-
చైనా ఫోన్లే కాదు.. విమానాలూ చౌకే!
విదేశాలకు వెళ్లడానికి చార్జీలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? ప్రముఖ విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటించినా, అవన్నీ స్వదేశీ విమానయానానికే చాలావరకు పరిమితం అవుతున్నాయి. కొన్ని మాత్రం విదేశాలకు ఆఫర్లు ఇస్తున్నా, అవన్నీ దగ్గర దేశాలకే. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం టికెట్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని బాధపడేవారికి ఇదో అవకాశం. చైనా సదరన్ ఎయిర్లైన్స్ వాళ్లు చాలావరకు చవగ్గా విమానయానాలు అందిస్తున్నారట. ఢిల్లీ నుంచి లాస్ ఏంజెలిస్ వెళ్లడానికి ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు రూ. 65వేలు టికెట్ తీసుకుంటే, చైనా సదరన్ ఎయిర్లైన్స్ (సీఎస్ఏ) టికెట్ 58వేలు మాత్రమే ఉందట. ఒక్క అమెరికాకే కాదు.. భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాలకు తక్కువ ధరలకే టికెట్లు ఆఫర్ చేస్తోంది. దాంతో భారతీయ ప్రయాణికులు ఇప్పుడు చైనా ఫోన్లతో పాటు చవగ్గా వస్తున్న చైనా విమానటికెట్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. భారత్ నుంచి ఈ విమానాల్లో వెళ్లేవారి సంఖ్య ఇటీవల కొన్నేళ్ల నుంచి బాగా పెరిగిందని థామస్ కుక్ సంస్థ ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగీ చెప్పారు. చవగ్గా టికెట్లు ఇస్తున్నాం కదాని విమానాలు కూడా చౌకబారుగా ఉంటాయనుకుంటే తప్పే. వాటిలో సౌకర్యాలు కూడా బాగానే ఉంటున్నాయట. దూర ప్రాంతాలకు వెళ్లడానికి టికెట్ల ధరలు సింగపూర్ ఎయిర్లైన్స్, థాయ్ ఎయిర్వేస్, మలేసియన్ ఎయిర్లైన్స్ కంటే ఇందులో కనీసం 20 నుంచి 25 వేల వరకు ఇందులో తక్కువగా ఉంటున్నాయని రస్తోగీ చెప్పారు. అయితే, భారతీయ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం వీళ్లకు మరీ ఎక్కువగా లేకపోవడంతో ఎయిరిండియా సహా పలు భారతీయ ఎయిర్లైన్స్ బతికిపోతున్నాయి. వారానికి 42 విమానాల్లో 10వేల సీట్లు మాత్రమే అమ్ముకోడానికి వీలు కల్పించేలా ఇండియా - చైనాల మధ్య విమానయానానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దీన్ని చైనా సంస్థలు పూర్తిగా వాడుకుంటుండగా, భారతదేశం మాత్రం కేవలం 5 విమానాలే నడిపిస్తూ 1280 సీట్లు మాత్రమే అమ్ముకుంటోంది. ధరల్లో తేడాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ-సిడ్నీ: చైనా సదరన్ (సీఎస్): రూ. 44,500 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 69వేలు (డైరెక్ట్) ఢిల్లీ-ఆక్లండ్: సీఎస్: రూ. 48,900 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 68,400 (వయా సిడ్నీ) ఎంఎ: రూ. 70,500 (వయా కౌలాలంపూర్) ఢిల్లీ-టోక్యో సీఎస్: రూ. 34,000 (వయా గువాంగ్జు) ఏఎన్ఏ : రూ. 39,400 థాయ్: రూ. 42,000 (వయా బ్యాంకాక్) ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: సీఎస్: రూ. 60,300 (వయా గువాంగ్జు) గల్ఫ్ విమానాలు: ప్రారంభం రూ. 72 వేలు -
ప్రపంచంలో అతిపెద్ద చౌక ఎయిర్లైన్స్ కూటమి!
‘వేల్యూ అలయెన్స్’ టేకాఫ్... సింగపూర్: చౌక విమానయాన సేవలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్స్ కూటమి(అలయెన్స్) ఆవిర్భవించింది. ఆగ్నేయాసియా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన ఎనిమిది బడ్జెట్ ఎయిర్లైన్స్ కలిసి ‘వేల్యూ అలయెన్స్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సోమవారమిక్కడ ప్రకటించాయి. ఈ విమానయాన కంపెనీలకు చెందిన టికెటింగ్ ప్లాట్ఫామ్ షేరింగ్ ద్వారా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లను బుక్ చేసుకోవడాకి వీలుకల్పించనుండటం ఈ అలయెన్స్ ప్రత్యేకత. అంటే.. ఈ ఎనిమిది కంపెనీలకు చెందిన ఏ వెబ్సైట్ ద్వారానైనా అన్ని సంస్థల ఫ్లైట్లు, టారిఫ్లు, ఇతరత్రా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. సంబంధిత వెట్సైట్ ద్వారా ఒకే లావాదేవీతో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని వేల్యూ అలయెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద చౌక విమానయాన సంస్థల కూటమిగా దీన్ని అభివర్ణించింది. అలయెన్స్లో సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’, ఫిలిప్పైన్స్కు చెందిన సెబు ఫసిఫిక్, దక్షిణ కొరియా జేజు ఎయిర్, థాయ్లాండ్ నోక్ ఎయిర్, నోక్స్కూట్; టైగర్ ఎయిర్ సింగపూర్, టైగర్ ఎయిర్ ఆస్ట్రేలియా, జపాన్ సంస్థ వెనీలా ఎయిర్లు ఉన్నాయి. ఈ అలయెన్స్లో మొత్తం విమానాల సంఖ్య 176 కాగా, 160 గమ్య స్థానానాలకు సర్వీసులను అందించనుంది. గతేడాది ఈ కూటమి సభ్య కంపెనీలు 17 ప్రధాన కేంద్రాల(హబ్స్) ద్వారా 4.7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఆగ్నేయాసియాలో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ఏషియా, ఆస్ట్రేలియా కాంటాస్ ఎయిర్వేస్, భారత్ చౌక విమానయాన దిగ్గజం ఇండిగోలు ఈ అలయెన్స్కు దూరంగా ఉన్నాయి. -
రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు!
సంక్రాంతి సందర్భంగా విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా కొత్త ఆఫర్ ప్రకటించింది. 'హ్యాపీ సంక్రాంతి' పేరుతో తక్కువ ధరకే విమాన యానం అందించే ఈ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. పండుగలు, సెలవులను దృష్టిలో పెట్టుకుని రూ. 1,799 నుంచే టికెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి జనవరి 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. -
ఎయిర్ కోస్టా న్యూ ఇయర్ ఆఫర్లు
రాబోయే కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కోస్టా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 11 మధ్యాహ్నం మూడు గంటల నుంచి డిసెంబర్ 15 మూడు గంటల లోపు టికెట్లను బుక్ చేసుకున్న వారికి తగ్గింపు ధరలకే టికటెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈసమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, చెన్నై, తిరుపతి నగరాలకురూ. 2015, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లకు రూ. 2499, విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం రూ. 2499కే ప్రయాణాలు చేయొచ్చు. మరికొన్ని పట్టణాల మధ్య రూ. 2015 నుంచి రూ. 3499కే ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తోంద.ఇ ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో 2015 ఫిబ్రవరి 1 నుంచి 2015 ఏప్రిల్ 15లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. -
జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్`
విమానయాన సంస్థల పోటీ పుణ్యమాని ప్రయాణికులకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ తాజాగా కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎకానమీతో పాటు ప్రీమియర్ క్లాసు ప్రయాణాలకు, అదికూడా స్వదేశీ, అంతర్జాతీయ ప్రయాణాలు అన్నింటికీ 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 6వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వాటిలో నవంబర్ 5వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. జెట్ ఎయిర్వేస్తో పాటు దాని వ్యూహాత్మక భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ పనిచేస్తుంది. స్వదేశీ విమానాల్లో అయితే బేస్ ఫేర్, ఫ్యూయెల్ ఛార్జీమీద డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతర్జాతీయ విమానాల్లో అయితే మాత్రం కేవలం బేస్ ఫేర్ మీద మాత్రమే రాయితీ ఇస్తారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement