-
చిత్ర పరిశ్రమ
మహిళా విజయం అందమైన చిత్రాలు గీయడం ఓ చక్కటి కళ.వాటిని కొని ఇంట్లో అలంకరించుకోవడం అభిరుచి.కళకు, అభిరుచి కలిగిన వారికి మధ్య వారధిగా మారారు అనిత.చిత్ర ప్రదర్శనకు ఓ పరిశ్రమ రూపం ఇచ్చిన ఆమె అనుభవాలు... ‘‘మా వారు హరిశ్రీనివాస్ మంచి చిత్రకారులు. ఆయన బొమ్మలను ఇష్టపడే వారు చాలామంది ఉన్నారు. ఆయనలో చక్కటి కళాభిరుచి, దానిని ప్రతిబింబించే నేర్పు ఉన్నాయి కానీ వాటిని మార్కెట్ చేసే నైపుణ్యం లేదు. నిజానికి కళాకారుడి దృష్టి మార్కెట్ మీదకు మళ్లడం కష్టం. అలా మళ్లితే కళ కళ తప్పుతుందని నా నమ్మకం. నేరుగా మార్కెట్లోకి దిగకుండా బొమ్మలను ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించడం వల్ల పెద్దగా లాభించదని కూడా అర్థమైంది. ఈ మథనంలోంచి ఆ పనేదో నేనే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వెర్మిలియన్ ఆర్ట్ హౌస్’. హరిశ్రీనివాస్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి. వాటర్ కలర్, ఆయిల్ కలర్, చార్కోల్, పెన్సిల్ స్కెచ్లు... చాలా రకాల బొమ్మలు వేయగలరు. ఆయన చిత్రాలతో మొదట 2009లో కార్ఖానాలో ఆర్ట్ హౌస్ని స్థాపించాను. దానిని ఇటీవల బంజారాహిల్స్కు మార్చాను. మా వారి చిత్రాలకు ఓ వేదిక అని స్థాపించిన ఆర్ట్ హౌస్ను కొత్త చిత్రకారుల చిత్రాల ప్రదర్శనకు విస్తరించాను. కార్పొరేట్ స్థాయి ఆర్ట్ గ్యాలరీలలో అడుగు పెట్టలేని గ్రామీణ చిత్రకారులకు నేను కల్పించిన వేదిక పెద్ద ఆసరా అవుతోంది. ఈ గ్యాలరీని పాతిక వేలతో ప్రారంభించాను. ఆ తర్వాత ఒక చిత్ర ప్రదర్శనలో మా చిత్రాలను పెట్టే అవకాశం వచ్చింది. కానీ ఉన్నఫళంగా అన్నింటికీ ఫ్రేమ్ కట్టించడం కూడా బరువనిపించింది అప్పట్లో. ఫ్రేమ్ తయారీకి చాలా డబ్బు ఖర్చవుతుందని నేను ఆందోళనగా ఉన్నప్పుడు... ‘ఫ్రేమ్ కట్టిస్తాను, ఎగ్జిబిషన్లో అమ్ముడైన తర్వాత డబ్బివ్వండి’ అని ఫ్రేములు కట్టే లక్ష్మణ్ ధైర్యం చెప్పాడు. క్రమంగా నా మార్కెట్ను కార్పొరేట్ రంగానికి కూడా పరిచయం చేశాను. కొండ మన దగ్గరకు రాకపోతే... మార్కెట్ పరంగా నేనుప్రధానంగా తాజ్ వంటి పెద్ద హోటళ్లు, అపోలో వంటి హాస్పిటళ్లకు చిత్రాలను అందిస్తున్నాను. అలాగే నా చిత్రాల ధరలు మధ్య తరగతికి కూడా అందుబాటులో ఉంటాయి. అదే నా విజయ రహస్యం. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. కొనుగోలుదారులు నా గ్యాలరీకి రావాలని కూర్చోలేదు. ఆసక్తి ఉన్న వారిని వెతుక్కుంటూ నేనే వెళ్లాను. అలా ప్రారంభించిన తరవాత వేగంగా చొచ్చుకుపోగలిగాను. శని, ఆదివారాల్లో క్లబ్ హౌస్లు, విల్లాలలో ప్రదర్శిస్తున్నాను. అక్కడ చాలామంది ఉత్సాహం చూపించేవారు. పిల్లల కోసం వారాంతాలలో, మహిళల కోసం మిగిలిన రోజుల్లో చిత్రలేఖనం నేర్పించమని అడిగారు. గతంలో సమ్మర్ క్యాంపుల్లో కోచింగ్ ఇచ్చాం, కానీ ప్రస్తుతం టైమ్ బాలన్స్ అవడం లేదు. గ్యాలరీ నిర్వహణలో నిలదొక్కుకున్న తర్వాత ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని మా ఇద్దరి కోరిక. నా వంతు సామాజిక బాధ్యతగా... మాది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టం పరిధిలోకి వచ్చేటంత పెద్ద పరిశ్రమ కాదు. కానీ మా వంతు బాధ్యతగా క్యాన్సర్ పేషెంట్ల సహాయార్థం ప్రదర్శనలు పెట్టి, అమ్ముడైన చిత్రాల మీద వచ్చిన ఆదాయాన్ని విరాళంగా ఇస్తుంటాం. అలా మా చిత్రాలను ఉపాసన, రామ్చరణ్, జయసుధ, సోనూసూద్ వంటి సెలబ్రిటీలు చాలామంది క్యాన్సర్ పేషెంట్ల కోసం తమ వంతు సహాయంగా కలెక్ట్ చేశారు. మొదటి ప్రదర్శన రవీంద్రభారతిలో. ఇప్పటికి 53 ప్రదర్శనలు పెట్టాను. విజిటర్స్ ఫీడ్ బ్యాక్ చాలా బాగా వస్తోంది. ఫలక్నుమాలో పెట్టిన ప్రదర్శనలో ఖతర్ రాజు పది చిత్రాలను తీసుకున్నారు. సమాజంలో మధ్యతరగతి, దిగువ స్థాయిలో నివసిస్తున్న వారిలో చక్కటి చిత్రకారులున్నారు. తమ కళను ప్రదర్శించే అవకాశం లేక అలాంటి ఎందరో కళాకారులు తెరముందుకు రాలేకపోతున్నారు. నా గ్యాలరీ అలాంటి వారికి వేదిక కావాలనేదే నా ఆశయం. మా నాన్నది ఆదిలాబాద్, అమ్మది మహారాష్ట్ర. మా మేనమామ బొమ్మలు వేసేవారు. బహుశా నాకూ ఆ కళ అలా వారసత్వంగా అబ్బిందనుకుంటాను. చిన్నప్పుడు బొమ్మలు వేసి మిత్రులకు బహుమతిగా ఇచ్చేవాడిని. అది గమనించిన మా డ్రాయింగ్ టీచర్ ప్రోత్సహించారు. ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని కూడా ఆయన చెప్తేనే తెలిసింది. కోర్సు పూర్తయిన తర్వాత యాడ్ ఏజెన్సీ స్థాపించాను. బహుశా నాలోని చిత్రకారుడు... తాను బతికి ఉండడం కోసమే నా యాడ్ ఏజెన్సీని సరిగ్గా నడవనివ్వలేదేమో అనుకుంటాను. - హరిశ్రీనివాస్, చిత్రకారుడు -
చిత్ర వైవిధ్యం
ఆ ప్రదర్శనలో ఉన్న చిత్రాలను గమనిస్తే, గ్రూప్ షో మాదిరిగా అనిపిస్తుంది. ఒక్కో చిత్రానిదీ ఒక్కో శైలి. స్టిల్లైఫ్, పోర్టరైట్స్, ఫిగరేటివ్స్, సెమీ ఫిగరేటివ్స్, డిస్టార్షన్స్.. అన్నీ విభిన్నమే. చిత్రంగా.. వాటన్నింటిపైనా ఒకే సంతకం.. ఇది గ్రూప్ షో కాదు, సోలో షో. నగర కళాకారుడు హరి ‘అఫిసియోనాడోస్’ పేరిట బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్లో ఏర్పాటు చేసిన వైవిధ్య భరిత చిత్ర ప్రదర్శన కళాభిమానులకు కనువిందు చేస్తోంది. బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి సహాయార్థం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవంలోభారతీ సిమెంట్స్ సీవోవో అనూప్కుమార్ సక్సేనా, నటి జయసుధ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్.పి.సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఎండీ వి.బి.గాడ్గిల్, పింకీరెడ్డి హాజరయ్యారు. -
అర్ట్ గ్యాలరీ అద్భుతం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement