-
సీఎం వ్యాఖ్యలపై తమ్మినేని ఫైర్
మల్యాల: గుండుసూదులు గుచ్చే పార్టీ అంటూ సీపీఎంను సీఎం కేసీఆర్ ఎద్దేవా చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న తమవి దిక్కుమాలిన ఉద్యమాలు అని వ్యాఖ్యానించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ హుంకరింపులకు బెదిరేది లేదని, న్యాయం జరిగే దాకా పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ భూసేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందినట్లు ప్రకటించుకోవటం రైతులకు, పేదలకు అన్యాయం చేయటమేనని తెలిపారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా 29న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు ఇతర నిరసన కార్యక్రమాలను చేపట్టాలని తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. -
హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను విజయవాడ (అజిత్సింగ్నగర్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కుగా భావించి పోరాడుతున్న విద్యార్థులను జైళ్లకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధాకరమని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గాంధీనగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తన రక్తం ఉడికిపోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ‘ప్యాకేజీ’ చాలని మాటమార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్యాకేజీ కమీషన్ల కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీÄñæ¬ద్దని విజ్ఞప్తి చేశారు. నాడు ‘క్విట్ ఇండియా’తో బ్రిటీష్ వారిని ఎలా తరిమికొట్టారో.. నేడు చంద్రబాబును కూడా రాష్ట్ర ప్రజలు ‘క్విట్ ఏపీ’తో తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఎంతమందిని జైల్లో పెడతారు.. నిజంగా అలా జైల్లో పెట్టాలనుకుంటే ప్రత్యేక హోదా కోసం పోరాడేవారితో రాష్ట్రంలో జైళ్లు సరిపోవని పేర్కొన్నారు. రెండేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మొన్నటికి మొన్న చింతమనేని ప్రభాకర్ తహసీల్దారును కొట్టి బెదిరిస్తే.. ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించడం సిగ్గుచేటని విమర్శించారు. అవినీతి పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఇంట్లో పది లక్షల రూపాయల సూట్ కేసును పోలీసులు పట్టుకున్నా కేసు కట్టలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. -
గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు * ఉమ్మడి రాజధాని, సెక్షన్-8పై గవర్నర్దే అధికారం * కానీ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు * పదేళ్ల తర్వాతే హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది * ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు * పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది * టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సీఎం వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్పై గవర్నర్కు అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాలపై గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది? పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. ఉద్యోగుల భద్రత, ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీపడే ప్రసక్తిలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామని, చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల గైర్హాజరు... బాబు అసంతృప్తి విస్తృతస్థాయి సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్కు రాకపోతే ఎలా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్గా మారింది. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి హాజరుకాలేదు.ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్గజపతిరాజు, పార్టీ చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. జర్నలిస్టులకు పెద్ద ఆసరా: సీఎం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమాన సౌకర్యాలు ఉండే హెల్త్కార్డు జర్నలిస్టులకు పెద్ద ఆసరాగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.జర్నలిస్టులకు హెల్త్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలో శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. 14వేలమంది జర్నలిస్టుల్లో 8,321మందికి హెల్త్కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. మినీ సెక్రటేరియట్కు రూ.3 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24లో అద్దెకుంటున్న భవనంలోనే ఓ భాగంలో (డోర్ నెం.8-2-293/82/ఎ/369-బి) మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు లీజు అగ్రిమెంటు కింద ప్రభుత్వం రూ.3 లక్షలు మంజూరు చేసింది. మంత్రివర్గ సమావేశం 3కి వాయిదా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 3కు వాయిదా పడింది. తొలుత ఈ సమావేశా న్ని జూలై 2న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా సాక్షి, విజయవాడ బ్యూరో: రంజాన్ సం దర్బంగా రాష్ట్రంలోని ముస్లింలకు చం ద్ర న్న రంజాన్ తోఫా ( కానుక)ను ఇస్తున్న ట్టు చంద్రబాబు ప్రకటిచారు. శనివా రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల కార్యక్రమం లో సీఎం ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కానుకలో రెండు కిలోల పంచదార, కిలో సేమియా, ఐదు కిలోల ఆటా (గోధుమ పిండి) పంపిణీ చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement