-
Kurnool: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్మ్యాప్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వే 88 శాతం పూర్తి జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్ను డౌన్లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్తేజ, ఆదోని సబ్కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
తప్పులకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పనకు ముమ్మర కసరత్తు
రాజమహేంద్రవరం: హేతుబద్ధత కలిగిన, తప్పులకు తావు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల తుది జాబితాకు రూపుదిద్దడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేస్తోంది. కియోస్క్లు ఏర్పాటు చేసి మరీ కొత్త ఓటర్లను నమోదు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు విలువపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఐదో తేదీ నాటికి సంపూర్ణ ఓటర్ల జాబితాను రూపొందించనుంది. 1,569 పోలింగ్ కేంద్రాల్లో ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్ కేంద్రాల పరిధిలో 15,76,026 మంది ఓటర్లు ఉన్నారు. ప్రజల నుంచి ఫారం 6, 7, 8లకు సంంధించి 2,92,462 దరఖాస్తులను అధికార యంత్రాంగం స్వీకరించింది. వీటిలో ఇప్పటికే 2,50,096 పరిష్కరించగా, మిగిలిన 42,366 దరఖాస్తుల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, వారి ఎపిక్ కార్డు సంఖ్యతో బేరీజు వేసుకుంటోంది. ఓటు లేని వారి నుంచి ఫారం–6 దరఖాస్తులు స్వీకరిస్తోంది. స్వీప్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు ఇప్పటికే నిర్వహించారు. గత నెల 4, 5, ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక శిబిరాల్లో 31,748 దరఖాస్తులు వచ్చాయి. పక్కాగా కసరత్తు ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించి, వచ్చే నెల 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించే దిశగా అధికారులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయల్లో నోటీసులు ఉంచుతున్నారు. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ), జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఎఫ్పీ రేషియో, జెండర్ రేషియో విషయంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ కార్డులో ఉన్న 18 ఏళ్లు నిండిన వారి వివరాలను, ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో సరి చూసి, పక్కాగా జాబితా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నేతలతో సమావేశమవుతూ.. ఈ నెల 20వ తేదీ నాటికి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు కలెక్టర్ కె.మాధవీలత ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవడం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేంత వరకూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచిస్తున్నారు. వెల్లువెత్తిన దరఖాస్తులు ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పులకు ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో జిల్లా వ్యాప్తంగా 17,924 దరఖాస్తులు అందాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నదే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటిస్తున్నాం. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను దరఖాస్తుల రూపంలో స్వీకరించి, పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తున్నాం. ఓటు హక్కు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా యువతకు అందుబాటులో ఉండేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జనవరి మొదటి వారంలో తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఏ ఒక్కరూ తాను ఓటు హక్కు పొందలేదన్న భావన కలగకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – కె.మాధవీలత, జిల్లా కలెక్టర్ -
48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవే.. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉంది. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకోవాలి. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మీకు అందుబాటులో ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి నాణ్యమైన సేవలు అందించాలి. సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలి. ఇంతటి వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు. విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్కళ్యాణ్ వంటివారు బురదజల్లుతున్నారు. వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. మీకు ఏం కావాలన్నా.. అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నిధుల సమస్య లేనే లేదు. మీరు ప్రోయాక్టివ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్కాల్ చేస్తే చాలు. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందించాలి. బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించండి. మంచి ఆహారం.. తాగునీరు అందించండి. పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోండి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలి. గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారిని ఆస్పత్రులకు తరలించండి. వైద్యాధికారులు,స్పెషలిస్టులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి. క్లోరినేషన్ కొనసాగించాలి. అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి. పక్కజిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు తరలించేటప్పుడు సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టిసారించాలి. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ మస్యను పరిష్కరించాలి. అనేక స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అందించాలి అని ఆదేశించారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు అండగా నిలిచిన సర్కార్..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ -
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
-
జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కొత్త ఏడాదిలో పెన్షన్ రూ.2500కు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం.. డిసెంబర్, జనవరిలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం, డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని.. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు లబ్ధి చేకూరనుందన్నారు. జనవరిలోనే రైతు భరోసా అమలు చేస్తామని.. తేదీ త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. కోవిడ్లో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందని.. కొత్త వేరియంట్కు విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉందని సీఎం అన్నారు. ఏపీలో కరోనా రికవరీ రేటు 99.21 శాతంగా ఉందన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందన్నారు. సరసమైన ధరలకు లిటిగేషన్ లేని భూములు కేటాయింపులు చేస్తున్నామన్నారు. పథకం విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందాలన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. చదవండి: AP: రాబడిని మించిన జీతాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement