-
54 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్యే బీఏ పరీక్షలు!
చదువుకు వయసు ఒక ఆటంకం కాదంటారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ పరిధిలోగల బిత్రీ చైన్పూర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా అలియాస్ పప్పు భరతౌల్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు బీఏ పరీక్షలకు హాజరవుతున్నారు. బీఏ మొదటి సంవత్సరం హిందీ సబ్జెక్టు పరీక్షను రాశారు. తాను ఇంటర్మీడియట్ పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నానని ఆయన మీడియాకు తెలిపారు. తాను లా కోర్సు పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం చేస్తానని రాజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. తన జీవితంలో రాజకీయాలకు, చదువులకు, వయసుకు సంబంధం లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను న్యాయవాది కావాలనుకునేవాడినని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యానని, గ్రాడ్యుయేషన్ కూడా పాసవుతానని అన్నారు. ప్రతి సమస్యకు చదువుతోనే పరిష్కారం లభ్యమవుతుందని, విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టవచ్చని అన్నారు. -
ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి
పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పాస్ అయితే చాలురా బాబు అని కొందరనుకుంటే.. ఇక టాపర్స్ బ్యాచ్ ఏమో వందకు 99 మార్కులు తెచ్చుకోవాలని రోజుకీ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అయితే ఎంత చదివినా, ఎంత రాసినా మహా అయితే 99, లేదా వంద మార్కులు సాధించవచ్చు. అంతకుమించి అయితే రావు కదా. కానీ బిహార్కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి. హా అదేంటి అని ఆశ్యర్చపోతున్నారా.. నిజమేనండి.. ముందుగా తన మార్కులను చూసుకున్న విద్యార్థి కూడా మీలాగే బిత్తరపోయాడు. చివరికి అసలు తెలిసి ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే.. దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బీఏ ఆనర్స్) చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో 100కు 151 మార్కులు వచ్చాయి. రిజల్ట్స్ను చూసి షాక్ అయినట్లు విద్యార్థి తెలిపారు. తను మాట్లాడుతూ.. మార్కులు చూసి ఆశ్చర్యపోయానని ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దానిని తనిఖీ చేయాలి కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదవండి: కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇదిలా ఉండగా బీకామ్ చదవుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్కు ప్రమోట్ చేశారు. కాగా మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. టైపింగ్ మిస్టేక్ కారణంగా ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని పొరపాటు జరిగినట్లు తెలిపింది. రెండు మార్క్ షీట్లలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ కొత్త ప్రొవిజినల్ సర్టిఫికెట్లుజారీ చేసినట్లు చేసినట్లు వివరణ ఇచ్చింది. -
ఆనర్స్.. బోధించేవారు లేరు సార్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బీఏ ఆనర్స్ కోర్సు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి తీసుకొచ్చిన ఈ కోర్సు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న కోర్సులకన్నా భిన్నంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని భావించినప్పటికీ ఫ్యాకల్టీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీన్ని పరిష్కరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది నిజాం కాలేజీలో ఎకనామిక్స్, కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను ఆనర్స్గా ప్రారంభించింది. సీట్లు కూడా భర్తీ అయ్యాయి. ప్రాజెక్టు వర్క్, ఫీల్డ్ స్టడీ ఎక్కువగా ఉండేలా సిలబస్ రూపొందించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. అయితే, రాష్ట్రంలో ఆ స్థాయిలో ప్రత్యేక బోధన చేపట్టగల అధ్యాపకులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని అధ్యాపకుల కోసం సైతం వేట మొదలు పెట్టారు. ఈ ప్రయత్నంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎలాంటి పురోగతి కన్పించడం లేదనే విమర్శలొస్తున్నాయి. (బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్.. అధికారుల తీరే కారణమా..?) నిపుణుల కోసం వేట.. ► ఆనర్స్ కోర్సుల్లో ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల అధికారులు చర్చించారు. నిపుణుల కోసం జల్లెడ పట్టాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ బోధన విజయవంతంగా సాగుతుండటంతో అక్కడి అధ్యాపకులను రప్పించేందుకు సంప్రదింపులు చేపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి బోధనకు వారు సుముఖంగాలేరని తెలిసింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లాసు చెప్పగలమే తప్ప పూర్తిస్థాయిలో బోధించలేమని వారు చెబుతున్నారు. దీంతో కచ్చితమైన ప్రణాళిక కష్టమని అధికారులు వాపోతున్నారు. ► వీలైతే ఇతర రాష్ట్రాల అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసులైనా ఇప్పించాలనుకుంటున్నారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఏమేర సత్ఫలితాలనిస్తుందనేది చెప్పలేమని అధికారులు అంటున్నారు. కొత్త కోర్సు కావడంతో విద్యార్థుల సందేహాల నివృత్తి వీలవుతుందా అనే అనుమానాలున్నాయి. ఇతర రాష్ట్రాల ఫ్యాకల్టీ ఆన్లైన్ ద్వారా కొద్దిసేపు మాత్రమే బోధించే వీలుందని నిజాం కాలేజీ అధ్యాపకుడు ఒకరు చెప్పారు. ► ప్రముఖులతో విశ్లేషణలు ఆనర్స్ కోర్సుల్లో ప్రధానాంశం. అవసరమైతే ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆ స్థాయి అధికారులతో ఆర్థిక శాస్త్రంలో మార్పులపై చెప్పిస్తామని అధికారులు చెప్పినా.. ఇంతవరకు సరైన ప్రణాళిక లేదు. ఎవరిని, ఎప్పుడు పిలవాలి? అనే దానిపై విద్యార్థులకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదు. -
యువర్..‘ఆనర్స్’
బీఏ కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి సాధన చేసి సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. విద్య, విలువల కలబోతగా కొత్త కోర్సును విద్యార్థుల ముందుకు తెచ్చింది. వినూత్న పాఠ్యప్రణాళిక ఈ కోర్సు విశేషం. బీఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కోర్సుకేకాదు, బావితరాల కోసం కొత్త రాజకీయ నాయకత్వానికి డిజైన్ చేసింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. 60 మంది విద్యార్థులతో ప్రయోగాత్మకంగా మొదలైన తొలిబ్యాచ్ ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. కార్యక్రమంలో హెచ్సీయూ ప్రొఫెసర్ అరుణ్ పట్నాయక్, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యుల్లత, రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్ వి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వలక్షణాలు, రాజకీయ మేధోమథనం, క్షేత్రస్థాయి రాజనీతిజ్ఞత మేళవించిన పాఠ్యప్రణాళికను ఈ కోర్సులో జోడించారు. ఈ కోర్సు ప్రాధాన్యతలపై నిపుణులు ‘ఇండస్ ప్రోగ్రామ్’లో ఏమన్నారంటే... దేశంలోనే భిన్నమైన ఆలోచన: ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి భిన్నమైన ఆలోచనలతో కోర్సుకు డిజైన్ చేశాం. సమకాలీన అంతర్జాతీయ, రాజకీయ విషయాలే బోధనాంశాలు. తరగతికే పరిమితమయ్యే పాతవిధానానికి భిన్నంగా రాజకీయప్రముఖుల అనుభవాలే పాఠ్యాంశాలుగా నేరుగా విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయ ఫ్యాకల్టీ పాత్ర కన్నా, రాజకీయ ముఖ్యులు, విశ్లేషకులే ఇక్కడ బోధకులుగా వ్యవహరిస్తారు. నాలుగు గోడల మధ్య చదువును పక్కన బెట్టి, విశాల ప్రపంచంలో విస్తృత అవగాహన బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ప్రత్యేకత. చారిత్రక అవసరం : ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్ ఉన్నత విద్యలో మహిళల పాత్ర 70 % మేర పెరిగింది. గొప్ప నాయకత్వ లక్షణాలను సంతరించుకునే దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. అందుకే బీఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టాం. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యయనం చేసిన తర్వాతే ఈ కోర్సు రూపొందించాం. భావితరాలకు మంచి నాయకులను అందిస్తామనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం. ఢిల్లీ కన్నా ... ఇక్కడే బెస్ట్ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల కన్నా మెరుగైన రీతిలో బీఏ ఆనర్స్ను తెలంగాణ అందించాలనుకుంటోం ది. దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకు అనువైన పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. భవిష్యత్లో ఈ కోర్సు కోసం ఇతర రాష్ట్రాల వాళ్లూ పోటీపడతారు. తెలంగాణలోని నాయకత్వ లక్షణాలు, విద్యాహబ్గా హైదరాబాద్ ముందుండటం వల్ల ఈ కోర్సు కు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నాం. ఈ కోర్సు అభ్యసించిన విద్యార్ఙినులు రోల్మోడల్గా నిలుస్తారని ఆశిస్తున్నాం. – ప్రొ.వెంకటేశు రాజకీయాల్లో విలువలు పెంచే కోర్సు విలువలతో కూడిన రాజకీయాలు నేటితరానికి అవసరం. ప్రజా సంక్షేమ పాలనకు ఇదే పునాది. ముఖ్యంగా మహిళారాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో హానర్స్ పొలిటికల్ కోర్సులకు ఎంతో ప్రాధాన్యముంది. పార్లమెంటరీ విలువలు, నాయకత్వ లక్షణాలు కలబోసి రూపొందించిన ఈ పాఠ్యప్రణాళిక... వాస్తవాలే పాఠాలు మార్చి అందించే బోధనావిధానం తెలంగాణను దేశంలో గర్వంగా నిలుపుతుందని భావిస్తున్నాం. – ముసలయ్య (రాజనీతి శాస్త్రం ఆచార్యుడు) -
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా రాష్ట్రంలో బీఏ (ఆనర్స్) పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. సామాజిక, ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన, బహుళజాతి సంస్థల్లోనూ ఉపాధి అవకాశం కల్పించగల నైపుణ్యం అందించడమే కోర్సుల ముఖ్య లక్ష్యమని చెప్పింది. సివిల్స్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకొచ్చే ప్రమాణాలు ఆనర్స్ కోర్సుల ప్రత్యేకతలని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న బీఏ(ఆనర్స్) పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక తలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో నిపుణులు గురువారం విలేకరులకు వివరించారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్, నిజాం కాలేజీలో ఎకనమిక్స్ ప్రవేశపెట్టామని, ఈ నెల 20 వరకూ ప్రవేశం పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి మరికొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో విస్తరించనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ చెప్పారు. ఉన్నత విద్యా మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జుల్లత, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement