-
మంచిర్యాలలో పురాతన గోడ..
తెలంగాణలో మరో ప్రాచీన గుహల జాడ బయటపడింది. మంచిర్యాల సమీపంలోని బుగ్గగట్టు అటవీ ప్రాంతంలోని తాటిమట్టయ్య అనే గుట్టపైన ఇది వెలుగుచూసింది. వివిధ కాలాల్లో చిత్రించినట్టుగా భావిస్తున్న పలు చిత్రాలు గుహ గోడలపై కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆదిమానవులు తమ చిత్రాలకు ఎరుపు రంగు వాడతారు. ఇక్కడ ఎరుపుతోపాటు తెలుపు, నలుపు, ముదురు ఆకుపచ్చ రంగు చిత్రాలుండటం విశేషం. దుప్పి, ఎద్దు, అడవి పందులు, ఉడుములు, తాబేలు, గుడ్లగూబ, గబ్బిలాలు, తేనెతుట్టె లాంటి చిత్రాలు గోడలపై కనిపిస్తున్నాయి. దాదాపు మూడడుగుల ఎత్తుతో మరో ఆకృతి గీసి ఉంది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల భాగంలో కిరణాలతో ఉన్న మరో ఆకృతి ఉంది. దీన్ని స్థానికులు తాటిమట్టయ్య దేవుడిగా పిలుచుకుంటున్నారు. అమెరికాలోని ఉతా వ్యాలీ, టెక్సాస్ రియోగాండ్ లోయ, ఫ్రాన్స్లోని మరో ప్రాంతంలో ఇలాంటి భారీ ఆకృతులు కనిపిస్తాయి. దాదాపు పదేళ్ల కాలంలో వీటిని గీసినట్టు భావిస్తున్నామని ఈ చిత్రాల సమూహాన్ని గుర్తించిన ఔత్సాహిక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ చిత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. –సాక్షి, హైదరాబాద్ -
కర్నూలులో బయటపడిన గుహ
-
మైలారం గుహల్లో స్పీకర్
గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గుట్టపైన ఉన్న పురాతన గుహలను రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధు సూదనాచారి శనివారం సందర్శించారు. గుహల గుట్ట వద్దకు దారి లేనందున స్పీకర్ వాహనం వెళ్లలేకపోయింది. దీంతో ఆయన పోలీసు వాహనంలో కొంత దూరం వెళ్లి, అనంతరం కాలినడకన గుహలను చేరుకున్నారు. స్పీకర్ గుహల్లో కొంత దూరం నడిచి వెళ్లారు. చీకటిగా ఉండడం మూలంగా లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. కాకతీయగడ్డ మీద ప్రతి చెట్టుకు, ప్రతిగడ్డకు,ప్రతి బిడ్డకు చరిత్ర ఉంటుందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వాలు ఈ గుహలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement