-
HYD: లలితా జ్యువెలరీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ జ్యువెలరీ స్టోర్ లలితాలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. సేల్స్మెన్ దృష్టి మళ్లించి ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ కిలాడీ లేడీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగరంలోని చందానగర్ లలితా జ్యువెలరీ స్టోర్ బ్రాంచ్లో డిసెంబర్ 31వ తేదీన నగలు కనిపించకుండా పోయాయి. దీంతో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టోర్లో పలువురిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. తొలుత లాభం లేకపోయింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే పదే పదే ఫుటేజీలను గమనించిన క్రమంలో.. మెరుపు వేగంతో నగలు మాయం చేసిన ఓ మహిళ కనిపించింది. ఖతర్నాక్ కిలాడీ ఈ కేసులో చోరీకి పాల్పడిన మహిళను సరూర్ నగర్కు చెందిన గౌతమిగా గుర్తించారు. విశేషం ఏంటంటే.. గౌతమి నగరంలో 13 చోరీ కేసుల్లో నిందితురాలు. రద్దీగా ఉండే జ్యువెల్లరీ షాపులే లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణాల్లో దొంగతనాలు చేసి మాయమైపోవడంలో దిట్ట అయిన గౌతమిని మొత్తానికి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. -
HYD: ట్యూషన్కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ట్యూషన్కు వెళ్లమన్నందుకు ఓ బాలిక 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుటుంబంతో కలిసి 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 4 నెలల క్రితం నల్లగండ్లలోని అపర్ణ సరోవర్లోని ఈ–104 ఫ్లాట్కు మారారు. సందీప్కు ఒక కుమార్తె ఆహానా (12) తెల్లాపూర్లోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మ్యాథ్స్ ట్యూషన్ కోసం అదే అపార్ట్మెంట్లోని హెచ్–1501లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వెళ్తుంది. అయితే ఆహానా తనకు ట్యూషన్ ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. అయిప్పటికీ వారు ట్యూషన్కు వెళ్లాలంటూ కూతురిని బలవంతం చేశారు. దీంతో చిన్నారి యాధా విధిగా శుక్రవారం స్కూల్ నుంచి 3.30 గంటలకు వచ్చి సాయంత్రం 4.50 గంటలకు 15వ అంతస్తులోని బాల్కనీ కిటికీ తీసుకుని కిందకు దూకేసింది. కింద పడటంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు ఈ ఘటనపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చందానగర్లోని థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: చందానగర్లోని జేపీ సినిమాస్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతోంది. థియేటర్లో మూడు స్క్రీన్స్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. -
అనుమతులు లేకుండా ఐస్క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
బీ అలర్ట్! హైదరాబాద్లో హానికర రసాయనాలతో ఐస్క్రీమ్లు..
సాక్షి, హైదరాబాద్: ఐస్క్రీం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటికున్న క్రేజ్ వేరు. రోడ్లపై ఐస్క్రీం కనపడితే కొనిచ్చేంత వరకు పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఐస్క్రీం తినాలనిపిస్తుంది. అందుకు ఈ సీజన్లో ఐస్క్రీంలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో ఐస్క్రీంలను తయారీ, నకిలీ ఐస్క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు ప్రాణాల పణంగా, లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు. భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీ దారిని ఎంచుకుంటున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్క్రీమ్లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త భాగ్యనగర ప్రజలారా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement