-
ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!
తిరువొత్తియూరు(చెన్నై): కోవైకి చెందిన యువకుడు ఆఫ్రికాకు చెందిన యువతిని ప్రేమించి తమిళ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. వివరాలు.. ఆఫ్రికా దేశమైన కెమెరూన్లోని ఓ సంస్థలో కోవైకి చెందిన ముత్తు మారియప్పన్ పని చేస్తున్నాడు. ఇతను పనిచేస్తున్న సంస్థలో వాల్మీ ఇనాంగో అనే ఆఫ్రికా యువతి అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ మేరకు తమిళ సంప్రదాయం ప్రకారం కోవై తుడియలూర్లో ఉన్న ఓ వివాహ మండపంలో వివాహం జరిపించారు. వివాహ వేదిక పైకి వాల్మీఇనాంగో పట్టు చీర ధరించి తమిళ సాంప్రదాయంలో మెరిసింది. మారిముత్తు వధువు మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత వీరిద్దరూ క్రైస్తవ ఆచారం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, వివాహానికి వధువు తరుపున హాజరైన ఆఫ్రికా వాసులు పట్టు పంచెలు, పట్టు చీరలు కట్టుకుని హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. ఽ చదవండి: ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు -
ఒకే నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షలు
సేలం(చెన్నై): వాచ్మెన్ హత్య కేసులో నిందితుడికి రెండు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోయంబత్తూరులోని ఓ గోడౌన్లో వాచ్మెన్గా పని చేస్తున్న రామన్ 2017లో హత్యకు గురయ్యాడు. విచారణలో అక్కడ పని చేస్తున్న కార్మికుడు చంద్రన్ నిందితుడిగా తేలింది. అయితే ఏడాదిన్నర తర్వాత పోలీసులకు చంద్రన్ పట్టుబడ్డాడు. ఈ కేసును కోయంబత్తూరు మొదటి మెజిస్ట్రేట్ కోర్టు విచారించి, వాదనలు, విచారణ ముగియడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ( చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం ) మరో ఘటనలో.. ముక్కనేరిలో వివాహిత మృతదేహం సేలం(చెన్నై):సేలం జిల్లాలోని ముక్కనేరి చెరువులో గురువారం వివాహిత మృతదేహం లభ్యమైంది. సేలంలోని కన్నంగురిచ్చి సమీపంలో ముక్కనేరి చెరువు వద్దకు వాకింగ్కు వచ్చిన స్థానికులు చెరువులో బుడగతామర మధ్య మహిళ కాలు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో ఆ మహిళ కన్నంగురిచ్చి, సత్యానగర్కు చెందిన రవీంద్రన్ భార్య కౌసల్య(30) అని తేలింది. ఇదివరకే తన కూతురు కనిపించలేదని కౌసల్య తండ్రి వెంకటప్ప సెవ్వాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ స్థితిలో కౌసల్య మృతదేహంగా తేలిన సంఘటన కలకలం రేపింది. -
మైనర్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి!
చెన్నై: మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన ఒక యువతి.. అతడ్ని పెళ్లి చేసుకోవడం తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో 19 ఏళ్ల యువతి స్థానికంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తుండేది. ఈ క్రమంలో 17 ఏళ్ల బాలుడు కాలేజ్కు వెళ్లేటప్పుడు.. ప్రతిరోజు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేవాడు. దీంతో ఆ యువతితో ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్లు తీసుకునే వరకు వచ్చింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఏడాది పాటు ఆ యువతి, మైనర్ బాలుడు జాలీగా కలిసి గడిపారు. కాగా, వీరిద్దరి విషయం మైనర్ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా.. యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్చుకోలేదు. తాజాగా, బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసిన సదరు యువతి, బాధిత యువకుడిని చూడటానికి కోయంబత్తూరులోని ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇంట్లో వారికి తెలియకుండా డిండిగల్ జిల్లాకు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరుకు వచ్చి ఉంటున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు యువతిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి -
కరోనా వ్యాక్సిన్ భయంతో చెట్టెక్కిన గ్రామస్తులు
-
షాకింగ్: ఓటమిపాలైన కమల్ హాసన్
చెన్నె: అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓడిపోయాడు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్ఎన్ఎం చీఫ్ కమల్హాసన్ ఓడిపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి వసతి శ్రీనివాసన్పై కమల్హాసన్ పరాజయం పొందాడు. కాగా కమల్మాసన్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయన ఓడిపోవడం షాకింగ్కు గురి చేసే అంశం. ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారం సొంతం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కన్నా అధిక స్థానాలు డీఎంకే సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కానున్నారు. చదవండి: ఫ్యాన్ స్పీడ్కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement