-
బినామీల బాగోతం
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వ భూముల్లోనే పాగా వేశారు. ఎక్కడైన ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఆ ప్రాంతంలోని భూనిర్వాసితులకు పరిహారం దక్కడం న్యాయం. కానీ కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూ రమ్మ రిజర్వాయర్ పరిహారం కోసం స్థానికేతరు లు సైతం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుల పేర్లు కనిపించడంపై కలిగోట గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న స్థానికులకు మాత్రమే పరిహారం ఇవ్వాలని.. అక్రమార్కులను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదీ రిజర్వాయర్ ప్రణాళిక కథలాపూర్ మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్గా మార్చాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపెల్లి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్ను నీటితో నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగు, తాగునీరందించడం లక్ష్యం. రిజర్వాయర్ నిర్మాణానికి అంబారిపేట పరిధిలోని 39.26 ఎకరాలు పట్టా భూమి, 114.33 ఎకరాలు ప్రభుత్వ భూమి అవసరం. కలిగోట పరిధిలో 117.11 ఎకరాలు పట్టాభూమి, 80.36 ఎకరాలు ప్రభుత్వ భూమి కోల్పోతున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. పట్టాభూముల రైతులకు అప్పట్లోనే ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరానికి రూ.6.75లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. బినామీల కన్ను కలిగోట పరిధిలోని ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నట్లుగా కలిగోట గ్రామస్తులు కాకుండా ఇతరులు ఏడుగురి పేర్లు చేర్చారు. వీరి పేరిట సుమారు 15 ఎకరాలు పహణీల్లో చేర్చారు. మండలంలోని ఓ నాయకుడి చొరవతోనే బినామీలు పేర్లు చేర్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పహణీల్లో పేర్లున్న బినామీల వద్ద భూమికి సంబంధించి ఆధారాలు లేకపోగా.. వారికి ఆ భూమి ఎక్కడ ఉందో గుర్తించలేని పరిస్థితి ఉందని కలిగోట గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎకరానికి రూ.6.75 లక్షలు పరిహారం వస్తుందని తెలిసి మండలంలోని సదరు నాయకుడు 15 ఎకరాల్లో బినామీల పేర్లు రాయించారని, కోటి రూపాయల పరిహారం కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హక్కులున్న వారికే పరిహారం సూరమ్మ రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇస్తాం. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి సాగుచేసుకుంటున్న రైతుల్లో భూమి హక్కులున్న వారికే పరిహారం అందజేస్తాం. బినామీలకు పరిహారం ఇవ్వబోం. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. – మధు, తహసీల్దార్, కథలాపూర్ -
బినామీల అడ్డాలు!
నివ్వెరపోతున్న అధికారులు ► విచారణలో తేలుతున్న నిజాలు ► ఇందిరమ్మ కాలనీల్లో సిత్రాలు కోరుట్ల: ఇందిరమ్మ కాలనీల్లో జరిగిన అక్రమాలు రెవెన్యూ అధికారుల విచారణతో వెలుగులోకి వస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా బినామీలు..అనర్హులు కాలనీల్లో అడ్డాలు వేసిన వైనం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరుస్తోంది. కాలనీల్లో నిజమైన లబ్దిదారులు పదిశాతం కనిపించకపోవడంతో జోరుగా అక్రమాలు సాగినట్లు స్పష్టమవుతోంది. కోరుట్ల పట్టణంలో ఏడు సంవత్సరాల క్రితం పేదలకు కెటాయించిన ఇందిరమ్మ కాలనీల్లో రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎక్కడిక్కడే బినామీలు ఉండటం గమనార్హం. నేతలే సూత్రధారులు.. కోరుట్ల పట్టణంలోని అర్బన్కాలనీ, ఏసుకోనిగుట్ట కాలనీ, నక్కలగుట్ట కాలనీ, అల్లమయ్యగుట్ట కాలనీ, మాదాపూర్ కాలనీల్లో ఏడు సంవత్సరాల క్రితం సుమారు 3వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి హౌసింగ్ రుణాలు ఇచ్చి ఇండ్లు కట్టించింది. ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పంపిణీ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు..ప్రజాప్రతినిధులు జోరుగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది నేతలు బినామీల పేరిట ఐదు నుంచి పది పట్టాలు పొంది తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి హౌసింగ్ లోన్లు పొందారు. ఇండ్లు కట్టిన అనంతరం వాటిని రూ.5 నుంచి 15లక్షలకు ఇతరులకు అమ్ముకున్నారు. వందలాది ఇళ్లు కోరుట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటైన కాలనీల్లో బినామీలు లబ్దిపొందారు. కొంత మంది అనర్హులకు పట్టాలు అందడంతో వారు ఇండ్లు కట్టి ఇతరులకు అద్దెకు ఇచ్చిన వైనం విచారణలో వెలుగుచూస్తోంది. జాడలేని లబ్ధిదారులు.. ఇందిరమ్మ కాలనీల ఏర్పాటు సమయంలో లబ్ధిపొందిన వారిలో చాలా మంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రెవెన్యూ అధికారులు సాగిస్తున్న విచారణలో అర్బన్ కాలనీలో 90 ఇళ్లలో సర్వే చేయగా కేవలం 22 మంది మాత్రమే నిజమైన పట్టాదారులు ఉన్నారు. మాదాపూర్ కాలనీలో 94 ఇళ్ల సర్వే జరగగా..16 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. ఏసుకోని గుట్ట కాలనీలో 50 ఇళ్ల సర్వే ముగియగా కేవలం 14 మంది మాత్రమే లబ్దిదారులు ఉన్నారు. ఈ మూడు కాలనీల్లో ఇప్పటి వరకు 234 ఇండ్ల సర్వే పూర్తి కాగా కేవలం 52 మంది మాత్రమే నిజమైన లబ్ధిదారులుగా తేలారు. మిగిలిన ఇళ్లలో అద్దెకు ఉన్నవారు..ఇళ్లు కొనుగోలు చేసిన వారు ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇంకా పట్టణంలోని వివిధ కాలనీల్లో సుమారు 2500 ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చెందిన విచారణ సాగాల్సి ఉంది. -
పేదల పరేషాన్..!
సాక్షి, సిటీ బ్యూరో: మహానగరంలో కొందరు బడాబాబులకు తెలిసోతెలియకో ‘బినామీ’గా ఉన్నందుకు ఇప్పుడు పేదల పాలిట శాపంగా మారింది. సొంత ఆస్తులు, వ్యాపారాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం ఆహార భద్రత (రేషన్)పై వేటు వేసింది. పౌరసర ఫరాల శాఖ ఆధార్ అనుసంధానంతో సొంత ఆస్తులు, వాహనాలు, వ్యాపారాలు ఉన్న సుమారు 1.02 లక్షల కార్డులను ఏరివేసింది. మొత్తం మీద 3.50 లక్షల మంది లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల కోటా రద్దు చేసింది. ఇవీరిలో సగానికి పైగా నిరుపేద కుటుంబాలు ఉండడం గమనార్హం. కార్డులు రద్దయినట్టు తెలుసుకొని నిరుపేదలు గగ్గోలు పెడుతూ సర్కిల్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఆధార డేటాతో ఆస్తుల గుర్తింపు.. బహుళ ప్రయోజనకారి ఆధార్ను కుటుంబంలో ఏ ఒక్కరు దుర్వినియోగం చేసినా ఆ ప్రభావం మొత్తం కుటుంబంపై పడి కార్డు రద్దయింది. ఇతరులకు బినామీగా వ్యవహరించేందుకు కార్డును వినియోగించడం దెబ్బతీసినట్లయింది. మరోవైపు ఉపాధి కోసం ఫైనాన్స్పై నాలుగు చక్రాల పెద్ద వాహనాలు కొనుగోలు చేసిన కుటుంబాలు సైతం.. సంపన్నుల జాబితాలో చేరిపోయారు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖ బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా గత నెలలో అనర్హులపై దృష్టి సారించింది. సొంత ఇళ్లు, వ్యాపారాలు, వాహనాలు ఉన్నవారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, వాణిజ్య పన్నుల తదితర శాఖల నుంచి వివరాలను సేకరించింది. వాటిని ఈ–పీడీఎస్తో అనుసంధానం చేసి కార్డులను తొలగించింది. ఆధార్ డేటా ఆధారంగా సంపన్నులతో పాటు పేదలపై సైతం వేటు పడింది. మొత్తం 1.02 లక్షల కార్డులు రద్దు కాగా, అందులో సుమారు 50 వేలకు పైగా పేదలవే కావడం గమనార్హం. అవాక్కవుతున్నారు.. కార్డు రద్దయ్యాక.. తమకు అస్తులు, వాహనాలు ఉన్నట్లు బయట పడుతుండటంతో పేదలు అవాక్కవుతున్నారు. సర్కిల్ కార్యాలయాలకు వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉపాధి కోసం వాహనాలను కొనుగోలు చేశామని, ఫైనాన్స్ చెల్లించకపోవడంతో వారు తీసుకెళ్లినట్టు కొందరు పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం చేసేదిలేదని చేతులెత్తేస్తున్నారు. హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిస్థితి ఇలా... నెల కార్డుల సంఖ్య యూనిట్లు ఆగస్టు 7,25,079 25,93,504 సెప్టెంబర్ 6,22,677 22,42,695 కోత 1,02,402 3,50,809 -
అక్రమాలపై విచారణ
► మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ►ఆర్డీవో నేతృత్వంలో 13 బృందాలు ► ఇంటింటికీ తిరుగుతున్న అధికారులు ► కలెక్టర్కు సర్వే నివేదిక గంభీరావుపేట : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి ఫిర్యాదులపై అధికారులు కదిలారు. మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్లు బిల్లులు కాజేయడం, బినామీల పేరిట స్వాహా చేశారనే విషయం పత్రికల్లో రావడం... తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించి వెంటనే విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు అధికారులు రీ సర్వే మొదలెట్టారు. గంభీరావుపేట పంచాయతీ పరధిలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ నేతృత్వంలో 40 మంది అధికారులు 13 బృందాలుగా విడిపోయి గ్రామంలో సోమవారం సర్వే చేపట్టారు. ఆర్డీవో బిక్షానాయక్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజ్కుమార్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారు. మిగిలిన అధికార బృందాలు కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరుగుదొడ్డి నిర్మాణ ప్రగతిని పరిశీలించి, బిల్లుల చెల్లింపు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. గంభీరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్లో భాగంగా 834 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. 263 మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని, లబ్ధిదారుల జాబితాలో బినామీ పేర్లు చే ర్చి బిల్లులు స్వాహా చేశారని, గతంలో ఈజీఎస్లో నిర్మించిన మరుగుదొడ్లను కూడా స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల జాబితాలో చేర్చి నిధులు కాజేశారని పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది. గంభీరావుపేట గల్లీగల్లీలో అధికారులు తిరుగుతున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేటలో ఈ మరుగుదొడ్లపై అవినీతి, ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి కేటీఆర్ అధికారులపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. సమగ్ర సర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, గంభీరావుపేట గ్రామంలో ఏ వాడకెళ్లినా అధికారులే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా మరుగుదొడ్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అధికారులు సర్వే నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు సమాచారం. అధికారుల రీసర్వేతో మిగిలిన గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. -
హత్యా రాజకీయాల చరిత్ర మీది
► మనుషులకు కొమ్ములుంటాయా? జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే.. ► బినామీల పేరిట భూములు కొన్న మీ మంత్రులు, ఎంపీలు ఎవరో నీవే చెప్పాలి ► పయ్యావుల కేశవ్ పై వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం అనంతపురం : ‘వైఎస్ జగన్కేమైనా కొమ్ములున్నాయా? అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు, మనుసులకు ఎక్కడైనా కొమ్ములుంటాయా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేశవ్కు లేదన్నారు. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ‘సాక్షి’లో కథనాలు వస్తే తమ అధినేత స్పందించాలంటున్నారని, మరి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తే సీఎం చంద్రబాబు స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు. భూస్వాముల కుటుంబం అని చెప్పుకుంటున్న కేశవ్ చరిత్ర ఉరవకొండ నియోజకవర్గంలో అందరికీ తెలుసన్నారు. హత్యా రాజకీయాలను నడిపిన కుటుంబం మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఎకరాల భూమి కోసం ఓ సాధారణ బీసీ మహిళను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజల తెలియందా? ఆమె భర్తను హతమార్చిన కేసులో మీ సోదరుడు శీనప్ప లేడా? అని ప్రశ్నించారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో దళిత, పేద రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదని భయపెట్టి తక్కువ ధరలకే కొట్టేశారన్నారు. రాజధాని ముమ్మాటికీ ఓ పెద్ద స్కాం అన్నారు. ఔటర్ రింగు రోడ్డుకు స్థల సేకరణ విషయంలో ఆరోపణలు వస్తే సీబీఐతో విచారణ చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికి దక్కిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కూడా ఆరోపణలపై సశ్ఛీలతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తాను మగాడిలా భూములు కొనుగోలు చేశానని చెబుతున్న కేశవ్... బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆ పార్టీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరో ఆయనే చెప్పాలన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు బీ.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి జిల్లాలో వందల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. యితే వాటిని ఎవరూ తప్పుబట్టడం లేదు.. మీ నాయకులు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నామని అన్నారు. ఒకటి మాట్లాడితే మరొకటి సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement