-
మాఫీ మాయ
సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): రైతులు చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా నష్టపోయారు. టీడీపీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చినుకు రాలక ఎండిన చెరువులు, బోరుబావులతో కరువు పరిస్థితులు దాపురించి సాగు చేసిన పంటలు చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే చేస్తామన్నారు. ఈ నగదును కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము ఇస్తారేమోనని రైతులు ఇప్పటి వరకు ఎదురు చూసినా చంద్రబాబు తీరుతో వారికి నిరాశే మిగిలింది. జిల్లాలో రైతుల పరిస్థితి... వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాటమార్చి రుణమాఫీ పరిధిని రూ.1.50 లక్షల వరకు కుదించారు. వీటిని కూడా ఒకే సారి కాకుండా ఐదు విడతలో అందజేస్తామని బీరాలు పలికారు. కానీ చెప్పిన విధంగా తన ఐదేళ్ల పాలనలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతన్న నడ్డివిరిచారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,56,318 మంది రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ వర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాల్లోని అర్హత పొందిన 3,71,484 మంది ఖాతాలకు మూడు విడతల్లో నగదు జమ చేశారు. పొన్నలూరు మండలంలో రుణమాఫీకి అర్హత పొందిన రైతులు సుమారుగా 9058 మంది ఉన్నారు. వీరందరికీ వారు తీసుకున్న బ్యాంకు రుణాల అర్హతను బట్టి రూ.44 కోట్లను ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే గత ఐదేళ్లుగా ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.26 కోట్ల రుణమాఫీ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయినా ఇంకా సుమారుగా రూ.18 కోట్లు మండలంలోని రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నగదును నాలుగు, ఐదు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు మిగిలిన రుణమాఫీ నగదును రైతుల ఖాతాలకు జమచేయలేదు. అప్పుల ఊబిలో అన్నదాత మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికినా నేటికీ ఎలాంటి తోడ్పాటు కల్పించలేదు. పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ లాంటి సాయం ప్రభుత్వం నుంచి సక్రమంగా అందలేదు. దీంతో ప్రభుత్వ సాయంతో పాటు అనుకున్న స్థాయిలో పంటల దిగుబడులు, మద్దతు ధర లేకపోవడం వలన రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. అలాగే పండిన పంటకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కనీసం బీమా డబ్బులు వస్తే కొంత వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను చంద్రబాబు నీరుగార్చారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరిత వాగ్దానాలు, మాయ మాటలు చెబుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు వలన నష్టపోయిన పంటలకు రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించినా, ఈ ఐదేళ్ల కాలంలో బీమా చెల్లించకుండా కాలయాపన చేసింది. గ్రామాల్లో రైతులు సాగుచేసి ఎండిపోయిన పంటలను పరిశీలించి సంబంధిత వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నివేదికగా తయారుచేసి ప్రభుత్వానికి పంపించనా బీమా ఊసేలేదు. బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని తొంగలో తొక్కి పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. ఈ క్రమంలో బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలని గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు వందల మంది రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అరకొర నగదును రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసినా, ఆ నగదు రైతులు తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదు. ఇటువంటి తరుణంలో చెప్పిన మాటలను అమలు చేయని చంద్రబాబు మళ్లీ ఎన్నికలు రావడంతో జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొడుతూ రైతులను మభ్యపెడుతున్నారు. ఎదురు చూసిన అన్నదాతలు ఇదిలా ఉంటే నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్మును గత ఏడాది డిసెంబర్ నెలలో రైతులకు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ ఏడాది వ్యవసాయ పనులు మొదలై నెలలు గడిచినా రైతులను ఆదుకునేలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నించ లేదు. దీంతో వ్యవసాయ పనులకు పెట్టుబడి డబ్బులు లేక రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. రుణమాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమకాకపోవడంతో గత్యంతరం లేక బయట అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు. వర్షాభావ పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వలన సాగు చేసిన పంటలు చేతికిరాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇటువంటి తరుణంలో కనీసం రానున్న ఎన్నికల ప్రకటనకు ముందన్నా రుణమాఫీ చేస్తే కొంత మేర ఆదుకుంటుందని ఆశపడిన రైతులకు ప్రభుత్వ తీరు వలన నిరాశ మిగిలింది. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో నాలుగో విడత రుణమాఫీ కింద రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి పది శాతం వడ్డీ కలిపితే రూ.34.81 కోట్లు చొప్పున రూ.382.98 కోట్లు అవుతుంది. దీంతో పాటు ఐదో విడత నగదు కూడా రూ.348.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా నాలుగు, ఐదో విడత రుణమాఫీ నగదు కలిపితే రూ.731.15 కోట్లును చంద్రబాబు ప్రభుత్వం అందించాల్సి ఉంది. రైతులను మోసం చేసిన చంద్రబాబు వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకున్నాను. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసి అరకొరగా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం జమ చేసిన రుణం వడ్డీలకు కూడా సరిపోలేదు. అవి కూడా మూడు విడతలు మాత్రమే ఇచ్చారు. నాలుగు, ఐదో విడత సొమ్ము ఇంత వరకు ఇవ్వలేదు. – వరికూటి బ్రహ్మరెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం పెట్టుబడుల కోసం అప్పులు చేశాం చంద్రబాబు రైతులను అన్ని విధాలుగా దగా చేయడం వలన రైతులు పూర్తిగా మోసపోయారు. ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బులు లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేశారు. కనీసం ప్రభుత్వం నాలుగు, ఐదో విడత రుణమాఫీ డబ్బులు చెల్లిస్తే అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. – దావులూరి మాల్యాద్రి, రైతు, విప్పగుంట ప్రభుత్వం ఆదుకోలేదు నేను 15 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పంట ఎండిపోయింది. సుమారుగా ఒక లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. అంతేకాకుండా పంటకు బీమా కూడా చేశాను. ఇంత వరకు బీమా అందలేదు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులను ఏ విషయంలో ఆదుకోలేదు. – శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, రైతు, సుంకిరెడ్డిపాలెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్రామ్ నగర్లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్రామ్ నగర్లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
అప్పుడు కట్టొద్దన్నారు
జంగారెడ్డిగూడెం : డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఆంధ్రాబ్యాంక్ నుంచి 170 మంది మహిళలకు నోటీసులు అందాయి. దీంతో ఆ మహిళలంతా బ్యాంక్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక జగ్జీవన్రామ్ నగర్లో 17 గ్రూపులకు సంబంధించి 170 మందికి బ్యాంక్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, వాటిని అందుకున్న మహిళలంతా బ్యాంక్ వద్దకు చేరుకుని ఇదేం దారుణమంటూ అధికారులను నిలదీశారు. మరణించిన వారినీ వదల్లేదు మృతి చెందిన డ్వాక్రా మహిళల పేరిట కూడా నోటీసులు జారీ అవుతున్నాయి. వర్షిత గ్రూపునకు చెందిన పినెల్లి సావిత్రి ఏడాది క్రితం మరణించింది. సావిత్రి తల్లి ముప్పిడి వీరమ్మ కూలి పనులు చేసుకుంటూ మనుమరాలిని చదివించుకుంటోంది. వర్షిత గ్రూప్లోని సభ్యులంతా కలసి రూ.50 వేలు రుణం తీసుకోగా, రూ. 80వేలు చెల్లించాలని అధికారులు నోటీసు పంపించారు. మృతురాలు సావిత్రికి పిన్నికూతురైన మల్లెల రఘుపతి ఆ నోటీసు తీసుకుని ఆందోళనతో బ్యాంక్కు చేరుకుంది. నడ్డివిరిచే వడ్డీలు జగ్జీవన్రామ్ నగర్లోని పావని గ్రూప్ మహిళలు రూ.1.47 లక్షలను రుణం తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.92 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. ఇదే గ్రూప్ సభ్యులు గృహ రుణం కింద రూ.80 వేలు తీసుకోగా, రూ.2.46 లక్షలు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. భార్గవి గ్రూప్ మహిళలు రూ.లక్ష తీసుకోగా, వడ్డీతో కలిపి రూ.2.87 లక్షలు చెల్లించాలని.. అరుంధతి గ్రూప్ సభ్యులు రూ.1.81 లక్షల రుణం తీసుకోగా, రూ 3.51 లక్షలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించారు. అప్పుడు కట్టొద్దని.. ఇప్పుడు నోటీసులా నోటీసులు అందుకున్న 17 గ్రూపులకు చెందిన 170 మంది మహిళలు బ్యాంక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని నమ్మబలికారని, ఎవరూ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ రుణం చెల్లించవద్దని ఎన్నికల సభల్లో చెప్పారని బాధిత మహిళలంతా గుర్తు చేశారు. ఇప్పుడు అసలుకు రెండింతలు వడ్డీ వేసి తమ నడ్డి విరిగేలా నోటీసులు ఇచ్చి రుణాల వసూళ్లకు తమ ఇళ్లపైకి వస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. రుణం చెల్లించకపోతే తమ ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపారని మహిళలు ధ్వజమెత్తారు. ‘తీసుకున్న రుణాలకు ఎటువంటి వడ్డీలు చెల్లించవద్దన్నారు. అసలుతోపాటు వడ్డీలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు ఆ హామీల విషయం మాకు తెలియదంటున్నారు. రుణం కట్టాల్సిందే అంటున్నారు. ఇదేం ఇరకాటమో అర్థం కావడం లేదు’ అని వాపోయారు. రుణమాఫీ చేయడం చేతకాదని చెబితే తినో, తినకో రుణాలు తీర్చుకునే వాళ్లమని, ఇప్పుడు పెద్దఎత్తున వడ్డీలు వేసి అసలు కంటే రెండు రెట్లు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హామీలు అమలు చేయడమా.. ప్రజలను వంచించడమా అని ప్రశ్నించారు. దారుణంగా మోసగించారు కూలీ నాలీ చేసుకుని బతుకున్నాం. అంతంత వడ్డీలు ఎలా కట్టాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామన్నారని కట్టలేదు. తీరా.. రుణం రద్దుకాకపోగా రూ.1.20 లక్షలు తీసుకుంటే ఇప్పుడు రూ.3 లక్షలు కట్టమని నోటీసులు అందాయి. ఈ మొత్తాన్ని మేం ఎలా కట్టాలి. మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. – బొబ్బర వెంకాయమ్మ, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం అధికారులు బెదిరిస్తున్నారు బ్యాంక్ అధికారులు బెదిరిస్తున్నారు. డ్వాక్రా రుణం చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణం మాఫీ చేస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రూ.లక్ష తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.2.50 లక్షలు అయ్యింది. రోజువారీ పనిచేసుకునే మేం ఇంత సొమ్ము ఎక్కడినుంచి తెచ్చి కట్టాలి. – కొత్తూరు లక్ష్మి, డ్వాక్రా మహిళ, జంగారెడ్డిగూడెం చనిపోయిన వాళ్లకూ నోటీసులు ఇచ్చారు మా పెద్దమ్మ కూతురు పినెల్లి సావిత్రి. ఆమె మృతిచెంది ఏడాదైంది. చనిపోయిన సావిత్రి పేరిట కూడా రుణం కట్టాలని నోటీసులు ఇచ్చారు. మా పెద్దమ్మ ముప్పిడి వీరమ్మ వృద్ధురాలు. కూలి పనులు చేసుకుంటూ సావిత్రి కూతుర్ని చదివిస్తోంది. ఆ వృద్ధురాలు బకాయిల్ని ఎలా చెల్లించగలదు. – మల్లెల రఘుపతి, జంగారెడ్డిగూడెం -
ఆయన మాట.. ముంచె నట్టేట!
డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల బెదిరింపులు ఆస్తులు జప్తు అంటూ బ్యాంకు నోటీసులు బెంబేలెత్తుతున్న డ్వాక్రా మహిళలు వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన ‘సకాలంలో వాయిదాలు కట్టకపోవడం వల్ల మీకు వడ్డీ రాయితీ రాకపోవడంతో పాటు చట్టరీత్యా తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే అవకాశంతో పాటు అర్హత కోల్పోతారు. బాకీ వసూలుకు కోర్టు, పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో మీ ఆస్తులు, సామగ్రి, ఇతర వస్తువులను జప్తు చేస్తాం.’ – డ్వాక్రా రుణాలు చెల్లించాలంటూ మండపేట మండలం తాపేశ్వరంలోని ఐఓబీ ఇచ్చిన నోటీసు సారాంశమిది. – మండపేట డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది నేనేనని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు ఆ సంఘాలను నిండా ముంచారు. రుణమాఫీ జరగక వడ్డీతో కలి పి రుణభారం పెరిగిపోగా, తిరిగి చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. నమ్మి ఓట్లేస్తే, కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే మండలంలోని తాపేశ్వరంలో డ్వాక్రా మహిళలకు కోర్టు ద్వారా బ్యాంకు నోటీసులు జారీ చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. మాట మార్చిన బాబు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, బకాయిలు ఎవరూ చెల్లించనవసరం లేదంటూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం డ్వాక్రా సంఘాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మి ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచీ మహిళలు రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు కావు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తామంటూ మాటమార్చారు. ఆ మొత్తాన్ని మూడు దఫాలుగా పొదుపు ఖాతాలకు జమ చేస్తామనడంతో కంగుతినడం మహిళల వంతైంది. వారి అప్పులపై వడ్డీ భారం పెరిగిపోయింది. బ్యాంకుల వేధింపులు జిల్లావ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో సుమారు 18 వేల గ్రూపులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 77,800 సంఘాలున్నాయి. అధిక శాతం సంఘాలు వడ్డీ రాయితీకి దూరమయ్యాయి. పాత బకాయిలు పేరుకుపోయాయంటూ కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపుతుండటంతో, రుణ లక్ష్యాలను చేరుకోవడం గగనంగా మారింది. పొదుపు ఖాతాల్లోని సొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఇప్పటికే మండపేట మండలం తాపేశ్వరంలోని బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాలకు కోర్టు నోటీసులు జారీచేయడం వెలుగుచూసింది. నమ్మించి మోసగించారు : వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన రుణాలు మాఫీ చేస్తామంటూ నమ్మించి మోసగించారని తాపేశ్వరంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు సొమ్మును వడ్డీగా జమ చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రెండు రోజుల క్రితం డ్వాక్రా మహిళలను కలిశారు. బ్యాంకు నుంచి వచ్చిన కోర్టు నోటీసులను మహిళలు వారికి చూపించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి డ్వాక్రా మహిళలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. అధైర్యపడవద్దని, రుణమాఫీ హామీ అమలుకు అధికార పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు వారి వెంట ఉన్నారు. నమ్మి ఓట్లేస్తే.. నోటీసులిప్పిస్తున్నారు గతంలో సకాలంలో రుణాలు చెల్లించేవాళ్లం. రుణమాఫీ చేయక అసలు, వడ్డీ కలిపి రుణభారం బాగా పెరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మాకు కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారు. – దొండపాటి సరస్వతి, తాపేశ్వరం ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. మా ఖాతాలోని పొదుపు సొమ్మును కూడా వడ్డీగా జమ చేసుకున్నారు. తరచూ వచ్చి మమ్మిల్ని బెదిరించి వెళుతున్నారు. రేషన్ సరుకులు, మీ పిల్లల స్కాలర్షిప్లు, పింఛను సాయాన్ని ఆపేస్తామంటున్నారు. – కౌరోజు మంగ, తాపేశ్వరం చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు రుణాలు రద్దయిపోతాయి, కట్టొద్దని చెప్పడం వల్లే చెల్లించలేదని చెబితే, మాకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రు ణాలు కట్టొద్దని చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాం. – తాతపూడి పాప, తాపేశ్వరం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement