-
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
‘బిజినెస్ పనిపై వచ్చాం’.. ఇంట్లోకి చొరబడి యువకుడిపై దాడి
సాక్షి, చందానగర్: ఇంట్లోకి చొరబడ్డ ఇద్దురు దుండగులు ఓ యువకుడిని కట్టేసి చితకబాదిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన శ్రీహర్ష(28), నెల్లూర్ పట్టణానికి చెందిన సాయిరాం(30) నాలుగు నెలలుగా చందానగర్లోని ఇంజినీర్ ఎన్క్లేవ్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శ్రీహర్ష సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా, సాయిరాం సోలార్ టెక్నికల్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి 7.30కి వీరింట్లోకి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. శ్రీహర్ష ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ‘సాయిరాంతో బిజినెస్ పనిపై వచ్చాం.. అతను వచ్చే వరకు ఉంటాం’ అని అన్నారు. కొద్దిసేపటి తర్వాత మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తెచ్చేందుకు కిచెన్లోకి వెళ్తున్న శ్రీహర్షపై వారిలో ఒకడు దాడి చేయడంతో నుదుటిపై గాయమైంది. ఇద్దరు అతడిని కుర్చీలోకి తోసి కాళ్లుచేతులు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డ పెట్టి దాడి చేశారు. అనంతరం వెనుక డోర్ నుంచి పారిపోయారు. రాత్రి 9.30కి ఇంటికి వచ్చిన సాయిరాం కట్లును విప్పాడు. తర్వాత చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, వారిలో ఒకడి పేరు మల్లి అని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఎవ్వరూ రాలేదని తేలిందని ఎస్ఐ తెలిపారు. మరే మార్గంలో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పగతోనే దాడి? ఈ నెల 16న శ్రీహర్ష, సాయిరాంలకు వారి ఇంటి పరిసరాల్లో ఉండే తాళ్లపల్లి సౌరబ్గౌడ్(28)తో గొడవ జరిగిందని, చిన్న గొడవ కావడంతో మందలించి వదిలేశామని పోలీసులు తెలిపారు. శ్రీహర్ష, సాయిరాంలు సిగరెట్ తాగుతుండగా సౌరబ్ గౌడ్ వారిని హెచ్చరించడమే కాకుండా ఇంటికి వెళ్లి దాడి చేశాడని, అనంతరం కాలనీ కమిటీ సభ్యులు ఇరువురినీ పిలిచి సర్ధిచెప్పి పంపేశారన్నారు. కాగా, సౌరబ్గౌడ్ ప్రతీకారంతోనే ఇద్దరు వ్యక్తులను పంపించి దాడి చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతడిని పిలిచి విచారిస్తున్నారు. -
నడిరోడ్డుపై యువతి హల్చల్
సాక్షి, భువనేశ్వర్: రాజధాని నగరం నడి బొడ్డున ఓ యువతి దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె రాళ్లు రువ్వి యువకుడి తలను బలంగా గాయ పరిచింది. రక్తసిక్తమైన పరిస్థితుల్లో యువకుడు నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఈ సంఘటన పూర్వాపరాలు స్పష్టం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రాళ్లతో దాడి చేసిన యువతి కనుమరుగైంది. స్థానిక రాజమహల్ ఛక్ ప్రాంతంలో మంగళవారం పట్టపగలు ఈ సంఘటన జరగడం తీవ్ర సంచలనం రేపింది. చదవండి: ప్రాణం తీసిన పబ్జీ.. వివాహిత హత్య! గంట్యాడ: మండలంలోని కె.వెలగాడ గ్రామంలో ఓ వివాహిత మంగళవారం హత్యకు గురైంది. దీనికి సంబంధించి రూరల్ సీఐ మంగవేణి తెలిపిన వివరాలు... కె.వెలగాడ గ్రామానికి చెందిన మర్రోతు భవాని(38)కి గింజేరు గ్రామానికి చెందిన శ్రీరామమూర్తితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ బిడ్డ కూడా పుట్టాడు. తరువాత భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో భవాని కె.వెలగాడలో కన్నవారింటికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో మృతురాలికి గ్రామంలోని చౌడవాడ ఎర్రిబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఎర్రిబాబు తనతో కాదని భవానికి వేరొకరితో కూడా సంబంధం ఉన్నట్టు అనుమానించి హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తలపై పారతో కొట్టి హత్య చేశాడు. పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం.. విషయం తెలుసుకున్న సీఐ మంగవాణితో పాటు ఎస్ఐ బి.గణేష్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పారతో హత మార్చినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు. హత్యకు వాడిన పారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి భార్య కూడా గతంలో అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందినట్టు వెల్లడించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. మృతురాలికి ఇరవై సంవత్సరాల వయసు గల కొడుకు భరత్ ఉన్నాడు. మృతురాలి తండ్రి మల్లునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. -
వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ
కడప అర్బన్: కడప శివార్లలోని ఓ ఇంటిలో అద్దెకు దిగిన ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేశారు. బాధితుడిని నిర్బంధించి, అతడి వద్ద రూ.లక్షల విలువైన వజ్రాన్ని తీసుకుని పరారయ్యారు. కడపలోని చిలకలబావి వీధికి చెందిన భుట్టో ఎలక్ట్రానిక్స్ నిర్వాహకుడు ఆసిఫ్ ఆలీఖాన్. అతడి తండ్రి ఖాదర్ బాషా(60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న ఎల్లో సఫైర్ డైమండ్ను (జాతి రత్నం) రూ.25,000కు కొనుగోలు చేశాడు. ఖాదర్ బాషాకు నిందితుల్లో ఒకడైన షాహీద్ హుసేన్తో పరిచయం ఏర్పడింది. షాహీద్ హుసేన్ రత్నాల వ్యాపారంలో మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఖాదర్బాషా వద్ద విలువైన డైమండ్ ఉందని తెలుసుకున్నాడు. షాహీద్ హుసేన్ ఈ నెల 15న కడప శివార్లలో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. 16న ఉదయం ఖాదర్బాషా నిందితులు అద్దెకు ఉంటున్న ఇంటికి వజ్రం తీసుకుని వెళ్లాడు. ఖాదర్బాషా నుంచి నిందితులు వజ్రాన్ని బలవంతంగా లాక్కుని పిడిగుద్దులు గుద్దారు. దుప్పటిలో కప్పి, ప్లాస్టర్తో చుట్టి బాత్రూంలో పడేశారు. కొంతసేపటికి ఖాదర్బాషా స్పృహలోకి వచ్చి తన పిల్లలకు ఫోన్ చేశాడు. వారు వచ్చి ఖాదర్బాషాను రిమ్స్లో చేర్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
మనిషి రాక్షసుడవుతున్న వేళ..!
చిత్తూరు అర్బన్: మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నప్పుడు రాక్షసుడిగా మారుతాడు. ఇది ముమ్మాటికీ నిజమేనని చిత్తూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న ఉదంతాలు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా ఒక్కడిపై గుంపుగా దాడి చేసి, చితకబాదుతూ, ఆ దృశ్యాలను సెల్ కెమెరాలో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందుతుండటం ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా పెద్ద హీరోయిజంలా సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఏం చెప్పదలచుకున్నారు..? చిత్తూరుకు చెందిన సాగర్ చికెన్ సెంటర్ యజమాని చిట్టిబాబునాయుడు ఈనెల 13న ప్రవర్తించిన తీరు చూస్తే అసలు వీళ్లు మనుషులేనా? అనే అనుమానం కలుగుతోంది. పనికి రాలేదనే నెపంతో పెనుమూరుకు చెందిన వేణుగోపాల్ను మూడు గంటల పాటు తన అనుచరులతో కలిసి కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిట్టిబాబుతో పాటు నలుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా.. అందరూ ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటోంది. ఒక దశలో వేణుగోపాల్ మర్మాంగంపై కర్రతో పొడవడానికి చిట్టిబాబు ప్రయత్నించడం, చికెన్ సెంటర్లో పనిచేసే వ్యక్తులు వేణుగోపాల్ను వెనుక నుంచి ఫుట్బాల్ను తన్నినట్లు తన్నడం, విరిగిన చేయిని మరోచేతితో పట్టుకుని బాధితుడు దండం పెడుతున్నా వీరి వదలకుండా పదే..పదే హింసించడం చూస్తే ఎవరికైనా రక్తం మరగకమానదు. ఇక ఈనెల 20న చిత్తూరులోని మిట్టూరుకు చెందిన గీతూరెడ్డి అనే మహిళ, ఆమె కుమారుడు శరత్కుమార్ సాదిక్ అనే యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు చూసినవారు కడుపు తరుక్కుపోతోందంటున్నారు. సాదిక్ అతని స్నేహితుడి మధ్య ఓ యువతి విషయమై వివాదం రేగింది. దీనిపై పంచాయతీ చేయడానికి సాదిక్ను గీతూరెడ్డి తన ఇంటికి పిలిపించింది. తన గురించి ఇతరులకు ఎందుకు చెడుగా చెబుతావంటూ అతడిపై చేయి చేసుకుంది. అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత గీతూరెడ్డితోపాటు ఉన్న శరత్ స్నేహితులు ఏడుగురు ఓ కల్యాణమండపం వద్ద మరోసారి సాదిక్ను చితకబాదారు. మొహం, కడుపుపై కాళ్లతో తన్నడం, పిడి గుద్దులు కురిపించడం, కింద పడ్డా పైకిలేపి మరీ కాళ్లతో తన్నడం.. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టురా! అని మరొకరు అనడం చూస్తుంటే రాన్రాను మనిషిలో మానవత్వం ప్రశ్నార్థకమవు తోంది. పైగా కొట్టిన పిల్లల్లో నలుగురు మధ్య తరగతి, ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లలు.. మైనర్లు ఉండటం గమనార్హం! బంధాలకు విలువేదీ? ఇప్పుడు ప్రతి ఇంటాస్మార్ట్ ఫోన్ ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగా మాట్లాడరు. పిల్లలు తోబుట్టువులతో ఆడుకోరు. అందరూ కూర్చుని భోంచేసిన ఘటనలు అరుదు. పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో పడేసి స్మార్ట్ఫోన్లు తీసుకుని వాట్సప్, ఫేస్బుక్లలో గంటల కొద్దీ గడపడం. కొందరైతే హింసాత్మకమైన గేమ్లను తరచూ ఆడుతూ వాటి ప్రభావానికి గురై హింసాప్రవృత్తితో మసలుకుంటున్నారు. కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సరైన ప్రేమానురాగాలు లేకపోవడం, పిల్లలకు విలువల చెప్పకపోవడమే ఈ తరహా ఘటనలకు ప్రధాన కారణమవుతోంది. పేరెంట్స్దే బాధ్యత పిల్లల ప్రవర్తన విషయంలో ఇంట్లోని పెద్దల తీరు కూడా ప్రభావితం చేస్తుందనే చెప్పాలి. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడం, ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం, తిట్టుకోవడం..ఇత్యాది ఘటనలను చూస్తూ పిల్ల ల మనస్తత్వం కూడా మారిపోతోంది. పరుగులు తీస్తున్న యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం, వారి నుంచి ఆశించిన ప్రేమ లభించకపోవడంతో పిల్లలు దారి తప్పుతున్నారు. బయటివ్యక్తుల వద్ద అనుచరులుగా తిరగడం, వారిపై అభిమానం చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టులకు నెగటివ్ కామెంట్లు పెడితే దాడులు చేసి జైలుపాలవుతున్నారు. ఇప్పటికైనా పిల్లలకు ప్రేమానురాగాలు పంచడం, ఇంటికి వెళ్లగానే వారితో సరదాగా ముచ్చటిస్తూ, మంచీ–చెడు చెప్పించడం..లాంటివి చేస్తే సమాజానికి మంచి పౌరులను అందించినవారుతారని అటు మానసిన వైద్యనిపుణులు, ఇటు పోలీసులు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement