-
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట: చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ రామ మయం!
500 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహొత్సవం పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ రామనామంతో మారుమ్రోగిపోయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ జనవరి 21న పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించింది, ఆ తర్వాత లోకక్షేమం కోసం శ్రీ సీతా రామ కల్యాణం కూడా నిర్వహించింది. ఈ కారు యాత్ర చిన్మయ అమర్నాథ్ శివాలయం నుంచి 30 మైళ్ల దూరంలో ఉన్న చిన్మయ హనుమాన్ దేవాలయం వరకు సాగింది. అందుకోసం సుమారు 141 కార్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో సహా కుటుంబాలు చలిని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ నామాన్ని జపిస్తే -10 డిగ్రీల సెల్సియస్ చలి కూడా ఏం చేయలేదని ఈ కారు యాత్ర మనకు అవగతమయ్యేలా చేసింది. పుణ్యభూమి అయోధ్యతో పాటు పిట్స్బర్గ్ కూడా భక్తుల రామ భక్తితో మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా "జై శ్రీరామ్" అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. కారు ఊరేగింపు అనంతరం చిన్మయ సంజీవిని హనుమాన్ దేవాలయంలో లోక క్షేమం కోసం అని శ్రీ సీతా రామ కల్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది చిన్మయ మిషన్ పిట్స్బర్గ్. అలాగే మహా ప్రసాద వితరణతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాలంటీర్స్కి , భక్తులకి సదరు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట? ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?) -
ఘనంగా ‘చిన్మయ మిషన్’ నూతన భవన ప్రారంభోత్సవం
చికాగో : ‘చిన్మయ మిషన్’ ఎన్డబ్య్లూఐ చరిత్రలో 2019 జూలై 27 స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు చిన్మయ ఓంకార సొంత నూతన భవన ప్రారంభోత్సవం ఆనందోత్సాహముల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపానంద ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారి దివ్య హస్తముల మీదుగా నూతన భవన ఆవిష్కరణ కన్నుల పండగగా జరిగింది. నూతన భవన సంప్రోక్షణ వైదిక శాస్త్రానుసారముగా భారతీయ దేవాలయం పండితులు శ్రీ వాసుదేవజీ ఆధ్వర్యంలో గణపతి హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయ బాలవిహార్ పిల్లలు సమర్పించిన ప్రథమ గానం, నృత్యం విశేషంగా నిలిచాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు శ్రీ స్వామి స్వరూపానందవారి ఆశీస్సులు స్వీకరించి, విందు భోజనం చేశారు. చిన్మయ ఓంకార నూతన విద్యా సంవత్సరం సెస్టెంబర్ 8 ఆదివారం నుంచి మొదలవుతుందని తెలిపారు. చిన్మయ మిషన్ ఎన్డబ్య్లూఐ కార్యక్రమానికి విచ్చేసిన అతిథితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి చిన్మయ మిషన్ చికాగో నుంచి స్వామి శరణానంద, స్వామి స్వప్రభానంద, ఆచార్యులు జితేంద్ర, పలువురు ప్రముఖులు విచ్చేశారు. -
ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!
ఇంటర్వ్యూ: కళాదర్శకుడు తోట తరణి ఒత్తుగా పెరిగిన రింగు రింగుల జుట్టు... చుట్టుపక్కల వాతావరణాన్ని నిశితంగా గమనించే లోతైన కళ్ళు... మాటల కన్నా చేతిలోనే కుంచెతోనే ఎక్కువగా భావ వ్యక్తీకరణ చేస్తూ, ఎప్పుడూ దీక్షగా పనిలో మునిగిపోయి కనిపించే కళా దర్శకుడు తోట తరణిని చూస్తే, అచ్చంగా దీక్ష పట్టిన మహర్షిలాగానే ఉంటారు. బహుశా అందుకే కామోసు.. అరవై నాలుగేళ్ళ ఆయనతో ఇప్పుడు ఓ డాక్యుమెంటరీలో స్వామీజీ పాత్ర పోషింపజేస్తున్నారు. చిన్మయ మిషన్ సంస్థాపకులూ, భగవద్గీత, ఉపనిషత్తులపై ఉపన్యాసాలతో ప్రపంచ ప్రసిద్ధులైన ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానందగా ‘పద్మశ్రీ’ తోట తరణి ఇప్పుడు తెర మీద కనిపించనున్నారు. చిన్మయానంద జీవితం మీద ఇంగ్లీషులో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ‘ది క్వెస్ట్’ కోసం కెమేరా ముందుకు వచ్చారు. చెన్నైలో రకరకాల పనులతో తీరిక లేకుండా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణి ‘సాక్షి’తో పంచుకున్న భావాలు... ఉన్నట్టుండి మీకు నటన మీద ఆసక్తి కలిగిందేమిటి? (పెద్దగా నవ్వేస్తూ...) అదేమీ లేదు. కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త స్వామి చిన్మయానంద మీద డాక్యుమెంటరీ తీస్తూ, అందులో స్వామీజీ ముసలివారైన తరువాతి ఘట్టానికి నేనైతే సరిగ్గా సరిపోతానని నన్ను అడిగారు. కెమేరా వెనుక నా పనేదో చేసుకుంటూ హాయిగా ఉన్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ముందు తటపటాయించాను. కానీ, చిత్ర రూపకర్తలు నచ్చజెప్పడంతో, చివరకు సరే అన్నాను. అలా కెమేరా ముందుకు వచ్చాను. అదీ కొద్దిసేపు కనిపిస్తాను. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ రూపకర్త ఎవరు? తమిళ చిత్రం ‘కల్యాణ సమయల్ సాదమ్’ (తెలుగులో వివాహ భోజనం అని అర్థం) ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. గతంలోనూ నన్ను కొందరు నటించమని అడిగినా, ప్రత్యేకించి ఇది ఆధ్యాత్మిక కథాంశం కావడంతో, నేను కూడా ఆకర్షితుణ్ణయ్యా. పైగా, చాలా మంది నాకూ, స్వామి చిన్మయానందకూ పోలికలున్నాయంటూ ఉంటారు. దాంతో, ఈ పాత్రలో కనిపించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎలా ఉంది నటనానుభవం? కెమేరా ముందు, అందరూ చూస్తుండగా నటించడం ఓ పెద్ద సవాలే. అయితే, నాదేమీ పూర్తి స్థాయి పాత్ర కాదు. అంతా కేవలం ఓ పాసింగ్ షో. (మళ్ళీ నవ్వేస్తూ...) అయినా, నేనేమన్నా అక్కినేని నాగేశ్వరరావునా, చిరంజీవినా... అద్భుతమైన నటన చూపడానికి! గడ్డం లేకపోయినా, చూడడానికి చిన్మయానంద గారి పోలికలున్నాయని వాళ్ళు అడగడంతో, ‘మీరు అలా అనుకొంటే, ఓ.కె’ అన్నాను. అంతే. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా స్వామి మధ్యవయస్కుడిగా కనిపించే ఘట్టాలతో నడుస్తుంది. ముసలితనం మీద పడ్డాక క్లైమాక్స్ దగ్గర నేను కనిపిస్తాను. అది రేపు తెర మీద ఎన్ని నిమిషాలు ఉంటుందో నాకే తెలీదు. మరి, డాక్యుమెంటరీ తీసినవాళ్ళు ఏమన్నారు? నా మటుకు నాకు తెలియడం లేదు కానీ, స్వామీజీ వాళ్ళు మాత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. బయటికొచ్చాక తెర మీద చూడాలి. అయినా... నేను పని చేస్తున్న సినిమాల గురించి కానీ, నా ఆర్ట్ డెరైక్షన్ గురించి కానీ ‘అద్భుతం... చాలా బాగుంది’ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడూ చెప్పను. తెర మీద చూశాక, ఆ మాట జనం చెప్పాల్సిందే (నవ్వులు...). గతంలో కూడా మీరు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘శివాజీ’లో కెమేరా ముందుకొచ్చారు కదూ! అవును. ఆ సినిమాలోని ‘బల్లేలక్కా...’ పాటలో అందరితో పాటు కలిసి, జల్సాగా నిలుచున్నా. తెర మీద అలా తళుక్కున మెరిశాను. కాకపోతే, అదేదో సరదాగా చేసిన వ్యవహారం. కానీ, ఈ డాక్యుమెంటరీ అలా కాదు.. గంభీరమైన ఓ స్వామీజీ పాత్రలో కనిపించడం. ఇది తమాషాగా తీసుకోదగ్గ ఆషామాషీ పని కాదు. అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశా. మీ నాన్న గారు తోట వెంకటేశ్వరరావుకి కూడా నటనానుభవం ఉన్నట్లుంది? అవును. చిత్రసీమలో కళాదర్శకుడిగా స్థిరపడక ముందు ఆయన టీనేజ్లో నాటకాలు ఆడేవారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రంగస్థల ప్రసిద్ధులు డి.వి. సుబ్బారావు గారితో కలసి, వారి నాటక బృందంలో మా నాన్నగారు వేషాలు వేసేవారు. అవన్నీ 1940ల నాటి సంగతులు. అప్పట్లో నటనలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు కూడా! (నవ్వేస్తూ...) నాకూ, ఆయనకూ పోలికే లేదు. నక్కకూ, నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. ఏమైనా, రేపు డాక్యుమెంటరీ బయటకు వచ్చాక, మీ లాంటి వారందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి. - రెంటాల జయదేవ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement