-
Berlin: గంజాయి సాగు.. జర్మనీ పార్లమెంట్ కీలక నిర్ణయం
బెర్లిన్: ప్రతిపక్షపార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండటాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్ తాజాగా బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తోంది’అని పేర్కొన్నారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. ఇదీ చదవండి.. కిమ్కు పుతిన్ గిఫ్ట్.. కారు కంపెనీపై అమెరికా కొరడా -
మరాఠాల రిజర్వేషన్కు ఓకే
ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్య, సామాజిక వెనుకబాటు బిల్లు–2024ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే ప్రవేశపెట్టారు. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10 శాతం రిజర్వేషన్ను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. ‘‘రాష్ట్రంలో భిన్న కులాలు, వర్గాలకు ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులోనే ఓబీసీలకు19 శాతం రిజర్వేషన్ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50 శాతం మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని బిల్లులో పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్లో 64 శాతం, బిహార్లో 69 శాతం, గుజరాత్లో 59 శాతం, పశ్చిమబెంగాల్లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్ ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంబీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్తసంబందీలకు మాత్రమే కుంబీ కుల ధ్రుజీవీకరణ పత్రమిస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. విడిగా కోటా వద్దు: జరాంగే మరాఠాలకు విడిగా కాకుండా ఓబీసీ రిజర్వేషన్లలోనే కోటా కావాలని ఉద్యమనేత మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. -
మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ముంబై: మరాఠా రిజర్వేషన్ బిల్లకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజికవర్గానికి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించే బిల్లు-2024 అమలులోకి వస్తే.. దశాబ్దం తర్వాత సమీక్షించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. ‘సుమారు 2.5 కోట్ల మంది మరాఠాలపై సర్వే జరిపించాం. మరాఠా రిజర్వేషన్ బిల్లు కోసమే నేడు(మంగళవారం) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్ట ప్రకారం మరాఠా రిజర్వేషన్ కల్పిస్తాం’ అని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. మరోవైపు.. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబూ అజ్మీ.. రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ముస్లింల కూడా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయటం గమనార్హం. చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? -
సీఈసీ, ఈసీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిల్లును తెచ్చామని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ చెప్పారు. ‘‘1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవు. తాజా బిల్లులో వాటిని పొందుపరిచాం. సీఈసీ, ఈసీ నియామకాలను ఇప్పటిదాకా ప్రభుత్వమే చేపట్టేది. ఇకపై వాటిని ప్రత్యేక కమిటీ చూసుకుంటుంది. వారి వేతనాలు తదితరాలను బిల్లులో పొందుపరిచాం. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణలను కల్పించాం’అని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం బిల్లులోని అంశాలు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రధాని, ఆయన నామినేట్ చేసే సభ్యులు సీఈసీ, ఈసీలను నియమించడమంటే ఎన్నికల సంఘాన్ని నామమాత్రంగా మార్చడమేనని రణదీప్ సూర్జేవాలా (కాంగ్రెస్) అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో చేర్చకపోవడమేమిటని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నించారు. సీఈసీ, ఈసీల హోదాను కేబినెట్ సెక్రటరీ స్థాయికి కేంద్రం దిగజార్చిందని జవహర్ సర్కార్ (టీఎంసీ) మండిపడ్డారు. బీజేడీ, డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
బిల్లు ఆమోదం.. కాంట్రాక్టు ఉద్యోగుల సంబరాలు..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement