-
పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ....
జిల్లా కేంద్రంలోని మూడు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో సమస్యలను పరిష్కరిస్తాను, రైతులు మాత్రమే అమ్మేలా దళారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాను. విజయనగరం పట్నంలో ఉన్న మూడు రైతుబజార్లలో కేవలం ఆర్అండ్బీ రైతుబజార్లో కాస్త సౌకర్యాలున్నా మిగతా రెండు రైతుబజార్లలో అసౌకర్యాలున్నాయని గుర్తించాను. అన్ని రైతుబజార్లలో బహిరంగ మార్కెట్ ధరల కన్నా 25 శాతం తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకుంటాను. మరుగుదొడ్లు నిర్మించి, రూఫ్లకు మరమ్మతులు చేయిస్తాం. అన్ని కౌంటర్లూ కూరగాయల వ్యాపారులతో నిండేలా దాసన్నపేట రైతుబజార్ను తీర్చిదిద్దుతాను. రూ.40 లక్షలతో రైతుబజార్లను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటాం. వీఐపీ రిపోర్టింగ్లో తెలుసుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ రైతు బజారు అది. అప్పటికే రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కూరగాయలను ఎంచుకోవడంలో కొనుగోలుదారులు బిజీగా ఉన్నారు. తూకం వేస్తూ...డబ్బులందుకుంటూ ైరైతులూ అంతే బిజీగా ఉన్నారు. ఇంతలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అకస్మాత్తుగా అక్కడకి జాయింట్ కలెక్టర్ రామారావు తన వాహనంలో వచ్చారు. రైతులను పేరుపేరున పలకరించారు. కొనుగోలు దారులతో మాట్లాడారు. రైతుబజార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యలేమైనా ఉన్నాయి? సౌకర్యాలున్నాయా ? లేదా ? అని తెలుసు కోడానికి సాక్షి వీఐపీ రిపోర్టర్గా మారారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలెలా అమ్ముకుంటున్నారని రైతులను, నిత్యం వచ్చి కూరగాయలు, బియ్యం, కొనుగోలు చేస్తున్న వినియోగదారులను సమస్యలపై ప్రశ్నించారు. కొన్నింటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. జేసీ : నమస్కారమండీ! నా పేరు రామారావు, నేను జాయింట్ కలెక్టర్ను. ఇక్కడ మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను.మీ పేరేమిటి? ఏ ఊరు? రైతు : నాపేరు సీత బాబు. మాది బొండపల్లి మండలం నెలివాడ గ్రామం. జేసీ : ఏం పండిస్తారు? సొంత భూమేనా? సీతబాబు: నేను కౌలుకు పొలం తీసుకున్నాను. వంకాయలు, బీరకాయలు పండిస్తాను. జేసీ : మీకు లాభసాటిగా ఉందా? సీతబాబు: లాభసాటిగా ఉందండి. జేసీ : బోర్డు మీద ధరకే విక్రయిస్తున్నారా? ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారా? సీతబాబు: బోర్డుమీద ధరకే విక్రయిస్తున్నాం. ఎక్కువ ధరలకు విక్రయించడం లేదు. జేసీ : మీ పేరు? (వినియోగదారునితో) వినియోగదారు: నా పేరు కృష్ణారావు రిటైర్డు ఉద్యోగిని జేసీ : ఇక్కడి రైతుబజార్లో సమస్యలేమైనా ఉన్నాయా? కృష్ణారావు: షెడ్లు పాడయిపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. వర్షం వస్తే కారిపోతోంది. బజారంతా మురుగునీరు నిల్వుంటోంది. ఎండ వేడిమి భరించలేక ఇబ్బంది పడుతున్నాం. జేసీ : రైతుబజార్లో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. అవి రాగానే బాగు చేయిస్తాం. తుపాను ధాటికి పాడైపోవడంతో రూ.పది లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచాం. వెంటనే బాగు చేయిస్తాం. జేసీ : నీ పేరేమిటమ్మా? మహిళ: నా పేరు కొండమ్మ. మాది గెద్దపేట. జేసీ : కూరగాయలు విక్రయిస్తే రోజుకు మీకు ఎంత వస్తుంది? కొండమ్మ: నాకు రోజుకు రెండు వందలు మిగులుతాయి. జేసీ : అంతేనా? ఎక్కువ వస్తుందా? చెప్పమ్మా! కొండమ్మ: అంతేనండీ రెండొందలు వస్తాయి. జేసీ : సబ్సిడీపై విత్తనాలు వస్తున్నాయా? కొండమ్మ: ఇస్తున్నారండీ! ఆ విత్తనాలతోనే పండిస్తున్నాం. జేసీ : మీ పేరేంటి? వినియోగదారుడు: నా పేరు వెంకటరావు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిని. జేసీ : ఇక్కడ కూరగాయలు సరైనధరలకే లభిస్తున్నాయా? వెంకటరావు: సరైన ధరలకే లభిస్తున్నాయండీ! ఇక్కడ రైతు బజార్లో లాగే మిగతా రైతుబజార్లో కూడా విక్రయాలు చేపడితే బాగుంటుంది. వ్యాపారులు కాకుండా రైతులే అమ్మేలా చర్యలు తీసుకోవాలి. జేసీ : అలాగే చర్యలు తీసుకుంటాం. బియ్యం, ఉల్లి, పంచదార కూడా విక్రయిస్తున్నారు. కొనుగోలు చేయండి. జేసీ : నీ పేరంటమ్మా! మహిళారైతు: నాపేరు కెల్ల పైడమ్మ, మాది కెల్ల గ్రామం. జేసీ : ఏమేం పండిస్తారు? పైడమ్మ: ఆనపకాయలు, బెండకాయలు పండిస్తాం. క్యాబేజీ కొనుగోలు చేసి లాభానికి అమ్ముతుంటాం. జేసీ : నీకు రోజుకు ఎంత మిగులుతుంది? పైడమ్మ: రద్దులు ఎక్కువగా ఉంటే ఏమీ మిగలదండీ! జేసీ : ఇలా అమ్ముకోవడం వల్ల ఏమయినా సంపాదిస్తున్నావా? పైడమ్మ: సంపాదనంటే అలాగేనండీ! రోజుకు రెండు వందలు కన్నా ఎక్కువ రాదండీ! జేసీ :నీపేరు? మహిళా రైతు: నా పేరు తాళ్లపూడి చిన్నమ్మి. మాది అంబటి వలస. జేసీ : నీ వ్యాపారం ఎలా ఉందమ్మా? చిన్నమ్మి: వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయయ్యా! కట్టంగా ఉంది..... జేసీ : అలా కాదు. నీకు లాభం వస్తుందా లేదా ? చిన్నమ్మి: ఎక్కువ రాదండీ! మార్కెట్లో విక్రయిస్తే నాలుగు వందల వరకూ మిగులుతుంది. ఇక్కడ విక్రయించడం వల్ల రోజుకు రెండు వందలే మిగులుతుంది. జేసీ : మీకు ఉద్యాన వన శాఖ అధికారులు వచ్చి సలహాలు, సూచనలూ ఇస్తున్నారా? చిన్నమ్మి: ఇస్తున్నారు.బాబూ! జేసీ : మీ పేరు? వినియోగదారు: నా పేరు ఎస్ రామరాజు, రిటైర్డు కానిస్టేబుల్ని. జేసీ : చెప్పండి ఇక్కడి రైతుబజార్ ఎలా ఉంది? రామరాజు: బాగానే ఉందండీ! కాకపోతే బయట చాలా ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించాలి. జేసీ : చర్యలు తీసుకుంటాం. జేసీ : మీ పేరు? వినియోగదారు: నా పేరు రామకృష్ణ, స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాను. జేసీ : చెప్పండి! ఇక్కడెలా ఉంది? రామకృష్ణ: ఇక్కడి రైతుబజార్లో సరైన ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇతర బజార్లలో కూడా ఇలానే అమ్మేలా చర్యలు తీసుకోండి. జేసీ : అలాగే! అన్ని ప్రాంతాలకూ మా సిబ్బందిని పంపిస్తాం. చర్యలు తీసుకుంటాం. జేసీ : నీ పేరేమిటి? వ్యాపారి: నా పేరు యామలి శ్రీనివాస రావు! జేసీ :చెప్పండి! మీకు బాగా లాభాలు వస్తున్నాయా? శ్రీనివాసరావు: రోజుకు రెండు వందలు వస్తుందండీ! జేసీ : అంతేనా? శ్రీనివాసరావు: అంతేనండీ ఎక్కువేం రాదు. జేసీ : నువ్వు యువత తరఫున షాపు పెట్టావా? శ్రీనివాసరావు: ఓ సంస్థ ద్వారా ఇక్కడ చేరాను. జేసీ : నీ పేరేంటి ? రైతు : నా పేరు గెద్ద రమణమ్మ, మాది గెద్దపేట. జేసీ : రోజుకు ఎంత వస్తుంది. రమణమ్మ: రోజుకు రెండు నుంచి మూడు వందలు వస్తుంది. జేసీ : నీకు ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయా? పొదుపు చేసుకుంటున్నారా? రమణమ్మ: ఉపయోగపడుతున్నాయి. ఆ డబ్బులతో ఏం పొదుపు చేస్తామండీ! జేసీ : నీ పేరంటయ్యా? రైతు: నా పేరు కోన సోములండీ! మాది నెలివాడ. జేసీ : చెప్పు ఎలా ఉంది? ఎంత వస్తుంది. సోములు: మాకు ఎక్కడిదక్కడే సరిపోతుందండీ! ఎక్కువగా మిగిలే పరిస్థితి లేదు. ఇటీవల వర్షాలతో పంటలు పోయాయి. ఇబ్బందే పడుతున్నాం. ఇక్కడ విక్రయిస్తే కష్టంగా ఉంది. జేసీ : మరి బయట అమ్ముకోలేకపోయావా? సోములు: లేదు లెండి ఇక్కడే బాగుంది. జేసీ : మీ పేరు? ఏ ఊరు మీది ? వినియోగదారు: మాది ఢిల్లీ. నా పేరు విశ్వేశ్వరరావు. బంధువులింటికి వచ్చాను. జేసీ : చెప్పండి! మీకు రైతుబజారు ఎలా అనిపిస్తోంది. విశ్వేశ్వరరావు: ఇక్కడ చాలా బాగుంది. మాకు ఇలా ఉండదు. అక్కడ కూడా ఇలా ఏర్పాటు చేయాలని కోరతా! జేసీ : మీరు రోజూ వస్తారా? ఏం పేరు? వినియోగదారు: నా పేరు రామారావు. జేసీ : ఎలా ఉందీ రైతుబజార్? రామారావు: మేం వాడిపోయిన కూరలూ, తాజా కూరలూ ఒకే ధరకు కొనాల్సి వస్తోంది. ఇబ్బందులు పడుతున్నాం. జేసీ : అలా ఎందుకు? కాస్త తాజా తగ్గితే కిలో వద్ద రూపాయి చొప్పున తగ్గించండి! సరేనా... ఇక నుంచి ఈ పద్ధతి అమలు చేయండి.(ఎస్టేట్ ఆఫీసర్ సతీష్తో) జేసీ : మీ పేరేంటి? వినియోగదారు: నా పేరు వెంకటరావు. జేసీ : చెప్పండి? ఇక్కడెలా ఉంది? రామారావు: ఇక్కడ వాడిన కూరగాయల వ్యర్థాలు పడేస్తున్నారు. ధరలు బాగానే ఉన్నా, దుర్వాసన వస్తే బాగుండదు కదా! ఆ సమస్య పరిష్కరించాలి. జేసీ : చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలన్నీ బయట పడేసే చర్యలు తీసుకోండి(అధికారులకు ఆదేశం) జేసీ : మీరు కొనుగోలు చేస్తున్న కూరగాయలు బానే ఉంటున్నాయా? జోస్యుల ప్రసాదరావు: ఇతర బజార్లలో కూరగాయలు ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం సెకండ్స్లా వాడిపోయి ఉంటున్నాయి. ధర మాత్రం ఒకటే! ఇలా ఎందుకు? కచ్చితంగా వాడిపోయినట్టే కనిపిస్తున్నాయి. చూడండి! జేసీ : అట్లానా! చర్యలు తీసుకుంటాం.అన్ని కౌంటర్లలో తాజా కూరగాయలు విక్రయించేలా రేపటి నుంచి చర్యలు తీసుకోండి(ఏడీ మార్కెటింగ్ శ్రీనివాసరావుకు ఆదేశం) జేసీ : ఏమ్మా! మీదే ప్రాంతం. ఇక్కడ పంచదార విక్రయాలు బాగానే ఉన్నాయా? ఎస్ భాగ్యరాణి: మాది వివేకానంద కాలనీ అండీ! పంచదార బయట మార్కెట్లో 40 రూపాయల వరకూ పలుకుతుంది. ఇక్కడ 34 రూపాయలకే ఇస్తున్నారు. ఇది కాస్త సౌకర్యంగా ఉంది. -
ఇంకేం అర్హత కావాలి..?
కలెక్టరేట్లో ఆవేదన వెళ్లగక్కిన పింఛన్ బాధితులు వృద్ధులు వికలాంగులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రాంగణం పింఛన్లు పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్న వైనం విజయనగరం మున్సిపాలిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్ కార్యక్రమంలో పలువురు పింఛన్ బాధితుల ఆవేదన ఇది. ఈ మేరకు వారు జాయింట్ కలెక్టర్ బి.రామారావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స సెల్కు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు క్యూ కట్టారు. వివక్షతో, నిర్లక్ష్యంతో తమ పింఛన్లు తొలగించారని, మళ్లీ వాటిని పునరుద్ధరించాలని కోరారు. మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామానికి చెందిన 33 మంది వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. చూపు సరిగ్గా ఆనకున్నా, సరిగ్గా నడవలేకున్నా కలెక్టరేట్ వరకు వచ్చి తమ సమస్యలు విన్నవించారు. అలాగే గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన 50 మంది బాధితులు పంచాయతీ మాజీ సర్పంచ్ ఆర్.పద్మావతి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి పింఛన్ల రద్దుపై ఫిర్యాదు చేశారు. విజయనగరం మండలం కోరుకొండ పంచాయతీలో గతంలో పింఛన్లు పొందిన 70 మంది లబ్ధిదారులు తమ పేర్లను అన్యాయంగా తప్పించారని అధికారులను అడిగితే రెండో జాబితాలో వస్తుందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంట్యాడ మండలం రామవరం, కరకవలస గ్రామాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల ఏకపక్ష నిర్ణయాలతో అర్హులైన నిరుపేద దళిత, బలహీన బడుగు వర్గాల పింఛన్లు రద్దు చేయడం అన్యాయమంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు పీరుబండి జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే విజయనగరం పట్టణంలోని 8వ వార్డులో ఎంతో కాలంగా ప్రభుత్వం పింఛన్లు అందుకుంటున్న వారికి పింఛన్లు నిలుపుదల చేయటం సరికాదంటూ బీజేపీ నాయకులు ముద్దాడ మధు ఫిర్యాదు చేశారు. -
మంచి బియ్యం ఇవ్వాలి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: బీపీఎల్ కుటుంబాలకు పురుగుల్లేని బియ్యాన్ని అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి రామారావు పౌరసరఫరాల గొడౌన్ ఇన్చార్జిలను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో సివిల్ సప్లైస్ అధికారు లు, ఇన్చార్జిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రతి నెలా బియ్యంతో పాటు అన్ని సరుకులూ ఒకేసారి ఇవ్వాలన్నారు. ప్రతి నెలా 23తేదీ లోగా డీడీలు తీసేలా ఇన్చార్జిలు తహశీల్దార్ కార్యాల యాలతో టచ్లో ఉండాలన్నారు.23 తరువాత డీడీలు తీసే డీలర్లకు రూ. 500 నుంచి రూ,1000 వరకూ జరి మానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయింపులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం ఆలస్యం కాకుండా సకాలంలో ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఇందుకోసం డీఎస్ఓ, డీఈఓలతో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. రూట్ ఆఫీసర్లు లేకపోతే తహశీల్దార్లకు నోటీసులు పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ ద్వారా సరఫరా అవుతున్న సరుకుల వాహనాలతో తప్పనిసరిగా రూట్ ఆఫీసర్లు వెళ్లాలని ఆదేశించారు. ఒకవేళ అలా లేకుంటే తహశీల్దార్ కార్యాలయాలకు నోటీసులిస్తామని హెచ్చరించా రు. జిల్లాలో ఉన్న 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరుకులు వెళ్తున్నప్పుడు వారితో వెళ్తూ డీలర్ వద్ద సంతకం తీసుకుని తిరిగి ఎంఎల్ఎస్ పాయిట్లోని ఇన్చార్జికి ఆ లెటర్ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా బాడంగి, బలిజిపేట, మెరకముడిదాం, గంట్యాడ, కొమరాడ, ఎల్ కోట, జామి, గరుగుబిల్లి, గుర్ల, రామభద్రపురం, జీఎల్పురంల నుంచి వాహనాలతో రూట్ ఆఫీసర్లు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. ఇటీవల కాంట్రాక్టు పొందిన వాహనాల యజమానులు ఎప్పుడైనా వాహనాలను పెట్టకపోతే తహశీల్దార్లతో మాట్లాడి ప్రైవేటు వాహనాలను అప్పటికప్పుడు పెట్టించి దానికి సంబంధించిన అద్దెలను కాంట్రాక్టర్ డిపాజిట్ నుంచి రికవరీ చేయాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లైస్ డీఎం ఎస్ వేణుగోపాలనాయుడు, అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) భాస్కరశర్మ, అసిస్టెంట్ మేనేజర్ (ప్రజా పంపిణీ) ఆర్ రాజీ, సివిల్ సప్లైస్ సిబ్బంది, గొడౌన్ఇన్చార్జిలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
Advertisement