-
‘ఆ ఫైనల్ ఫలితాన్ని రిపీట్ చేద్దాం’
మాంచెస్టర్: ప్రపంచకప్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగబోయే మ్యాచ్లో చాంపియన్ ట్రోఫీ ఫలితాన్ని రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సూచించాడు. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరగనుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సందర్భంగా వకార్ యూనిస్ మీడియాతో మాట్లాడాడు. పాక్ ఈ మెగా టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఏ ప్లస్ ప్రదర్శన చేయాలన్నాడు. ముఖ్యంగా ఆరంభంలో వికెట్లు చేజార్చుకోకూడదని పేర్కొన్నాడు. వికెట్లు చేజార్చుకుంటే భారీ స్కోర్ సాధించలేమని.. ఇక ఛేదనలో అయితే జట్టుపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపాడు. మాలిక్ ఎందుకు? టీమిండియాతో మ్యాచ్కు ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని వకర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఐదో బౌలర్ ముఖ్యంగా స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ఆ మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లు హఫీజ్, మాలిక్లు స్పిన్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయారన్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో రాయ్, రూట్ వికెట్లను తీసని షాదాబ్ ఖాన్ను టీమిండియాతో జరగబోయే మ్యాచ్కు తీసుకోవాలన్నాడు. అవసరమైతే మాలిక్ను పక్కకు పెట్టాలన్నాడు. బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతున్న మాలిక్ జట్టులో ఎందుకు అని వకార్ ప్రశ్నించాడు. -
కోహ్లి,యువీ, నేను అందుకే నవ్వుకున్నాం
-
కోహ్లి, నేను అందుకే నవ్వుకున్నాం: పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్: చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా- పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వులు చిందించుకున్న విషయం తెలిసిందే. అయితే ఘోర ఓటమి అనంతరం ఏ మాత్రం బాధ లేకుండా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకోవడం పట్ల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ నవ్వుల వెనకాల గల కారణాలను పాకిస్తాన్ ఆల్రౌండర్ షోయాబ్ మాలిక్ వివరించాడు. తాజాగా స్థానిక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఆనాటి విషయాలను నెమరువేసుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్ను స్పిన్నర్ సయీద్ ఆజ్మల్, మాలిక్లు ఫన్నీగా డ్రాప్ చేశారు. చాంపియన్ ట్రోఫిలో విండీస్తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన సునాయస క్యాచ్ను అందుకునేందుకు అజ్మల్, మాలిక్లు ప్రయత్నించారు. అయితే మాలిక్ అందుకుంటాడని ఆజ్మల్, ఆజ్మల్ అందుకుంటాడని మాలిక్లు చివరి క్షణంలో క్యాచ్ను వదిలేశారు. అయితే క్యాచ్ డ్రాప్ అనంతరం ఆజ్మల్తో మాలిక్.. ‘నువ్వు నీ స్థానంలో ఉంటే క్యాచ్ను సులభంగా అందుకునే వాడివి కదా.. ఎందుకు పొజీషన్ ఛేంజ్ అయ్యావు?. అప్పుడు ఆజ్మల్ సమాధానమిస్తూ నువ్వు క్యాచ్ మిస్ చేస్తే బంతి నేలపై పడకుండా త్వరగా అందుకుందామని అనుకున్నాను’ అంటూ ఆజ్మల్ ఫన్నీగా సమాధానమిచ్చాడని మాలిక్ వివరించాడు. ఇదే విషయాన్ని టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలకు చెబితే తెగ నవ్వారని ఆనాటి సంఘటనను వివరించాడు. అయితే పాకిస్తాన్తో జరిగిన చాంపియన్ ట్రోఫీ పైనల్లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది
ఛాంపియన్ ట్రోఫిలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్పై శ్రీలంక ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు బ్యాట్తో మెరిశారు. ధావన్ 125 పరుగులు, 128 బంతుల్లో చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్ డిక్వెల్(7) వికెట్ను కోల్పోయింది. కుశాల్ మెండీస్(89), గుణతిలకలు(76)లు నిలకడగా ఆడి విజయంవైపు అడుగులు పడేలా చేశారు. టీమ్ ఇండియాకు బలం అనుకున్న బౌలింగ్ విఫలం చెందడంతోతో మ్యాచ్ చేయి జారిపోయింది. ఏడు వికెట్ల తేడాతో లంకేయులు ఇండియాపై విజయం సాధించారు. -
చాంపియన్స్ ట్రోఫికి జో ‘రూట్‘
లండన్: చాంపియన్ ట్రోఫిలో భాగంగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాట్స్ మోన్ జోరూట్ సెంచరీ సాధించి టోర్నిలో ఇంగ్లండ్ విజయాలకు రూట్ వేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హెల్స్లు అర్ధ సెంచరీలు సాధించడంతో బంగ్లాపై సునాయసంగా విజయం సాధించింది. 306 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్(1) నిరాశపర్చగా మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్, జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సెంచరి మిస్ చేసుకున్న అలెక్స్(86 బంతుల్లో11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) పరుగులు చేసి షబ్బీర్ రెహ్మాన్ బౌలింగ్లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ విజయం సులువైంది. జోరూట్ 115 బంతుల్లో శతకం సాధించగా, మోర్గాన్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం రెచ్చిపోయి ఆడిన వీరిద్దరూ 47.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించారు. జోరూట్ 133(129 బంతులు 11 ఫోర్లు, ఒక సిక్స్), మోర్గాన్ 75(61 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సులు) అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement