-
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
కోవిడ్ నేపథ్యంలో కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త అవకాశాలు
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికలు సజావుగా నిర్వహించుకునేందుకు మరింతగా తోడ్పడటంపై సీఎంఏ కసరత్తు చేస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులపైనా దృష్టి పెడుతోంది. దివాలా కోడ్ వంటివి అమల్లోకి రావడంతో కాస్ట్ అకౌంటెంట్లు కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పి. రాజు అయ్యర్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ అంశాలు వెల్లడించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. కోవిడ్ నేపథ్యంలో ఐసీఏఐ తీసుకున్న చర్యలు.. అనేక సంవత్సరాలుగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర అనేక మార్పులకు లోనైంది. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్ కోణంలో కోవిడ్–19 అనంతరం బోర్డు రిపోర్టింగ్ విధానాలు, వ్యాపారాల కొనసాగింపు ప్రణాళికలకు సంబంధించిన టెక్నికల్ గైడ్ పేరిట రెండు ముఖ్యమైన పత్రాలను ఇనిస్టిట్యూట్ రూపొందించింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో బోర్డు స్థాయి సమీక్షలు, అలాగే లాక్డౌన్ల తర్వాత వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికల అమలు సజావుగా జరిగేందుకు తోడ్పడాలన్నది వీటి ఉద్దేశ్యం. అలాగే, వివిధ కార్యకలాపాలను సక్రమంగా, సకాలంలో మదింపు చేయడంలో కంపెనీలకు సహాయకారిగా ఉండేలా యాక్టివిటీ ఆధారిత పెర్ఫార్మెన్స్ కాస్టింగ్ విధానాన్ని కూడా మేము రూపొందించాం. ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను తగిన విధంగా రూపొందించడం, ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, లాభదాయకమైన/నష్టదాయకమైన ఉత్పత్తులు/కార్యకలాపాలను గుర్తించడం మొదలైన వాటికి ఇది ఉపయోగపడగలదు. అలాగే, వ్యాపార ప్రణాళికలను, బడ్జెటింగ్ను, వనరుల కేటాయింపు .. వినియోగాన్ని మెరుగుపర్చుకునేందుకు తోడ్పడగలదు. దివాలా కోడ్పై .. దేశీయంగా అమలు చేసిన అత్యంక కీలకమైన ఆర్థిక సంస్కరణల్లో ఐబీసీ కూడా ఒకటి. నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకవైపు వాటాదారులందరి ప్రయోజనాలనూ పరిరక్షిస్తూనే మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలను గట్టెక్కించడంలో సమతౌల్యత పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. రుణ సంస్కృతి మెరుగుపర్చడం, మొండిపద్దుల నుంచి ఎంతో కొంత రాబట్టడం, రుణదాతలు.. రుణగ్రహీతల మధ్య సమీకరణలు తదితర అంశాల్లో గడిచిన అయిదేళ్లలో ఐబీసీ గణనీయమైన మార్పు తెచ్చిం ది. ప్రస్తుతానికైతే ఈ చట్టం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎంతో కీలకమైన చట్టం ప్రభావాలను అంచనా వేయడానికి అయిదేళ్ల వ్యవధి అనేది చాలా స్వల్ప కాలం. నిర్దేశిత లక్ష్యాల సాధనకు తోడ్పడేలా ఐబీసీలోని పలు నిబంధనలకు ఎప్పటికప్పుడు తగు విధంగా సవరణలు చేస్తున్నారు. ఐబీసీ విజయవంతంగానే అమలవుతోంది. అయితే, ఇప్పటికీ వ్యక్తిగత దివాలా, సీమాంతర దివాలా, గ్రూప్ దివాలా వంటి వాటికి సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై / అమలు చేయాల్సి ఉంది. ఐబీసీలో సీఎంఏల పాత్ర.. జీఎస్టీ అమలు.. చాలా మంది సీఎంఏలు ప్రస్తుతం దివాలా ప్రక్రియకు సంబంధించి ప్రొఫెషనల్స్గా మారారు. తరచుగా ఐబీసీ కింద పలు కేసులు చూస్తున్నారు. తాత్కాలిక పరిష్కార నిపుణులుగా, పరిష్కార నిపుణులుగా సీఎంఏలు .. ఫోరెన్సిక్ ఆడిట్, పరిష్కార ప్రణాళిక రూపకల్పన మొదలైన వాటిలో సహాయకరంగా ఉంటున్నారు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే, వివిధ రాష్ట్రాల్లో వివిధ సిద్ధాంతాల ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో దీని అమల్లో సాంకేతికంగానే కాకుండా ఇతరత్రా సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ.. సవాళ్లను అధిగమించి జీఎస్టీ దీర్ఘకాలికంగా జీఎస్టీ విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త కెరియర్ అవకాశాలు కంపెనీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేసేలా కాలక్రమేణా ఫ్యాక్టరీల స్థాయి నుంచి బోర్డు రూమ్ల్లోకి సీఎంఏల పాత్ర విస్తరించింది. ట్యాక్సేషన్, కాస్ట్ ఆడిట్, కన్సల్టెన్సీ, కార్పొరేట్ చట్టాలు, ఆర్బిట్రేషన్, దివాలా పరిష్కార నిపుణులు, స్వతంత్ర డైరెక్టర్లు, బ్యాంకింగ్, బీమా తదితర విభాగాల్లో సీఎంఏలు అనేక మైలురాళ్లు అధిగమించారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు అనిశ్చితి, సంక్లిష్టత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మనుగడకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కీలకంగా మారింది. కంపెనీ సామర్థ్యాలను, ఉత్పాదకతను, ఫలితాలను మెరుగుపర్చుకునేందుకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయకరంగా ఉండగలదు. అన్ని ఆర్థిక కార్యకలాపాల్లోనూ సీఎంఏలు చోదకశక్తిగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాలు, బహుళ జాతి సంస్థల్లో.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీస్, సీఈవో, జీఎం, ఫైనాన్స్ మేనేజర్ వంటి టాప్ మేనేజ్మెంట్ హోదాలను దక్కించుకోవడానికి అవకాశాలు మరింతగా పెరిగాయి. అవసరాలకు తగ్గట్లుగా కోర్సులో మార్పుచేర్పులు కొంగొత్త టెక్నాలజీల రాకతో వ్యాపార పరిస్థితులు అసాధారణంగా, శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా ఎదురయ్యే ప్రతిబంధకాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి రావడం వల్ల ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. కొత్త లక్ష్యాలు, కొత్త సాధనాలు, కొత్త కోర్సులను రూపొందించాల్సి వస్తోంది. సీఎంఏ కోర్సు కోసం కొత్త సిలబస్ను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది. బిజినెస్ డేటా అనలిటిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ మొదలైనవి ప్రవేశపెట్టాము. ఇనిస్టిట్యూట్ తమ విద్యార్థుల కోసం ఎస్ఏపీ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్, ఈ–ఫైలింగ్ వంటివి ప్రపంచ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. 15 నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేశాం. -
కాంతులీనే కెరీర్కు..
ఎంబీఏ ఉత్తీర్ణులకు దీటుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్న కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలుగా ఉండే సీఎంఏను పూర్తిచేస్తే జాబ్ మార్కెట్లో మంచి వేతనాలతో కొలువులు దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎంఏ కోర్సులో దశలు, అర్హతలు.. పరీక్ష విధానం.. ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం.. సీఎంఏలో దశలివే..: సీఎంఏలో మూడు దశలుంటాయి. అవి.. 1. ఫౌండేషన్, 2. ఇంటర్మీడియెట్, 3. ఫైనల్. మొదటి దశ ఫౌండేషన్: సీఎంఏ కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్ అని వ్యవహరిస్తారు. ఇంటర్ లేదా 10+2లో ఏ గ్రూప్ చదివినవారైనా దీనికి నమోదు చేసుకోవచ్చు. ఇందులోని మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్ను 100 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఏడాదిలో జూన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: సీఎంఏ చదవాలంటే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం ఇంటర్మీడియెట్ లేదా 10+2, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి.రెండో దశ.. ఇంటర్మీడియెట్: ఫౌండేషన్ ఉత్తీర్ణులు ఇంటర్మీడియెట్కు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఏడాదికి పరీక్షలు రాయడానికి అర్హత లభిస్తుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నేరుగా ఇంటర్మీడియెట్కు నమోదు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్ల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ రెండు గ్రూపులుగా ఉంటుంది. అవి.. గ్రూప్–1: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి.. ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక్కో పేపర్లో కనీసం 40 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. గ్రూప్–2: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్డైరెక్ట్ ట్యాక్సేషన్, కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. నాలుగు పేపర్లకు కలిపి 400 మార్కులు కేటాయించారు. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా వేర్వేరుగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్: సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు గుర్తింపు పొందిన సంస్థల్లో లేదా ఇప్పటికే పనిచేస్తున్న కాస్ట్ అకౌంటెంట్ల వద్ద ఆర్నెల్ల పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ఈ సమయంలో ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు సై్టపెండ్ పొందొచ్చు. మూడో దశ.. సీఎంఏ ఫైనల్: ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయొచ్చు. ఇందులో కూడా రెండు గ్రూపులు (గ్రూప్ 3, గ్రూప్ 4) ఉంటాయి. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా ఒక్కో గ్రూప్ వేర్వేరుగా ఆర్నెల్ల వ్యవధిలో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్ల్లో సీఎంఏ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ పరీక్ష విధానం: గ్రూప్–3: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ లాస్ అండ్ కంప్లైయన్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ – డెసిషన్ మేకింగ్, డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించినవారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. గ్రూప్–4: ఇందులో కూడా నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, స్ట్రాటజిక్ ఫెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్. ఒక్కో పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లు. ఫైనల్ ఉత్తీర్ణులు కంప్యూటర్ శిక్షణ పూర్తయిన తర్వాత కాస్ట్ అకౌంటెంట్లుగా గుర్తింపు పొందుతారు. ఫైనల్ ఉత్తీర్ణులు నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలంటే మరో రెండున్నరేళ్లు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. దీన్ని పూర్తిచేసినవారికి కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) అందిస్తుంది. అవకాశాలెన్నో..: సీఎంఏ ఉత్తీర్ణులకు సీఎంఏ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తోంది. హెచ్సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్ప్యాక్ట్ వంటి బహుళజాతి కంపెనీలు మంచి వేతన ప్యాకేజీలతో వీరిని నియమించుకుంటున్నాయి. ఎంబీఏ చేసినవారికి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో.. సీఎంఏలకు కూడా అవే ఉంటాయి. మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ కోర్సులు అందించే విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్గా పనిచేయొచ్చు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కీలక పదవులను నిర్వర్తించొచ్చు. ఉద్యోగం ఇష్టం లేనివారు స్వయం ఉపాధి పొందొచ్చు. వెబ్సైట్: www.icmai.in ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్, డైరెక్టర్, మాస్టర్మైండ్స్ -
సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్వేర్..
గెస్ట్ కాలమ్ ఉజ్వల అవకాశాలకు అందిస్త్తున్న సేవరంగం నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థల వరకు అన్నింటా కాస్ట్ అండ్ అకౌంటెన్సీ విభాగానిది కీలకభూమిక. విశ్లేషణా నైపుణ్యం, ప్రశ్నించే లక్షణం ఉన్న అభ్యర్థులు అకౌంటెన్సీ కోర్సుల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అంటున్న.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, విజయ్ కిరణ్ అగస్త్యతో గెస్ట్ కాలం... కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులు క్లిష్టమైనవి! ఎంత చదివినా వీటిలో ఉత్తీర్ణత సాధించడం కష్టం! అనే అభిప్రాయాలు చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి. ఇలాంటి భావనల వల్లే ఈ కోర్సుల్లో ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్నవారు కూడా వెనకడుగు వేస్తున్నారు. భయాన్ని వీడి ముందడుగేస్తే..ఈ కోర్సుల్లో సులభంగా విజయం సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో ప్రవేశించవచ్చు. మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కలర్ఫుల్ కెరీర్ ఆప్షన్లు ఖాయం. ప్రొడక్షన్కే పరిమితం కాదు గతంలో కాస్ట్ అకౌంటెంట్లకు ఉత్పత్తి సంస్థల్లో మాత్రమే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, టెలికం, సాఫ్ట్వేర్, బీపీవో ఇలా ప్రతి రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ కోర్సు పూర్తిచేసిన వారికి.. తక్కువ ఖర్చుతో సంస్థ కార్యకలాపాలను నిర్వహించే నైపుణ్యాలుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తుండటమే. దీంతో ఆయా సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, కొలువులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తిచేసి సభ్యత్వాన్ని సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అదే విధంగా వీరికి యూకేకు చెందిన కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్లు సీఐఎంఏ, ఏసీసీఏలు నిర్వహించే పరీక్షల్లో కొన్ని పేపర్లకు మినహాయింపు ఇస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే.. సీఎంఏ కోర్సు (మూడు దశలు)ను తొలి ప్రయత్నంలోనే పూర్తిచేయడం కష్టమనే అభిప్రాయం సరికాదు. ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ థింకింగ్తో అంశాలను అధ్యయనం చేస్తే అన్ని దశలనూ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయొచ్చు. ‘ఫౌండేషన్’ నుంచే పునాదులు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో ఫౌండేషన్ స్థాయిలోనే ప్రవేశిస్తే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని నేను భావిస్తాను. ఇంటర్/10+2 అర్హతతో ఫౌండేషన్ కోర్సు పరీక్షలు పూర్తిచేస్తే ఇంటర్మీడియెట్లో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు డెరైక్ట్ ఎంట్రీ స్కీం కింద బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కానీ, ఈ రంగంపై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ నుంచే ఈ దిశగా అడుగులు వేయడం ప్రయోజనకరం. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు జూలై 31, జనవరి 31లోపు; నాలుగు సార్లు (మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలకు వరుసగా అక్టోబర్ 31, జనవరి 31, ఏప్రిల్ 30, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబినార్స్, ఆన్లైన్ లెక్చర్స్ సీఎంఏ కోర్సు రెగ్యులర్ కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు వెబినార్స్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్, అదే విధంగా ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా కామర్స్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నా పరంగా ఇచ్చే సలహా... ఒక సమస్యకు సంబంధించి ఎలా? అనే దృక్పథం నుంచి ఎందుకు? అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు? అనే ప్రశ్న తలెత్తినప్పుడే మనలో ఆ సమస్యను పరిష్కరించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక నైపుణ్యాలను అలవడుతాయి. అభ్యర్థులు ప్రారంభం నుంచే చదవడం, వ్యక్తీకరించడం, ప్రణాళిక- అమలు .. వంటి అంశాలను ఆచరణలో పెడితే విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకొని కలర్ఫుల్ కెరీర్కు బాటలు వేసుకోవచ్చు. -
సిమెంట్ కు సహజ వనరుల కొరత!
♦ ప్రస్తుతమున్న బొగ్గు, సున్నపురాయి నిల్వలు 30 ఏళ్ల వరకే ♦ ఆ తర్వాత పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం; ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచన ♦ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సిమెంట్ ఉత్పత్తికి ప్రధాన వనరులు బొగ్గు, సున్నపురాయి వంటి సహజ వనరులే. కానీ, మన దేశంలో వీటి లభ్యత రోజురోజుకూ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కూడా. ప్రస్తుతం దేశంలో ఉన్న సహజ వనరులు మరో 30 ఏళ్ల వరకు మాత్రమే ఈ పరిశ్రమకు సరిపోతాయి. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? అంటే ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదని’’ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమని చెప్పుకొచ్చారు. అందుకే సిమెంట్ ఉత్పత్తిలో ప్రారంభ స్థాయి నుంచే ఆధునిక సాంకేతికత వినియోగించడంతో పాటూ సాధ్యమైనంత వరకూ ముడి పదార్థాలు, వ్యర్థాల పున ర్ వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చౌక్సీ సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ‘12వ గ్రీన్ సిమెంటెక్-2016’ రెండు రోజుల సదస్సు గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శైలేంద్ర చౌక్సీ ఏమన్నారంటే.. ♦ రానున్న రోజుల్లో దేశంలో సిమెంట్ వినియోగ సగటు పెరగనుంది. స్మార్ట్ సిటీ లు, అందరికీ ఇళ్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అనేక పథకాలే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు సిమెంట్ పరిశ్రమకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికీ తీసుకెళ్లాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ♦ దేశంలో ఏటా 380 మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి అవుతుంది. అయితే గత నాలుగే ళ్లుగా ఉత్పత్తి 2-4 శాతం తగ్గింది. గత రెండు దశాబ్ధాలుగా సిమెంట్ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 8 శాతాని కంటే తక్కువకు పడిపోయింది. దేశ ఆర్థిక సంక్షోభం, ప్రపంచ మాంద్యం, గ్రామీణ ఆర్థిక ప్రతికూలతలు ఇందుకు కారణం. కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నడూ చూడని విధంగా గతేడాది మార్చి నెలలో 11 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మొత్తం మీద 6 శాతం వృద్ధి రేటుంటుందని అంచనా వేస్తున్నాం. ♦ సదస్సులో కేశోరాం ఇండస్ట్రీస్ (గ్రీన్కో ప్లాటినం), అల్ట్రాటెక్ సిమెంట్ లి. (గ్రీన్కో గోల్డ్)లకు గ్రీన్కో అవార్డులు, దాల్మియా సిమెంట్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలైస్ లి., జేఎస్డబ్ల్యూ సిమెంట్ లి., అల్ట్రాటెక్ ఎక్స్ట్రాలైట్ ఏఏసీ బ్లాక్స్లకు గ్రీన్ప్రో అవార్డులు అందించారు. అలాగే గ్రీన్ చాంపియన్స్ ఆఫ్ ఇండియన్ సిమెంట్ సెక్టార్, కాంపోసైట్ సిమెంట్ మార్చి 2016 పబ్లికేషన్స్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏ సెక్రటరీ జనరల్ ఎన్ఏ విశ్వనాథన్, గ్రీన్సిమెంటెక్ చైర్మన్ జీ జయరామన్, కో-చైర్మన్లు కేఎన్ రావు, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement