-
మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. పునరావాసం అందనివారు పొరుగు రాష్ట్రాల నుంచి నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకుని సారా బట్టీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక నిల్వలు గుడుంబా మళ్లీ విజృంభిస్తోందన్న వాస్తవాన్ని బయటపె డుతున్నాయి. ఏపీ నుంచి రైళ్లలో, మహారాష్ట్ర నుంచి రోడ్డు మార్గంతో నల్లబెల్లం రాష్ట్రంలోకి వస్తోందని అధికారవర్గాలు గుర్తించాయి. గట్టి చర్యలు చేపట్టినా.. రాష్ట్రాన్ని గుడుంబా రహితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలే తీసుకు న్నారు. నాటుసారా తయారీపై ఎక్సైజ్, పోలీ సు సిబ్బంది దాడులు చేశారు. చాలా మంది గుడుంబా తయారీదారులను పట్టుకుని కేసు లు పెట్టారు. నల్లబెల్లం సరఫరాను నియం త్రించారు. గుడుంబా జీవనాధారంగా బతికే కుటుంబాల వారికి పునరావాసంగా ప్రత్యా మ్నాయ ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించే కార్యక్రమా న్నీ చేప ట్టారు. ఐదారు నెలల్లోనే గుడుంబా నియం త్రణలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో చాలా మందిని పునరావాస సాయం కోసం ఎంపిక చేయలేదు, ఎంపికైనవారిలో పలు వురికి సా యం అందకపోవడంతో మళ్లీ గుడుంబా తయారీవైపు మరలినట్టు తెలుస్తోంది. రైలు, రోడ్డు మార్గాల్లో నల్లబెల్లం.. పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేక పోవడంతో తక్కువ ధరకే నల్లబెల్లంపై అందుబాటులో ఉంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు, గోదా వరి జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరం గల్, నల్లగొండ జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు రోడ్డు మార్గంలో నల్లబెల్లం వస్తోంది. ఏపీ నుంచి రైళ్లలో రోజూ 50 టన్నుల వరకు నల్ల బెల్లం అక్రమరవాణా అవుతున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఇటీవలే మహారాష్ట్ర నుంచి 11 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను తరలిస్తున్న వాహనాన్ని ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(టి)–కౌటాల రహదారిపై ఎౖMð్సజ్ అధికారులు పట్టుకోవడం గమనార్హం. గుం టూరు జిల్లా బాపట్ల నుంచి పద్మావతి ఎక్స్ ప్రెస్లో తీసుకువస్తున్న 10 టన్నుల బెల్లాన్ని కేసముద్రం వద్ద రైల్లోనే పట్టుకున్నారు. యువకులు బృందాలుగా మారి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల వారు కొందరు బృందాలుగా ఏర్పడి నల్లబెల్లాన్ని తీసుకువస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బెల్లం కొంటు న్నారు. ఒక్కొక్కరు ఒక్కో క్వింటాల్ బెల్లాన్ని బస్తాల్లో తీసుకుని సాధారణ ప్రయాణీకుల్లా రైలు ఎక్కుతున్నారు. తమ గమ్యస్థానం సమీపించగానే రైల్లోంచి బెల్లం మూటలను కిందికి తోసేస్తున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉండే మరికొందరు.. ఆ బెల్లాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లి రెండింతల ధరకు విక్రయిస్తున్నారు. -
250 కిలోల నల్లబెల్లం పట్టివేత
సూర్యాపేట మున్సిపాలిటీ : అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని సూర్యాపేట ఎక్సైజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన ధరావత్ పూర్ణ హైదరాబాద్ నుంచి టాటా ఏసీ వాహనంలో 250 కేజీల బెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తీసుకొస్తున్నాడు. సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పట్టణంలోని కుడకుడ రోడ్డులో పట్టుకున్నారు. వాహనంలో ఉన్న బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. వ్యాపారి పూర్ణపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దాడుల్లో సీఐ శ్రీధర్, ఎస్ఐ హనుమంతు, సిబ్బంది రాములు, బాలాజీ, వీరయ్య, రాంమూర్తి తదితరులు ఉన్నారు. -
25 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించిన అధికారులు 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుక్నురు. ఆటోలో తరలిస్తున్న నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
70బస్తాల నల్లబెల్లం పట్టివేత
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో 70కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. వ్యాపారి గుండా శ్రీనివాస్ ఇంటిపై దాడి చేయగా నల్లబెల్లం నిల్వలు బయటపడ్డాయి. సరుకును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
నమ్మించి.. ముంచి
నల్లబెల్లం కొనుగోలులో మాటమార్చిన మార్క్ఫెడ్ ఎక్సైజ్శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే యత్నం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మిన్నకుంటున్న వైనం గగ్గోలు పెడుతున్న బెల్లం రైతులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్క్ఫెడ్ 60 మంది రైతులకు అమ్మకపు టోకెన్లిచ్చి ఒక్క బెల్లం ముద్దనూ కొనకుండానే దుకాణం కట్టేసింది. పక్షం రోజులు దాటుతున్నా బెల్లం కొనకపోవడం పై మార్క్ఫెడ్ను ప్రశ్నిస్తే, ఎక్సైజ్ శాఖ నిధులివ్వలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో బెల్లం అమ్మకంపై ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మార్క్ఫెడ్ మాయజాలం మార్క్ఫెడ్ జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కేంద్రాన్ని చిత్తూరులోని మార్కెట్ యార్డులో ఏప్రిల్ 2న ప్రారంభించింది. పాలసముద్రం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, కార్వేటినగరం ప్రాంతాల్లో మరో నాలుగు కొనుగోలు కేంద్రాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మార్క్ఫెడ్ అధికారులు చెప్పారు. కిలో బెల్లం రూ.27 వంతున కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది 700 నుంచి వెయ్యి టన్నుల వరకు బెల్లం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు రైతుల వద్ద ఎంత మోతాదులో బెల్లం ఉన్నా కొంటామన్నారు. రైతులు పట్టాదారు పాసుబుక్కులతోపాటు ఆధార్ కార్డు, రేషన్కార్డు లేదా ఓటరు కార్డు తీసుకురావాలన్నారు. దీంతో మార్క్ఫెడ్ ప్రకటనతో ఆర్థిక ఇబ్బందులతో బెల్లం అమ్ముకున్న రైతులు తప్ప.. అప్పటి వరకు బెల్లం నిల్వ ఉంచుకున్న రైతుల్లో ఆనందం వెల్లివెరిసింది. మార్క్ఫెడ్ గిట్టుబాటు ధరకు బెల్లం కొంటే పెట్టుబడులు పోను అంతోఇంతో చేతికి వస్తుందని ఆశించారు. కానీ ఆ ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. ఒక్కరోజుకే.. బంద్ తొలిరోజు 60 మంది బెల్లం రైతులకు అమ్మకపు టోకెన్లు మంజూరు చేసిన మార్క్ఫెడ్ అధికారులు సాయంత్రానికే దుకాణం కట్టేశారు. మరుసటి రోజు నుంచే ఇప్పట్లో బెల్లం కొనుగోలు చేయడం లేదంటూ రైతులకు అమ్మకపు టొకెన్లు ఇవ్వడం నిలిపేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లబెల్లం కొనుగోలు నిలిపివేశామని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఖరాకండిగా చెప్పేశారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే నల్లబెల్లం కొనుగోలుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిధులివ్వాల్సి ఉందని, ఆ నిధులు వస్తేనే బెల్లం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నిధులివ్వని ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్ఫెడ్ జిల్లాలో 700 టన్నుల నల్లబెల్లం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 కోట్లు నిధులు అవసరమవుతాయి. ఎక్సైజ్ శాఖ నిధులిస్తేనే మార్క్ఫెడ్ బెల్లం రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిఉంది. అయితే గత ఏడాది సైతం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు మార్క్ఫెడ్ 627 టన్నుల బెల్లాన్ని కొనుగోలుచేసింది. దీనికి సంబంధించి దాదాపు రూ.2 కోట్ల నిధులు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఎక్సైజ్ శాఖ కేవలం కోటి రూపాయలు మాత్రమే నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా కోటి రూపాయలు రావాల్సి ఉండడంతో మార్క్ఫెడ్ నల్లబెల్లం కొనుగోలును అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం.. నల్లబెల్లం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు ఇవ్వడంలో మాత్రం సీత కన్నేసింది. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో స్పందించపోవడంపై రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement