-
ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. తక్కువ బరువుతోపుట్టిన శిశువు మరణించిందని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. అయితే శిశువు ఖననం చేయబడటానికి తీసుకెళ్లినపుడు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బదర్పూర్కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఆదివారం ఉదయం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించి తండ్రి రోహిత్ కు అప్పగించారు. అయితే ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. దీంతో పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా, పాప చిన్నగా ఏడ్వడాన్ని రోహిత్ సోదరి గమనించింది. వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేసింది. ప్యాప్ విప్పి చూశారు. పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే పీసీఆర్ చికిత్స అందింని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ల బాధ్యతారాహిత్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. డబ్ల్యుహెచ్వో మార్గదర్శకాల ప్రకారం 22 వారాల ముందు జన్మించిన శిశువులు 500 గ్రా. బరువుతో పుడతారని దాదాపు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ డెలివరీ శిశువులను చనిపోయినట్లు ప్రకటించటానికి ముందు కనీసం సుమారు ఒక గంట పాటు పరిశీలనలో ఉంచాలని మరో డాక్టర్ చెప్పారు. -
పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు. తొలిసారి సమగ్ర మూల్యాంకనం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు. టెన్త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు. -
భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది. గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది. -
అధికారుల ముందే బియ్యం మాయం
నిజామాబాద్ అర్బన్: విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో ఆటోనగర్లోని ఖలీల్వాడి పాఠశాలలో అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా నమోదు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పక్కదారి పడుతుండడం, టీచర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా సాధారణ సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు తేలింది. ఈ పాఠశాలను డీఈవో లింగయ్య శనివారం తనిఖీ చేయవగా, టీచర్ల గైర్హాజరుతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరపాలని డిప్యూటీ డీఈవో కృష్ణారావు, ఎంఈవోలను సోమవారం విచారణకు పంపించారు. వారు పాఠశాలలో ఉండగానే, హెచ్ఎం ఆటోలో ఏడు సంచుల బియ్యాన్ని అక్కడి నుంచి తరలించారు. దీన్ని గమనించిన ఎంఈవో హెచ్ఎంను నిలదీసి, డీఈవోకు సమాచారమిచ్చారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, బియ్యం నిల్వలను లెక్కించారు. అదనంగా నాలుగున్నర క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే, పాఠశాలలో కాకుండా మరోచోట కూడా మధ్యాహ్న భోజనం వాడుతున్నామని, బియ్యం సంచులు ఇక్కడ ఉంచినట్లు ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు. మరోచోట 100–150 మంది విద్యార్థుల పేర్లు నమోదు చేసి, అదనపు బియ్యం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. తరలించిన బియ్యాన్ని తెచ్చి, సీజ్ చేశారు. ఇక, 10 మంది టీచర్లు అదనంగా సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు గుర్తించారు. మరోవైపు 2014–15కు సంబంధించిన రిజిస్టర్ లేకపోవడంపై డిప్యూటీ డీఈవో మండిపడ్డారు. హెచ్ఎం బియ్యాన్ని తీసుకెళ్లమన్నాడని ఏజెన్సీ నిర్వాహకుడు సమీర్ అధికారులకు వివరించాడు. పాఠశాలలో అనేక లోపాలు గుర్తించామని, నివేదికను డీఈవోకు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట టీడీపీ ధర్నా
ఖమ్మం అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముందుగా, పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా ధర్నా చౌక్కు చేరుకున్నారు. ధర్నాలో ముఖ్య అతి«థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి సావిత్రి (సీతక్క) పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వ అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 123 జీఓను హైకోర్టు కొట్టివేయడంపై పై కోర్టుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడాన్నిబట్టి.. ౖరైతులపై ఆయనకుగల ప్రేమ ఏపాటితో తేటతెల్లమైందని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సగం గడిచినప్పటికి కూడా రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని అన్నారు. ఎంసెట్–2 లీకేజీలో కేసీఆర్ సమీప బంధువుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ టీఆర్ఎస్ పెద్దలుగానీ, ప్రభుత్వంగానీ స్పందించడం లేదని విమర్శించారు. ధర్నా అనంతర ం జాయింట్ కలెక్టర్కు నాయకులు వినతిపత్రమిచ్చారు. ధర్నాలో పార్టీ ఉపా«ధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, నాయకులు కురపాటి వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, రామనాధం, స్వర్ణకుమారి, భవానిశంకర్, రాందాస్, ఫణీశ్వరమ్మ, వెంకటరామయ్య, అప్పారావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, తాళ్లూరి జీవన్కుమార్, వాకదాని కోటేశ్వరరావు, జట్ల శ్రీను, గొల్లపూడి హరిక్రిష్ణ, సుమంత్, గొడ్డెటి మాధవరావు, భిక్షపతి, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement