-
నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ల అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కరీంనగర్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18వ డివిజన్కు చెందిన సుధగోని కృష్ణాగౌడ్, 21వ డివిజన్కు చెందిన జంగిల్ సాగర్, 41వ డివిజన్కు చెందిన భూమాగౌడ్ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. తోట రాములు, చీటీ రామారావును ఇప్పటికే 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తోట రాముడు, చీటి రామారావుపై హైదరాబాద్ ప్రజాదర్బార్లో రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన రెండు గుంటల భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చాలంటూ 2019 నుంచి పోరాటం చేస్తున్నట్టు రాజిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. రాజిరెడ్డితో సుమారు 120 మంది నుంచి భూ అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ భూ కబ్జాలు, ఫైనాన్షియల్ అఫెన్సెన్పై పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విచారణ చేపట్టారు. మరోవైపు కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. -
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్లోని జవహర్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
మేయర్.. 'మీరే మాకు పెద్ద దిక్కు!'
వరంగల్: గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షమా? అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. కౌన్సిల్ సమావేశాల్లో మినహా పాలక వర్గం ఏర్పాటైన రెండున్నర ఏళ్లులో మేయర్ను ఎన్నడూ నేరుగా కలిసి సమస్యలు విన్నవించిన దాఖలాలు లేవు. కానీ అధికార మార్పిడితో పరిస్థితులు మారిపోయాయి. గతాన్ని వదిలేద్దాం అంటూ ఐక్యతారాగం అందుకున్నారు. ‘మేయర్ మీరే మాకు పెద్ద దిక్కు. మా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి’ అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో వరంగల్ తూ ర్పు, పరకాల నియోజక వర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు భేటి అయ్యారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. చాలామేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలాచోట్ల పనులు మొదలు పెట్టలేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా డివిజన్కు రూ.50లక్షలు కేటాయించారని, అందులో 20శాతం నిధులు ఎలక్ట్రికల్ పనులకు ఇచ్చారని, ఇప్పటికి పనులు ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రతి డివిజన్కు జనరల్ ఫండ్ ద్వారా రూ.50లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. తాగునీరు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య లోపం తదితర విషయాలను వివరించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి, వేగవంతమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, గందె కల్పన, కావేటి కవిత, పోశాల పద్మ, గుండు చందన, రామా తేజస్విని, ముష్కమల్ల అరుణ, బైర బోయిన ఉమ, గద్దె బాబు, వస్కుల బాబు, చింతాకుల అనిల్ కుమార్, బస్వ రాజు శిరీష, బస్వరాజు కుమార స్వామి, సోమిషెట్టి ప్రవీణ్, మహ్మద్ ఫుర్కాన్, ఆకుల మనోహర్, బాల్నే సురేష్తోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు తదితరులు ఉన్నారు. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
విజయవాడ చిట్టినగర్కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయవాడ చిట్టినగర్లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి. చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్ఆర్పేట, సింగ్నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు. ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు జక్కంపూడి, సింగ్నగర్, ఆర్ఆర్పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్ఎన్ఆర్యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. అక్కడా విజయ్కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్లోని నాగోతు రామారావు, 57వ డివిజన్లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్కాట్ చేశారు. వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్కాట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్కాట్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement