-
బీజేపీని ఓడిద్దాం
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల్ని అరాచక శక్తులుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ గడ్డ వారిని సహించలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ఆదివారం యూపీలోని ముజఫర్నగర్లో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన మహా పంచాయత్కు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ‘దేశాన్ని కాపాడుకుందాం’ అన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా సదస్సుకి ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 300 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. బస్సులు, కారులు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో వేలాది మంది రైతులు రావడంతో నగర వీధులు, ఫ్లై ఓవర్లు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో మహిళా రైతులు కూడా వచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ఓట్లు కూడా రాలవని తికాయత్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే తమ నినాదమని స్పష్టం చేశారు. ఇండియా ఫర్ సేల్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని అదే ప్రభుత్వ విధానమని మహాపంచాయత్ వేదికగా రాకేశ్ తికాయత్ ఆరోపించారు. రైల్వేలు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, విద్యుత్, రోడ్లు, బ్యాంకులు ఇలా అన్నింటిని అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. సేల్ ఆఫ్ ఇండియా బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారని అంబానీ, అదానీలే వాటిని కొనుగోలు చేస్తారని ఆరోపించారు. ‘‘మనం ఈ దేశాన్ని అమ్మకుండా అడ్డుకోవాలి. రైతులు, ఉద్యోగులు, యువత, వ్యాపారాలు ఇలా అన్నింటిని కాపాడు కోవాలి. అందుకే మహాపంచాయత్ ర్యాలీలు చేస్తున్నాం’’ అని తికాయత్ చెప్పారు. ‘‘9 నెలలుగా మేం ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం చర్చించడానికి ముందుకు రావడం లేదు. ఉద్యమం సమయంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం మౌనం పాటించలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదు’’ అని తికాయత్ చెప్పారు. ప్రధానే లక్ష్యం: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేస్తామని కిసాన్ మహాపంచాయత్ ప్రకటించింది. నేరుగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. వారణాసి వేదికగా ముజఫర్నగర్లో జరిగిన మెగా సదస్సుని మిషన్ ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్గా రైతు సదస్సు అభివర్ణించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మహాపంచాయత్లు నిర్వహిస్తామన్న రాకేశ్ తికాయత్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి రెండో ప్రధాని కార్యాలయం వంటిదని తదుపరి సదస్సు అక్కడే జరుపుతామన్నారు. లక్నోలో సదస్సు నిర్వహించి రైతుల సత్తా చాటుతామన్నారు. -
రైతులతో మళ్లీ చర్చలకు సిద్ధం
న్యూఢిల్లీ/చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ శనివారం ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఆందోళనలను విరమించాలని రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచడంతోపాటు ఎంఎస్పీ ప్రకారం పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరిపిందని చెప్పారు. కాగా, మంత్రి తోమర్ పిలుపుపై 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పందించింది. ఆ ప్రకటనలు అస్పష్టంగాను, పరస్పర విరుద్ధంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. వివాదాస్పద చట్టాలకు అర్థంలేని సవరణలు చేపట్టాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది నవంబర్ నుంచి వివిధ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయా చట్టాల్లోని వివాదాస్పద అంశాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 22వ తేదీ నాటికి 11 విడతలుగా జరిగిన చర్చలుæ పురోగతి సాధించలేకపోయాయి. ఆందోళనలు 8వ నెలకు చేరుకున్న సందర్భంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రైతులు గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ నేతృత్వంలో ఈశాన్య ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)ను కలిసేందుకు బయలుదేరగా పోలీసులు వారిని వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలను విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తేల్చిచెప్పారు. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. చండీగఢ్–మొహాలీ సరిహద్దుల్లో ఉన్న బారికేడ్లను తొలగించుకుని రైతులు ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి, అడ్డుకున్నారు. -
ఎగవేతకే ఈ ఎత్తులు
‘మిమ్మల్ని రుణగ్రహణం నుంచి విముక్తుల్ని చేస్తా.. నన్ను గెలిపించండి’- టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో రైతులకు చేసిన అభ్యర్థన అది! రుణమాఫీ చుట్టూ ఎన్నో పరిమితులు, షరతులు, వీలైనంత మందిని అనర్హులను చేసే ఎత్తులు, జిత్తులు.. అదే బాబు అధికారం దక్కాక రైతులకు చేస్తున్న వంచన ఇది! అమలాపురం టౌన్ / రాయవరం : రుణమాఫీ అమలుకు జారీ చేసిన జీఓ :174 లోపాలమయమని డీసీసీబీ డెరైక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు లేనిపోని నిబంధనలు పెట్టి, రైతులను మభ్యపుచ్చజూస్తోందని ఆరోపించారు. లోపాలను సరిదిద్దడమే కాక జీఓను పూర్తిస్థాయిలో సవరించాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో రుణమాఫీ నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించి, జీఓకు చేయాల్సిన సవరణలను ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే ఇందు కోసం మరో ఉద్యమానికి దిగాలని నిర్ణయించారు. కాగా రాయవరం డీసీసీబీ బ్రాంచి వద్ద దాని పరిధిలోని 9 సహకార సంఘాల అధ్యక్షులు రుణమాఫీ జీఓపై నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచిలో కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నారు. డీసీసీబీ డెరైక్టర్ గోదాశి నాగేశ్వరరావు అధ్యక్షతన అమలాపురంలో జరిగిన సమావేశంలో మరో ఆరుగురు డీసీసీబీ డెరైక్టర్లు అడబాల నాగేశ్వరరావు, జవ్వాది బుజ్జి, బొంతు జవహర్, చెలువూరి రామకృష్ణరాజు, పాముల విజయరంగారావు, విళ్ల గోపాలకృష్ణ, దంగేటి దొరబాబు, కోనసీమలోని 116 సహకార సంఘాల అధ్యక్షులు, బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెడబొట్టు రాంబాబు, కార్యదర్శి ముత్యాల జమి, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందరావు, భారతీయ ఆగ్రో ఎకనమిక్ రీసెర్చ్ డెరైక్టర్ తిక్కిరెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. షరతులు లేని రుణమాఫీని అమలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. బీమా సొమ్మును ప్రభుత్వం జమ చేసుకోవడం సరికాదని, రైతులకే అందజేయాలని, 2014 డిసెంబరు 31లోపు తీసుకున్న రుణాలకే మాఫీ అన్న నిబంధనను రద్దు చేసి 2014 మార్చి 31లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని, ఆధార్కార్డులు, రేషన్కార్డులు, ఓటర్కార్డులు తదితర నిబంధనలను ఎత్తి వేయాలని, 2014 జనవరి 1 నుంచి మార్చి 31 లోపు రుణాలు తిరిగి చెల్లించిన రైతులకు కూడా మాఫీ వర్తించేలా జీఓను సవరించాలని కోరారు. 27 నుంచి నిరసనలు.. జీఓ :174ను సవరించాలన్న డిమాండ్తో బీకేఎస్ ఈనెల 27న అమలాపురంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయనుంది. డీసీసీబీ డెరైక్టర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, సమితి నాయకులు, రైతుల సహకారంతో డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాల ముట్టడి, ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. తహశీల్దారు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే డీసీసీబీ బ్రాంచ్ల వారీ సహకార సంఘాల అధ్యక్షులు రిలే దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను, కోనసీమలోని ఎమ్మెల్యేలను రైతు ప్రతినిధులు కలిసి జీఓ సవరణ ఆవశ్యకతను వివరించాలని నిర్ణయించారు. టీడీపీ నేతతో రైతుల వాగ్వాదం సమావేశం ప్రశాంత వాతావరణంలో సాగినా ఒకదశలో భిన్నాభిప్రాయాలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బీకేఎస్ నాయకులు జీఓ:174 ను పూర్తిగా రద్దు చేయాలనగా, సహకార సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు జీఓను సవరించాలనడంతో ఓ దశలో కాస్త గందరగోళం నెలకొంది. టీడీపీ నేత, కోనసీమ రౌతు పరిరక్షణ సమితి నాయకుడు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడబోగా రైతులు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయరామారావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ముఖ్య నాయకులు రంబాల బోసు, జగతా జానకీరామయ్య, వాసంశెట్టి సత్యం, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బోనం నాగేశ్వరరావు, గణేశుల రాంబాబు, అడబాల పెదమూలస్వామినాయుడు తదితరులు ప్రసంగించారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది.. షరతులు లేని రుణమాఫీని అమలు చేయాలని రాయవరం డీసీసీబీ బ్రాంచి పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. శుక్రవారం తొమ్మిది సొసైటీల అధ్యక్షులు బ్రాంచి వద్ద నిరసనకు దిగి, కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని బయటకు తీసుకు వచ్చి బ్రాంచికి తాళాలు వేయించారు. జీఓ:174కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సహకార సంఘాల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు వట్టికూటి సోమశేఖరరావు, వైట్ల రాంబాబు మాట్లాడుతూ జీఓ :174 లోపభూయిష్టమన్నారు. అది అమలైతే రాయవరం డీసీసీబీ బ్రాంచి పరిధిలో సుమారు నాలుగు వేల మంది రైతులకు రూ.12 కోట్ల మేర రుణం మాఫీ కాదన్నారు. జీఓలో మార్పులు చేసే వరకూ సొసైటీ కార్యకలాపాలను నిలుపుదల చేస్తున్నామని, ప్రభుత్వం అడిగే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వబోమని అన్నారు. సక్రమంగా రుణం చెల్లించిన వారికి కాక చెల్లించని వారికే ప్రయోజనం చేకూర్చేలా ఉన్న జీఓ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. సోమేశ్వరం, వెదురుపాక, మాచవరం, పులుగుర్త, కుతుకులూరు, కొమరిపాలెం, ఊలపల్లి, కొంకుదురు, పందలపాక సొసైటీల అధ్యక్షులు వైట్ల రాంబాబు, సత్తి వీర్రాఘవరెడ్డి(వీరవెంకట), సత్తి ఈశ్వరరెడ్డి, వట్టికూటి సోమశేఖరరావు, పులగం తిరుమలతిరుపతి వెంకటేశ్వరరెడ్డి, తాడి అరవిందం, గండ్రాల విజయచంద్రశేఖరరెడ్డి, కర్రి సూరారెడ్డి, పడాల సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement