-
మధుకోడాపై ఛార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ప్రత్యేక కోర్టులో సీబీఐ శుక్రవారం ఛార్జీషీట్ దాఖలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో మోసం, కుట్రలకు పాల్పడ్డారంటూ మధు కోడాపై అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. అలాగే జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసుతోపాటు మరో అరుగురిపై కూడా సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోడా ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టంది. అందులోభాగంగా 144 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కోర్టు గత ఏడాది సెప్టెంబర్లో జప్తు చేసిన సంగతి తెలిసిందే. -
మన్మోహన్పై అభియోగాలకు సుప్రీం నో
న్యూఢిల్లీ: బొగ్గు శాఖను నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు పలు ఆ శాఖ మాజీ మంత్రులను పలువురిని బొగ్గు కేటాయింపుల స్కాంలో నేరపూరిత అభియోగాల పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. బొగ్గు బ్లాకుల రద్దుకు దారితీసిన పిటిషన్ వేసిన ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మన్మోహన్, శిబూ సొరేన్, శ్రీప్రకాశ్ జైస్వాల్లపై నేరాభియోగాలు మోపేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు. -
బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం దాచిపెట్టటానికి ఏమీలేదని, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి సీబీఐ కోరిన అధికారిక పత్రాలు అదృశ్యమయ్యాయనే నిర్ధారణకు రావటం పొరపాటని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఈమేరకు పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. బొగ్గు గనుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నేపధ్యంలో కీలకమైన ఫైళ్లు అదృశ్యమవటంపై ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా పార్లమెంటును స్తంభింపచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ముందుగా సిద్ధంచేసుకున్న ప్రకటనను తొలుత రాజ్యసభ, అనంతరం లోక్సభలో మన్మోహన్ చదివి వినిపించారు. కనిపించకుండాపోయిన పత్రాలను కనుగొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. అవి దొరకని పక్షంలో సీబీఐతో సహా సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. మన్మోహన్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ఉభయసభల్లోనూ నిరసనకు దిగటంతో పార్లమెంటు మళ్లీ స్తంభించింది. 2006-09 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 204 బొగ్గు క్షేత్రాలను కేటాయించారు. వీటిలో 40 లెసైన్సులను ఆ తర్వాత రద్దుచేశారు. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి మొత్తం 189 పత్రాలు కనిపించటం లేదని ఆ శాఖ మంత్రి శ్రీప్రకాష్జైస్వాల్ ఆగస్టు 23న పార్లమెంటుకు తెలిపారు. ఫైళ్ల అదృశ్యంపై విపక్షాల ఆందోళన నేపధ్యంలో ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘‘బొగ్గు క్షేత్రాల కేటాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. సీబీఐ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. సభ్యులు తొందరపాటు నిర్ధారణలకు రాకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు, సీబీఐకి ప్రభుత్వం సహకారం అందించిందని చెప్పారు. సీబీఐకి ఇప్పటికే 1,50,000కు పైగా పేజీలను అందించామని.. ఇది సీబీఐ దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంచేస్తోందని చెప్పారు. కొందరు సభ్యులు వాస్తవ పరిస్థితిని విస్మరించి ఏదో అనుమానాస్పద వ్యవహారం ఉందని నిర్ధారించారన్నారు. ఏవైనా ఫైళ్లు నిజంగా అదృశ్యమైన పక్షంలో దానిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని, దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం: జైట్లీ కానీ.. మన్మోహన్ ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. రెండు సభల్లోనూ ప్రధాని ప్రకటన చేసి వెంటనే నిష్ర్కమించారు. దీంతో తమ సందేహాలను నివృత్తి చేయలేదంటూ ఉభయసభల్లోనూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగటంతో గందరగోళం తలెత్తింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్జైట్లీ మాట్లాడుతూ.. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం ఏకపక్షంగా, బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతంతో కేటాయింపులు జరిపిందని.. ఈ నేరానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేసేందుకు సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఫైళ్ల అదృశ్యంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేయలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది అనుమానాలను మరింతగా పెంచుతోందన్నారు. ఫైళ్లు అదృశ్యమైనప్పుడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్నదెవరని సమాజ్వాది పార్టీ నేత నరేష్అగర్వాల్ ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధానమంత్రి సమాధానం చెప్పలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విపక్షాల ‘షేమ్ షేమ్’ నినాదాల మధ్య ధ్వజమెత్తారు. ప్రధాని సభ నుంచి నిష్ర్కమించారని, తానేమీ చేయలేనని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నుంచే సమాధానాలు కావాలని విపక్షాలు పట్టుపట్టి ఆందోళనకు దిగాయి. దీంతో కురియన్ సభను వాయిదా వేశారు. అందుబాటులో లేని పత్రాలు ఏమయ్యాయి? లోక్సభలో ప్రధాని ప్రకటన చేసిన తర్వాత తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీలు కోరగా.. అందుకు స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించటంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 3 గంటలకు ఆ తర్వాత బుధవారానికి వాయిదా వేశారు. బాహాటంగా దాచేస్తున్నారు: సీపీఎం ప్రధాని ప్రకటనలో కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవని సీపీఎం నేత సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. సభలో ప్రకటన చేసిన వెంటనే ప్రధాని ఎన్నడూ లేని రీతిలో వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోవటం తాము చూశామన్నారు. కాగా, ప్రధాని పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆ ఫైళ్ల బాధ్యత నేరుగా ప్రధాని బాధ్యత కాదని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement