-
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
Ind Vs Aus: పూర్తిగా అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! నా వల్ల కాదు!
India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపు.. మూడో మ్యాచ్లో కోహ్లి సేన ఘన విజయం.. ఇంకొక్క అడుగు పడితే.. ట్రోఫీ గెలిచే అవకాశం.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 9 వికెట్లతో చెలరేగి కంగారూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాపై భారీ అంచనాలు. సిడ్నీలోనూ సత్తా చాటుతాడని అభిమానుల ఆశలు.. అయితే, పిచ్ మాత్రం పేసర్లకు మరీ అంత అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా కంగారు పడ్డాడు. వెంటనే బౌలింగ్ కోచ్ దగ్గరికి వెళ్లి కాస్త మొహమాటపడుతూనే తన మనసులో మాట బయటపెట్టాడు. అలసిపోయాను సర్.. నా వల్ల కాదు ‘‘సర్.. వికెట్ అనుకున్న విధంగా లేదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు చేయగలిగిందేమీ లేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ బలహీనం అయిపోయాను. ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ. పిచ్ మరీ డల్గా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నన్నేం చేయమంటారు సర్? కాస్త నెమ్మదిగా బౌలింగ్ చేయనా? నాకు ఏది సరైంది అనిపిస్తే అలాగే చేయమంటారా?’’ అని భరత్ అరుణ్ని అడిగాడు. ఎవరేం చెప్పినా ఓపికగా వినే భరత్ అరుణ్.. బుమ్రా మాటలను ఆసాంతం విన్నాడు. అయితే, తనేం చెప్పదలచుకున్నాడో పూర్తిగా అర్థమయ్యాక.. బుమ్రాను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్ చేసేందుకు సమ్మతించాడు. స్పిన్నర్ల విజృంభణ బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. పేసర్ షమీకి రెండు, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కగా.. బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్కు 4 వికెట్లు దక్కాయి. టీమిండియా మాజీ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్ ఈ మేరకు బుమ్రా- భరత్ మధ్య జరిగిన సంభాషణ గురించి తన పుస్తకం.. ‘‘కోచింగ్ బియాండ్’లో ప్రస్తావించాడు. ముందు మ్యాచ్లో అత్యద్భుతంగా ఆడిన బుమ్రా.. మరుసటి మ్యాచ్లో ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యాడో వివరించాడు. సత్తా చాటిన బుమ్రా.. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో.. కాగా నాటి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నుంచి జట్టుకు దూరమైన భారత పేసు గుర్రం బుమ్రా ఇంతవరకు పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులోకి రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు. స్వదేశంలో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు సైతం బుమ్రా దూరం కావడంతో అతడి ఫిట్నెస్పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్లో) ఘనత సాధించాడు. చదవండి: Women T20 WC: 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్కు 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
"భారత్ను నెం1గా నిలపాలని కష్టపడ్డాడు.. మరో రెండేళ్లు కెప్టెన్గా ఉండాల్సింది"
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్గా విరాట్ నిలిచాడు. కోహ్లి సారథిగా 68 టెస్ట్ల్లో టీమిండియా 40 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే కోహ్లి ఇంకా కొన్ని సంవత్సరాలు కెప్టెన్గా కొనసాగింటే బాగుండేదని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయం తనను షాక్కు గురి చేసింది అని భరత్ అరుణ్ తెలిపాడు. కోహ్లి జట్టును నడిపించడానికి ఎంతో ఇష్టంగా ఉండేవాడని అతడు పేర్కొన్నాడు. విరాట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోన్నాడు అన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. మాతో మాట్లాడే ప్రతిసారీ జట్టును లీడ్ చేయడంపై కోహ్లి చాలా మక్కువ చూపేవాడు. టీమిండియాను ప్రపంచంలో నెం1 జట్టుగా నిలపాలని అతడు నిరంతరం కష్టపడేవాడు. భారత జట్టుకు అద్భుతమైన పునాదిని వేసి తన బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. విరాట్ భారత జట్టు టెస్ట్ కెప్టెన్గా మరో రెండేళ్లు కొనసాగింటే బాగుండేది. కెప్టెన్ అంఏ ఎంస్ ధోనిలా కూల్గా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పడే ఫీల్డ్లో అధ్బుతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా! -
IPL 2022: కేకేఆర్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్..
Bharat Arun Appointed As KKR Bowling Coach: టీమిండియా మాజీ ఆటగాడు, జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.. కోల్కతా నైట్రైడర్స్ జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. కైల్ మిల్స్ స్థానంలో కేకేఆర్ బౌలింగ్ కోచ్గా అరుణ్ను ఎంపిక చేసినట్లు ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు. అరుణ్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని వెంకీ పేర్కొన్నాడు. అరుణ్ నియామకాన్ని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ స్వాగతించాడు. కాగా, రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న సమయంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని హయాంలో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ పేసర్లు అరుణ్ కోచింగ్లో రాటు దేలారు. 59 ఏళ్ల అరుణ్ టీమిండియా తరఫున రెండు టెస్ట్లు, నాలుగు వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో ఇయాన్ సారధ్యంలోని కేకేఆర్ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్కి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సీఎస్కే చేతుల్లో చతికిలబడడంతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మరోవైపు ఐపీఎల్ 2022 రిటెన్షన్లో విండీస్ యోధుడు ఆండ్రీ రస్సెల్, టీమిండియా యువ సంచలనం వెంకటేశ్ అయ్యర్, విండీస్ ఆల్రౌండర్ సునీల్ నరైన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకున్న కేకేఆర్.. జట్టు కెప్టెన్ మోర్గాన్, కీలక ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, పాట్ కమిన్స్లను వేలానికి వదిలేసింది. చదవండి: ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే! -
కరోనా బారిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
లండన్: లండన్లో ఉన్న భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్లు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Health: మెనోపాజ్ వల్ల హార్మోన్స్ సమస్యా? అయితే ఇలా చేయండి!
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement