-
ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక..
ఖమ్మం క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై గొడవల కారణంగా ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన ప్రీతిని అదే ప్రాంతానికి చెందిన తేజానూత్ సాయి మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సాయి పాత బస్టాండ్ వద్ద అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వివాహమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇరువర్గాల కుటుంబీకులు సర్ది చెప్పడం.. మళ్లీ కలసిపోవడం జరుగుతోంది. కాగా, సైకోలా వ్యవహరించే సాయి.. ఆమెను ఇష్టారీతిగా కొట్టడమేకాకుండా, చుట్టుపక్కల వారు అడ్డుకుంటే వారిపైనా దాడికి పాల్పడుతుండేవాడు. ఇటీవల గర్భం దాల్చిన ఆమెను అలాగే కొడుతుండటంతో పుట్టింటికి వచ్చింది. వీరిద్దరూ కలసి ఉండడం సాధ్యం కాదని భావించిన పెద్దమనుషులు విడాకుల పత్రం రాయించారు. అయినా సాయి వచ్చి ప్రీతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే మూడు రోజుల క్రితం సాయి మళ్లీ కొట్టడంతో ప్రీతి పుట్టింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం ప్రీతి వద్దకు వచ్చిన సాయి, మాట్లాడే పని ఉందని సమీపంలోని తన ఇంటికి తీసుకెళ్లి గొడవ పడుతూ అరటి పండ్లు కోసే కత్తితో ఇష్టారీతిగా శరీరం పై పొడిచి తలుపు వేసి వెళ్లిపోయాడు. అయితే కత్తితో పొడుస్తున్నప్పుడు ఆమె గట్టిగా కేకలు వేసినా, ఎప్పుడూ జరిగే గొడవలే కావొచ్చని ఎవరూ పట్టించు కోలేదు. చివరకు ఆమె గావుకేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఉంది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె శరీరంపై అయిన గాయాలకు 80కుట్లు వేశారు. టూటౌన్ సీఐ శ్రీధర్, ఎస్సై రాము పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి.. -
టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో..
వీరులపాడు కృష్ణా (నందిగామ): వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని అల్లూరు గ్రామానికి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన యువకుడు యర్రంశెట్టి లక్ష్మీనారాయణ ఆ వివాహితను కొంత కాలంగా వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, లేకుంటే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఆదివారం ఉదయం వివాహిత ఒంటరిగా ఇంటిలో ఉంది. ఆ సమయంలో పూటుగా మద్యం తాగి లక్ష్మీనారాయణ ఆమె ఇంటిలోకి ప్రవేశించి, లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన అతను తనతో తెచ్చుకున్న కత్తితో వివాహితపై దాడిచేసి గాయపరిచాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన వివాహిత భర్త రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చేలోగా తన బైకును అక్కడే వదిలి లక్ష్మీనారాయణ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను 108 అంబులెన్స్లో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణ తన ఇంటిలోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ సోమేశ్వరరావు చెప్పారు. కఠిన చర్యలు తీసుకోవాలి వివాహితపై దాడి జరిగిన ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ బాధిత కుటుంబాన్ని ఫోనులో పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. -
మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్
కోవూరు: వివాహిత మహిళపై ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ, ఆమె భర్త కారణమన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన కోవూరులోని లక్ష్మీనగర్లో శనివారం ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ సర్వేపల్లి సురేష్ కుటుంబం రెండేళ్లక్రితం లక్ష్మీనగర్లో రవి, షకున్ దంపతుల ఇంటి పక్కన అద్దెకుండేది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఈ ఫిబ్రవరిలో కానిస్టేబుల్ భార్య హరిప్రియ ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మృతికి షకున్ భర్త రవి కారణమని సురేష్ అనుమానించాడు. ఇందుకు ప్రతిగా రవి భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం లక్ష్మీనగర్కు వెళ్లాడు. ఆ సమయంలో రవి తన పిల్లలను స్కూల్ వద్ద వదిలేందుకు వెళ్లాడు. సురేష్ ను చూసి ‘అన్నా మంచినీళ్లు ఇవ్వమంటావా..’ అని షకున్ అడిగింది. నీళ్లు వద్దు.. కొద్దిగా పాలు ఇవ్వమనడంతో ఆమె కిచెన్లోకి వెళ్లింది. వెంటనే సురేష్ ఇంటి తలుపుకు గడియపెట్టి కిచెన్లోకి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోశాడు. ఈలోగా ఇంటికి చేరుకున్న రవి తలుపు పగులగొట్టి లోపలికెళ్లగా.. అతనిపైనా సురేష్ దాడికి యత్నించాడు. అతను తప్పించుకుని బయటకు పరుగుతీశాడు. దీంతో సురేష్ అక్కడినుంచి పరారయ్యాడు. షకున్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్
మణికొండ: అతడికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో యువతితో ప్రేమ నాటకానికి తెరలేపాడు. అతడిని నమ్మిన యువతి తన మతం, కులం వేరైనా వివాహానికి సిద్ధమైంది. అంతలోనే అతడికి పెళ్లయిన విషయం తెలిసి దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేకపోయిన అతను ఆమెను అంతం చేయాలని పథకం వేసి పోలీసులకు చిక్కాడు. మంగళవారం రాత్రి నార్సింగి ఠాణా పరిధిలోని హైదర్షాకోట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జరిగిన దాడి కేసులో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. హరియాణా రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్ (23) కొన్నేళ్లుగా స్థానికంగా ఉన్న జావెద్ హబీబ్ సెలూన్లో పనిచేస్తున్నాడు. బాధితురాలు పలుమార్లు అదే సెలూన్కు వెళ్లడంతో పరిచయం చేసుకున్న అతడు ప్రేమనాటకం మొదలు పెట్టాడు. ఓ దశలో అతడిని వివాహం చేసుకునేందుకు యువతి సిద్ధమైంది. ఈ క్రమంలో అతనికి గతంలోనే వివాహం అయ్యిందని, భార్యాపిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో యువతి అతడిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో ఏకంగా తనను మట్టుపెట్టాలనే పథకం వేశాడు. మంగళవారం రాత్రి చివరిసారిగా మాట్లాడాలని అపార్ట్మెంట్ కిందికి రప్పించి ఉన్నట్టుండి తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతి బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు రాగానే షారూఖ్ పారిపోయిందుకు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కోర్టు రిమాండ్ విధించినట్టు ఎస్సై అన్వేశ్రెడ్డి తెలిపారు. -
షిర్డీ వెళ్లొస్తుండగా తెలుగువారిపై దారి దోపిడీ
ముంబై: దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రమేశ్. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్స్టేషన్ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు. అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement