-
శ్రీపతికి సిరుల పంట
రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు పెరుగుతున్న టీటీడీ బడ్జెట్..హుండీ కానుకలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ.వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్లో రూ.905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ.1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ.590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదా యం అప్పట్లో రూ.227 కోట్లు ఉండగా ప్రస్తు తం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరి గింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ.50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి పదిహేను రెట్లు పెరిగి రూ.778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు. రూ.1.34 లక్షలతో మొదలై... 1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో హుండీ ద్వారా నెలకు రూ.80 కోట్లు లభిస్తుం డగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ.60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు లభిస్తుండ టం పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఈ నెలల్లో ఆదా య పన్ను పద్దులు చూపిం చే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారముంది. రూ.12వేల కోట్లపైనే డిపాజిట్లు 2016-2017సంవత్సరానికిగాను రూ. 2678 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఇందులో డిపాజిట్లపై వడ్డీ సుమారు రూ.778.93 కోట్ల రావచ్చని టీటీడీ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అంటే.. పెట్టుబడులపై తొమ్మిది శాతం వడ్డీ లెక్కిస్తే శ్రీవారి నికర డిపాజిట్లు సుమారుగా రూ.12వేల కోట్ల పైమాటే. పెట్టుబడులపై వచ్చే వడ్డీని టీటీడీ విని యోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలోనే తిరి గి డిపాజిట్ల కింద జమ చేసేస్తుండటంతో నిధులు బాగా పెరుగుతున్నాయి. -
ఆషాఢంలోనూ ‘కనక’వర్షమే
దుర్గమ్మకు రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం 20 రోజులకు రూ.1.40 కోట్లు సాక్షి, విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలోనూ భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకున్నారు. ఆలయానికి గత 20 రోజులకు గానూ రికార్డుస్థాయిలో రూ.1.40 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాలు, భవానీదీక్షల విరమణ మహోత్సవాలలో రూ.1.35 కోట్లు, ఇక సాధారణ రోజుల్లో రూ.1.20 కోట్లకు మించి ఎన్నడూ హుండీ ఆదాయం ఇంత భారీగా రాలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. కానుకల్లో విదేశీ కరెన్సీ కూడా ఎక్కువగానే ఉందని తెలిపారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులను సోమవారం భవానీ దీక్ష మండపంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 20 రోజులకు గానూ 14 హుండీల ద్వారా రూ.1,40,38,068 నగదు, 387 గ్రాముల బంగారం, 3.571 కిలోల వెండి లభించినట్లు అధికారులు వివరించారు. కేవలం అమ్మవారి ప్రధాన ఆలయ పరిసరాలలోని హుండీల్లో కానుకలను మాత్రమే లెక్కించారు. ఉపాలయాలు, శివాలయం, స్నానఘాట్ల హుండీల్లోని కానుకలను లెక్కించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే 20 రోజులకు గానూ రూ.రెండు కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన శాకంబరీ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు భారీగా కానుకలు, మొక్కులను సమర్పించుకున్నట్లు భావిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు బెజవాడ కనకదుర్గమ్మను ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నాయకులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ చక్రధర్బాబు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement