-
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘వికసిత భారత్’నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను మరింత శక్తివంతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అని కొనియాడారు. గురువారం బడ్జెట్ అనంతరం ఆయన టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’పునాదిని బలోపేతం చేసే హామీని ప్రస్తుత బడ్జెట్ ఇస్తోందని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సమగ్రంగా, వినూత్నంగా ఉందని, దేశ పురోభివృద్ధిపై పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు. భారతదేశ యువ త ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించిన ట్లు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ప్రకటించినట్లు గుర్తుచేశారు. గ్రామాలు, నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. తొ లుత 2 కోట్ల మంది మహిళలను ’లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించకున్నామని, ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇకపై అంగన్వాడీ సభ్యు లు, ఆశావర్కర్లు సైతం లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తాజా బడ్జెట్లో ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయాలను భారీగా పెంచినట్లు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించారని, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ఇది తీపి కబురేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల 21వ శతాబ్దంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని, కోట్లాది మంది యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘వందేభారత్ స్టాండర్డ్’కింద 40 వేల ఆధునిక కోచ్లను తయారుచేసి, సాధారణ ప్యాసింజర్ రైళ్లలో చేర్చాలని బడ్జెట్లో ప్రకటించారని, ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే మార్గాల్లో లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పేద, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సోలార్ రూఫ్టాప్ ప్యానెళ్ల ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని అన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయపు పన్ను ఉపశమన పథకంతో దాదాపు కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లబ్ధి కలుగుతుందన్నారు. నానో డీఏపీ వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు. -
AIM For Seva దాతల ప్రశంసా కార్యక్రమం
-
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement