-
‘రేషన్ ’లో దశల వారీగా నగదు రహిత లావాదేవీలు
సబ్బవరం (పెందుర్తి) : రేషన్ షాపుల్లో నిర్భంధ విధానం కాకుండా దశలవారీగా నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దివిలీల మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మండల రేషన్ డీలర్లతో సమావేశమయా్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం విజయనగరంలో రాష్ట్ర రేషన్ లర్ల సమావేశం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానాన్ని రాష్ట్ర డీలర్లు విజయవంతం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను దేశంలోనే తొలిస్థానానికి తీసుకువెళ్లారన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రూ.20 నుంచి రూ.70కు కమీషన్ పెంచిం దని తెలిపారు. రేషన్ డీలర్లను బ్యాంక్ కరస్పాం డెంట్లు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. అందువల్ల వీరికి ఖర్చులు పోనూ 5 శాతం కమీషన్ వచ్చేవిధంగా విధివిధానాలు రూపొం దించాలని కోరారు. డీలర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.గంగాధరగౌడ, రాష్ట్ర కోశాధికారి పి.చిట్టిరాజు, కె.అప్పారావు, వాసిరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
‘క్యాష్లెస్’కు ఊతం
►ఎస్హెచ్జీ మహిళలకు స్మార్ట్ ఫోన్లు ►కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.6 వేల రుణం ►24 వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయం ►నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నం ►రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి వరంగల్ రూరల్ (వెల్ఫేర్) : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే క్యాష్లెస్ లావాదేవీలను పెంచేందుకు తాజాగా మరో అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ల్లోని మహిళల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటే నగదు రహిత లావాదేవీలు ఊపందుకుంటాయని భావించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, సంఘాల్లోని మహిళలకు ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని గుర్తించి.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రూ.6 వేలు.. 24 వాయిదాలు మహిళా సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరు సెల్ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.6 వేల చొప్పున స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణం అంజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఇలా రుణంగా అందే నగదుతో మహిళలు ఏ కంపెనీ ఆండ్రాయిడ్ సెల్ఫోన్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం 24 వాయిదాల్లో రూ.275 చొప్పున ఈ నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మహిళ తీసుకున్న రూ.6 వేలకు రూ.6,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది పెద్దగా భారమేం కాదు కనుక మహిళలంతా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారని, తద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావిస్తోంది. కాగా, అందరూ రుణం తీసుకోవాలనే నిబంధన విధించకపోవడంతో ఆసక్తి ఉన్న వారే రుణం తీసుకోవడంతో పాటు స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్త్రీ ‘నిధి’ సాయం.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.30 కోట్ల మేరకు అందజేశారు. దీంతో మిగిలిన రూ.41 కోట్లను వచ్చే నెల ముగిసేలోగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగం గా మరుగుదొడ్డి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రూ.12 వేలను స్త్రీనిధి ద్వారా రుణంగా ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఒకవేళ ఆలోగా నిర్మాణ బిల్లు ప్రభుత్వం నుంచి ఇస్తే ఆ వెంటనే చెల్లించాలనే నిబంధన విధించారు. -
త్వరలో రేషన్ నగదు రహితం!
కార్డు, ఆధార్ ద్వారా చెల్లింపులు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్లు పీడీఎస్ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్లను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
లేదంటే లైసెన్స్ రద్దు ఈ నెల 31 చివరి తేదీ జిల్లా కలెక్టర్ అమ్రపాలి హన్మకొండఅర్బన్ (వరంగల్ పశ్చిమ) : జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఈ నెల 31నాటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఆ సంస్థల లైసెన్స్లు రద్దు చేస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సంస్థలు ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సాకేంతిక విధానాలు ఏర్పాటు చేసుకుని నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఆధార్ కలిగి ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ శ్రీను, కార్పొరేషన్బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిత్ర, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు సంబంధించి వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో క్షయవ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయవాధి బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు, పక్కవారికి వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందించాలన్నారు. సమావేశంలో క్షయవ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యప్రకాష్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, లెప్రసీ విభాగం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామనీరజ, డాక్టర్ శ్రవణ్కుమార్, ప్రొఫెసర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. జీఎంహెచ్ను తనిఖీ చేసిన కలెక్టర్ హన్మకొండ చౌరస్తా (వరంగల్ పశ్చిమ): హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అమ్రపాలి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షణ్ణంగా పరిశీలించిన ఆమె సమస్యలు, కావాల్సిన వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరావు, సూపరింటెండెంట్ నిర్మల, ఆర్ఎంఓ సుధార్సింగ్తో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సుమారు గంట పాటు ఆసుపత్రిలో సమయం వెచ్చించిన కలెక్టర్ తిరిగి బయటకు వెళ్తుండగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
నగదు రహితంతో అవినీతి నిర్మూలన
రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది అవగాహన సైకిల్యాత్ర కరీంనగర్ క్రైం : నగదు రహిత లావాదేవీలతో అవినీతి నిర్మూలించబడుతుందని రాష్ట్రహోం శాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెం ట్ డీజీపీ రాజీవ్ త్రివేది అన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు కరీం నగర్ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెంట్ శాఖ అదివారం కమిషనరేట్ హెడ్క్వార్టర్లో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆందోళనలు చెం దాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారులు పా రదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. కరీంనగర్ పోలీస్కమిషనర్ క మలాసన్రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లా వాదేవీల కొనసాగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులు అవసరం లేకుండానే లా వాదేవీలు కొనసాగించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్థా యిల పోలీస్అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్మార్ట్సిటీ నిర్మాణంలో భాగంగా పో లీసులు చేపడుతున్న చర్యలకు అన్ని వర్గాల ప్ర జలు తమవంతు సహకారం అందించాలని కో రారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శశాంక, అడిషనల్ డీసీపీ అన్నపూర్ణ, డీఆర్వో అయేషాఖాన్, వ్యాపార వాణిజ్య ప్రతినిధులు మునీందర్, భాస్కర్, అంజయ్య, శంకర్, శ్రీనివాస్, బ్యాంక్ అధికారి శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫొర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఘనంగా స్వాగతం నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పి స్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఇద్దరు కుమారులు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు సైకిల్యాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండలం వాగేశ్వరీ, జ్యోతి ష్మతి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల వద్ద విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement