాయంత్రంలోగా పరేడ్ మైదానం జనస ం ద్రంగా మారింది. మూడోరోజు 2.50 లక్షల మంది హాజరవటంతో అధికారులు సైతం -
సంస్కృతిని బతికిస్తున్నది రచనే
టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి పరిగి: నాటి నుంచి నేటి వరకు సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తూ వస్తున్నది రచనలేనని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలోని సత్యసాయి భవనంలో ఏర్పాటు చేసిన సాహితీ సమితి కార్యక్రమంలో వరకవుల జగన్నాధరాజు రచించిన పుండరీక చరిత్ర పద్యనాటకం పుస్తకాన్ని హరీశ్వర్రెడ్డితో పాటు ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కరయోగి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జయరాములు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ విజయమాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కవి, రంగస్థల నటుడు అయిన పుస్తక రచయిత వరకవుల జగనాధరాజును ఘనంగా సన్మానించారు. ఈ పుస్తకానికి ముందుమాట, ఇతివృత్తాన్ని భాస్కరయోగి వివరించగా ఆచార్యులు డాక్టర్ జయరాములు పుస్తక సమీక్ష గావించారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్రెడ్డి మాట్లాడుతూ ..తల్లిదండ్రుల సేవ అన్నింటికంటే గొప్పది.. వారిని విస్మరించరాదనే ఇతి వృత్తంతో పద్యరచన చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాలు, టీవీ షోలు నాటి సంస్కృతి సంప్రదాయాలను మరుగన పడేలా చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు సైతం టీవీ షోలకే బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్ భాస్కర యోగి మాట్లాడుతూ సమకాలీన అంశాలను అద్దంపట్టేలా వరకవుల జగన్నాధరాజు రచన సాగిందన్నారు. ఓ బస్టాండ్లో బిచ్చమెత్తుకునే వృద్ధులు తాము అడుక్కుని కొడుకులకు ఇవ్వకపోతే కొడతారని చెప్పిన మాటలకు చలించి ఈ రచన చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాటి పుండరీకుని చరిత్రి ప్రస్తుతం తల్లిదండ్రులను హింసించే పిల్లలకు తగ్గట్టుగా సరిపోతుందని తెలిపారు. అనంతరం ఈ పుస్తకాన్ని ప్రముఖ రంగస్థల నటుడు అయిన మాలెల అంజిలయ్యకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ సమితి పెద్దలు, నాయకులు కృష్ణయ్య, శ్రీశైలం, వీరకాంతం, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతురెడ్డి, భద్రప్ప, రంగాచారి, నర్సయ్య పాల్గొన్నారు. -
బతుకు భయం
కాంక్రీటు జంగిళ్లు కాబోతున్న పంట చేలు పనుల్లేక ఏమీ పాలుపోని కర్షక లోకం సమస్యలుగా మారిన కుటుంబ బాధ్యతలు గరీబులుగా మారుతున్న జరీబు రైతులు ఇదీ రాజధాని గ్రామాల్లో రేపటి చిత్రం పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదే శీయుల్లా తిరగాలి..! ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలో చిత విధానాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. రాజధాని గ్రామాల భవిష్యత్ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’ పొంచి ఉన్న పొల్యూషన్ ... రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య రహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు. సంస్కృతీ సంప్రదాయాలపై దాడి రాజధాని గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణ పనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముంబయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధించిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల కష్టాలు రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసుల వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకొంటున్న ప్రభుత్వం రైతులు అంగీకార పత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. జగన్ రాక కోసం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’ అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృత్తి పనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి. భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడ పాలి.. వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు. నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి. నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు పూలు, కూరగాయలు, పాలను విజయ వాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు. - సాక్షి ప్రతినిధి, గుంటూరు ముంపు వచ్చినా.. నష్టం రాలేదు నాకున్న 80 సెంట్ల పొలంతో పాటు, మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. నా 80 సెంట్లు కొండవీటి వాగులో మునిగిపోయినా, పంట నష్టం వచ్చినా, నేను కౌలుకు చేస్తున్న 3 ఎకరాల్లో లక్షా50వేల రూపాయలు ఆదాయం వస్తుంది. కుటుంబ పోషణతో పాటు పిల్లలను చదివించుకుంటున్నాను. భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. - మన్నం హనుమంత రావు చౌదరి, కౌలు రైతు, పెనుమాక పూలుకోయడం తప్ప మరే పనీ తెలియదు మేం తరతరాల నుంచి పొలాన్నే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు పూలు కోయడం తప్ప మరో పని తెలీదు. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి పిల్లలకు వంట చేసి క్యారేజీలు పెట్టుకుని వస్తాం. రోజుకు నాలుగైదు వందలు సంపాదిస్తాం. పిల్లలను చదివించుకుంటున్నాం. మాకు రుణమాఫీ వద్దు, డ్వాక్రా రుణాలు వద్దు మా భూములను వదిలిపెడితే చాలు. - గౌరుబోయిన జయమ్మ, బేతపూడి పూలతోటతోనే మా బతుకు పూలతోటలో కూలికి వెళ్తే వచ్చే సంపాదనపై ఆరుగురం బతుకుతూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఏదైనా ఇబ్బందైతే రైతులు ఆదుకుంటారు. ఎందుకంటే.. మళ్లీ కూలీ చేసైనా తీరుస్తామని వారికి నమ్మకం. వారి పొలాలే పోతే మమ్మల్ని ఎలా ఆదుకుంటారు. రెండు రోజులుగా గ్రామంలో రైతులు భయపడి భూములను ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తు ఏంటో తెలియడం లేదు. - సంకూరు సబ్బులు, రైతు కూలీ, నిడమర్రు ఇప్పుడెలా? రైతులు భయపడి పొలాలను ఇచ్చేశారు. ఉదయం నాలుగు గంటలకు లేచి వంట చేసుకుని వచ్చి కూలీ చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. వచ్చే నెల నుంచి ఏం చేసి బతకాలో తెలియడం లేదు. - పార్వతి, రైతు కూలీ, కురగల్లు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement