-
పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు
-
రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్ పార్క్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి. యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం. వైఎస్సార్ చలువే దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది. పార్కు వల్ల ప్రయోజనాలు ► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది. ► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది. ఇంకా ఏమేం వస్తాయి? ► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్ ఎక్స్పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్ సిస్టం వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి. ► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి. ► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్పైసెస్ పార్కు అభివృద్ధికి కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్ పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శీతల గిడ్డంగులతో ఉపయోగం శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది. – బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం మిర్చి రైతులకు బంగారు భవిత గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్పార్కులో రెండు కోల్డ్స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది. – కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం రైతుకు భరోసా స్పైసెస్ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది. – కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్ఖాన్పేట క్యూ కట్టిన కంపెనీలు ప్రస్తుతం పార్కులో స్పైసెస్ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్ స్మి తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్ యూనిట్ మిషన్’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్మిల్, ఉమా ఎక్స్పోర్ట్స్, డీకే ఎంటర్ప్రైజెస్ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్ ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రధానమైనవి. సరుకు నిల్వకు గిడ్డంగులు 2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్ నిర్మించారు. పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్యూ) -
మిర్చి మిలమిల.. ఖాళీ అవుతున్న కోల్డ్ స్టోరేజీలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎండు మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. మార్కెటింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దళారుల ప్రమేయం తగ్గి, వాస్తవ ధరలు రైతులకు అందుతున్నాయి. చీడపీడల కారణంగా ఏడాది పంట దిగుబడులు తగ్గినా.. ధరలు పెరుగుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 341 మిర్చి రకం ధర ఏకంగా క్వింటాల్ రూ.26 వేలకు చేరింది. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఎండు మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు. మూడు నెలల్లో రూ.4,500 పెరుగుదల మిర్చి పైరుకు గత ఏడాది తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఎగుమతి కావడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతోపాటు నాణ్యమైన సరుకు లభ్యత తక్కువ ఉండటం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే తేజ, బాడిగ రకాల మిర్చికి గతంలో అధిక ధర ఉండేది. అందుకు భిన్నంగా ప్రస్తుతం 341 రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఈ రకం మిర్చి ధర కనీవినీ ఎరుగని రీతిలో ఎగబాకుతోంది. మార్చి నెలలో 341 మిర్చి క్వింటాల్ రూ.21,500 ధర పలికి రికార్డు సృష్టించింది. ఈ ధర క్రమంగా పెరుగుతూ.. ప్రస్తుతం రూ.26 వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రకాలదీ అదే దారి గుంటూరు, నడికుడి, ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో నాణ్యత గల అన్ని రకాల మిర్చి ధరలు పెరుగుతున్నాయి. క్వింటాల్కు సగటున రూ.20 వేలకు పైగా పలుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం కొనేందుకు వ్యాపారులు ఎగబడటంతో సందడి నెలకొంది. ఈ రకానికి డిమాండ్ ఎందుకంటే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 341 రకం మిర్చిని సాగు చేస్తారు. చిక్కటి ఎర్ర రంగు కలిగి ఉండే ఈ రకాన్ని కారం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతోపాటు, గృహావసరాలకు వాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఉత్తర భారతదేశంలో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. కొత్త పంట నవంబర్ వరకు వచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) ఆశాజనకంగా ధరలు నేను 2020లో రెండెకరాల్లో మిర్చి పంట వేశాను. కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కోల్డ్ స్టోరేజీలో ఉంచాను. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉంది. అందువల్ల విక్రయిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరిగాయి. ఎంతో సంతోషంగాఉంది. – వి.శ్రీనివాసరావు, మిర్చి రైతు, సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు మండలం -
భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. తయారీ విధానమే ప్రత్యేకం మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు. మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు జాగ్రత్త లేకుంటే నష్టం తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. నిల్వ చేసే దారిలేదు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు. ఎండ ఉంటేనే పని ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. –జి.సత్యవతి, తయారీదారు కోల్డ్ స్టోరేజీ నిర్మించాలి ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది. – ఎస్.రమణ, తయారీదారు అమ్మకపు పన్ను రద్దుచేయాలి కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు -
మిర్చి యార్డుకు భారీగా సరుకు
సాక్షి, అమరావతిబ్యూరో: గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చి చేరుతోంది. దీంతో యార్డు ప్రాంగణం మిర్చి టిక్కీలతో నిండిపోయింది. సరుకుతో నిండిన వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం సోమవారం నాటికి యార్డులో 3.5 లక్షల టిక్కీల బస్తాలు నిల్వలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో యార్డులో సిబ్బంది, దిగుమతి, ఎగుమతి వ్యాపారులు, కార్మికులు హడలిపోతున్నారు. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకువస్తున్నారు. యార్డు ప్రాంగణం అంతా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో శానిటైజ్ చేసేందుకు వీలు కావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా యార్డుకు వచ్చే మొత్తం సరుకును కలిపి బయటకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు. యార్డు పరిసరాలను శానిటైజ్ చేసి, కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వ తేదీ వరకు యార్డుకు సెలవులు ప్రకటించారు. పెద్ద ఎత్తున సరుకు ఎందుకు వస్తోందంటే.. సకాలంలో వర్షాలు కురవటంతో కాలువలకు సాగు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. ప్రధానంగా మిర్చి పంట అధికంగా పండే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాగార్జున సాగర్ కుడికాలువలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 12 వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి దిగుబడులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా ఈ ఏడాది సాధారణ రకం మిర్చి రకాలు 334, నెంబరు 5341, సూపర్ 10 వంటి రకాలు సైతం మంచి ధర పలుకుతున్నాయి. వీటి ధర ప్రస్తుతం రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు మిర్చి సరుకును అమ్ముకునేందుకు యార్డుకు తరలిస్తుండటంతో యార్డు పూర్తిగా నిండిపోతోంది. హైబ్రిడ్ రకాలను రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యార్డులోకి వచ్చే రైతులకు మాస్క్ లేకపోతే, గేటులో ఉచితంగా మాస్క్ ఇస్తున్నాం. శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే రైతులను యార్డులోకి అనుమతించటం లేదు. యార్డును పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచేందుకు వీలుగా సెలవులు ప్రకటించాం. – వెంకటేశ్వరరెడ్డి, మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement