-
పాతనోట్లు చలిమంట
రాయచూరు రూరల్: అది రాయచూరు నగరంలోని గంజ్ సర్కిల్ ప్రాంతం. ఒక మూలన ఏవో కాగితాలు తగలబడుతున్నాయి. కొందరు అనుమానం వచ్చి చూస్తే.. అవి 500, 1000 రూపాయల నోట్లు. దీంతో గగ్గోలు మొదలైంది. కాకపోతే అవి రద్దయిన పాత నోట్లు. ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారులు ఎవరైనా పాత నోట్లను అలాగే ఉంచుకుని ఉంటారు, మార్పిడికి చేతకాక అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. దీనిపై మార్కెట్ యార్డ్ ఎస్ఐ అగ్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే జిల్లా ఇన్చార్జ్ మంత్రి వెంకటరావ్ నాడగౌడ ఘటన స్థలాన్ని సందర్శించారు. పాతనోట్ల రద్దయిన దాదాపు రెండేళ్ల తరువాత కూడా అవి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతమొత్తంలో కాల్చి ఉంటారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
చలిమంటలో పడి మహిళ సజీవ దహనం
విశాఖపట్టణం: చలిమంట ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం నర్తనపల్లిలో చిలకమ్మ అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున చలిమంట కాగుతోంది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆమె ఆ మంటల్లో పడింది. చుట్టుపక్కల వారు రక్షించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. -
చలిమంటలో పడి చిన్నారి మృతి
వరంగల్: దురదృష్టవశాత్తూ చలిమంటలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామశివారు వడ్డెరగూడెంలో జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి వద్ద చలి మంట కాచుకుంటున్న సుర వర్షిణి ప్రమాదవశాత్తు మంటలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
భోగి మంటల్లో పేలిన 'హిట్' స్ప్రేయర్
ధర్మారం (డిచ్పల్లి) : సంక్రాంతి భోగి మంటలు ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం తెచ్చిపెట్టాయి. భోగి మంటల్లో వేసిన దోమల మందు స్ప్రేయర్ 'హిట్' ట్యూబ్ పగలటంతో చిన్నారితోపాటు ముగ్గురు గాయాలపాలయ్యారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన రాకోలు సాయి, రమాదేవి దంపతులు తమ కుమారుడు రితేష్(3), వారి బంధువు శివకృష్ణతోపాటు గురువారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేసి అందులో పాత వస్తువులను పడవేసి అక్కడే కూర్చున్నారు. వాటిలో దోమలు, బొద్దింకలను చంపడానికి వాడే 'హిట్' స్ప్రేయర్ కూడా ఉంది. మంటల వేడికి బాటిల్ పేలి దాంట్లో మిగిలి ఉన్న మందు ఎగజిమ్మి అందరి ముఖాలు, చేతులపై పడింది. స్ప్రేతో పాటు మంటలు అంటుకున్నాయి. కుటుంబసభ్యులు వారిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలైన బాలుడు రితేశ్కు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. -
చలి మంట అంటుకుని యువతి మృతి
కోటపల్లి (ఆదిలాబాద్) : చలి మంట వద్ద కూర్చున్న యువతి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రగాయాలతో చనిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. కోటపల్లికి చెందిన రంగు ముత్తయ్య, మల్లక్క దంపతుల కుమార్తె మానస(18) ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం ఆమె చలి మంట వద్ద కూర్చుని ఉంది. మంట సరిగా రాకపోవటంతో కుటుంబసభ్యులు కిరోసిన్ చల్లారు. దాంతో ఒక్కసారిగా మంటలు రేగి మానస దుస్తులకు అంటుకున్నాయి. వారు ఆర్పేలోగానే ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు మొదట చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ రాములు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement