-
అమెరికా వీసాలు పొందడంలో భారత్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్ మిషన్ ఇన్ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది. ‘‘కోవిడ్–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్ డి అఫైర్స్ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్ కౌన్సిలర్ డాన్ హెల్ఫిన్ అన్నారు. ఇరవై శాతం మంది భారతీయులే.. అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్లైన్/ఆఫ్లైన్ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి. ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
మీరే కావాలి!
సాక్షి, అమరావతి: ‘పెద్దన్న’ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి విదేశీ నిపుణుల రాకపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే అమెరికా కంపెనీలు మాత్రం వారే ముద్దని తేల్చి చెబుతున్నాయి. ‘రండి రండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..’ అని విదేశీ నిపుణులకు ఆహ్వాన గీతం ఆలపిస్తున్నాయి. విదేశీ నిపుణులతోనే తమ కంపెనీల వృద్ధి ముడిపడి ఉందని కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికాలో తాజాగా నిర్వహించిన ‘ఇమిగ్రేషన్ ట్రెండ్స్–2020’ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎన్వాయ్ గ్లోబల్, హ్యారీష్ పోల్ సర్వే సంస్థలు సంయుక్తంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఈ సర్వే నిర్వహించాయి. అమెరికాలోని 400కిపైగా కంపెనీల హెచ్ఆర్ విభాగాలను సంప్రదించి వృత్తి నిపుణులు, ఉద్యోగుల నియామకంలో ఆ కంపెనీల ప్రాధాన్యతలను తెలుసుకున్నాయి. ఇలాగైతే ఇబ్బందే.. కెనడా వెళ్లిపోతాం ప్రస్తుతం అమెరికాలో వీసా నిబంధనలను కఠినతరం చేయడం తమకు పెద్ద సమస్యగా మారిందని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా విదేశీ నిపుణుల నియామక ప్రక్రియ అనుకున్న విధంగా సాగడం లేదని చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విదేశీ నిపుణులకు ‘హార్ట్ల్యాండ్ వీసా’ జారీ చేయాలని అమెరికాలోని 71 శాతం కంపెనీలు కోరుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్, పారిశ్రామికంగా అంతగా ప్రసిద్ధి చెందని నగరాలు, ప్రాంతాల్లో నెలకొల్పే కంపెనీల్లో విదేశీ నిపుణులు పనిచేసేందుకు ఈ విధానం కింద సులభంగా వీసాలు జారీ చేయాలని సూచిస్తున్నాయి. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితే కొనసాగితే తాము కెనడాకు తరలి పోవాల్సి వస్తుందని 40 శాతం అమెరికా కంపెనీలు చెబుతుండటం గమనార్హం. ఉద్యోగాలకు అర్హులైన అమెరికన్లు ఏరి? అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గట్టిగా చెబుతున్నా వారు మాత్రం ఉద్యోగాలు చేసేందుకు సుముఖత చూపడం లేదని సర్వేలో వెల్లడైంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2019 నవంబర్ నాటికి అమెరికాలో 6.80 మిలియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 5.80 మిలియన్ల మంది అమెరికన్లే ఉద్యోగాలు చేసేందుకు సానుకూలత ప్రదర్శించారు. అంటే ఒక మిలియన్ ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన అమెరికన్లు లేరు. ఇదే పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అర్హులైన నిపుణులను నియమించుకోవాలంటే విదేశీయులపై ఆధారపడక తప్పదని అమెరికా కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. విదేశీ నిపుణులకు జై - అమెరికాలోని 93 శాతం కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వేలో తేలింది. - తమ కంపెనీల వృద్ధి వ్యూహంలో విదేశీ నిపుణుల నియామకం కీలక అంశంగా భావిస్తున్నాయి. - అత్యంత నైపుణ్యం అవసరమైన కీలక పోస్టుల్లో విదేశీయుల నియామకానికే మొగ్గు చూపాయి. - విదేశీ నిపుణులు తమ కంపెనీల ఎదుగుదలలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నట్లు 50 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి. - విదేశీ ఉద్యోగులకు గ్రీన్కార్డులు స్పాన్సర్ చేసినట్లు 71 శాతం కంపెనీలు తెలిపాయి. -
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
-
హెచ్1బీలో ఒక దరఖాస్తుకే అనుమతి
వాషింగ్టన్: ఒక వ్యక్తి తరఫున ఒకటి కంటే ఎక్కువ హెచ్–1బీ వీసా దరఖాస్తులు వస్తే అన్నింటిని తిరస్కరించే వీలుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి హెచ్–1బీ పిటిషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఆదేశాలిచ్చింది. హెచ్–1బీ వీసాల జారీలకు సంబంధిన లాటరీలో తమ పేరు ఎలాగైనా వచ్చేందుకు ఒక వ్యక్తి తరఫున ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏదైనా వ్యాపార అవసరముంటే తప్ప ఒకే లబ్ధిదారుడి తరఫున సంబంధిత సంస్థలు(రిలేటెడ్ ఎంటిటీస్) దాఖలుచేసే అన్ని హెచ్–1బీ పిటిషన్లను తోసిపుచ్చడం కానీ రద్దు చేయడంగానీ చేస్తాం’ అని స్పష్టం చేసింది. హెచ్ 4 రద్దు చేస్తే తగ్గనున్న అమెరికాపై మోజు! హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్ 4 వీసా ప్రక్రియను ఒకవేళ ట్రంప్ సర్కారు రద్దు చేస్తే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికాపై ఆకర్షణ తగ్గే ప్రమాదముందని వలసదారుల అనుకూల సంస్థ ఒకటి తన నివేదికలో పేర్కొంది. హెచ్–1బీ వీసాపై వచ్చి శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే ఆ పాలసీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. హెచ్ 4 వీసాతో జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల.. అదనపు ఆదాయం సమకూరడంతో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఆకర్షణీయ ప్రాంతంగా కొనసాగుతుందని, ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో ఇతర దేశాలతో అమెరికా పోటీ పడేందుకు దోహదపడుతుందని ఆ నివేదిక తెలిపింది. సిలికాన్ వ్యాలీ కంటే అక్కడే హెచ్–1బీలు ఎక్కువ.. అమెరికాలో సిలికాన్ వ్యాలీ కంటే తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ మెట్రో ప్రాంతాల్లోనే ఎక్కువమంది హెచ్–1బీ వీసాదారులు ఉన్నారని ‘ప్యూ’ సంస్థ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ సంస్థ లెక్కల ప్రకారం.. 2010–2016 మధ్య కాలంలో మొత్తం 8,59,600 వీసాలు జారీ కాగా వాటిలో 2,47,900 మంది న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. టెక్సాస్ మెట్రో ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హెచ్1–బీ వీసాదారులు పనిచేస్తున్నట్లు ‘ప్యూ’ నివేదిక పేర్కొంది. సిలికాన్ వ్యాలీ కేంద్రమైన శాన్జోస్లో 2010–16 మధ్య కాలంలో 22,200 మంది హెచ్–1బీపై పనిచేశారని పేర్కొంది. డాలస్, వాషింగ్టన్ మెట్రో ప్రాంతాల్లో వరుసగా 74 వేలు, 64,800 మంది.. బోస్టన్లో 38,300 మంది హెచ్–1బీ వీసాదారులు నివసిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాల్ని వెల్లడించారు. టెక్సస్ కాలేజీ స్టేషన్ మెట్రో ప్రాంతంలో పనిచేసే ప్రతి వంద మందిలో 32 మంది హెచ్–1బీ వీసాదారులేనని, వారిలో 99% మంది అక్కడున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని తెలిపింది. పాత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలివ్వాలి హెచ్–1బీ వీసా దరఖాస్తు సమయంలో వారి పాత ఫోన్ నంబర్ వివరాలు, ఈ మెయిల్ చిరునామాలు, సోషల్ మీడియా వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశ ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన డాక్యుమెంట్లో పేర్కొన్న వివరాల మేరకు.. ‘అమెరికా రావాలనుకుంటున్నవారు కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి. అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి రాకుండా నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లుగా ఉపయోగిస్తున్న సోషల్మీడియా ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు అందించాలి. ఇంతకుముందు ఏ దేశమైనా మిమ్మల్ని బహిష్కరించిందా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయా? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేశారు. తాజా నిబంధనలపై స్పందన తెలియచేసేందుకు 60 రోజుల గడువునిచ్చారు. -
అమెరికన్లకు ఉద్యోగాలిస్తున్నదే భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే దుష్ప్రచారం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇది పూర్తి విరుద్ధం. భారతీయులే ఎక్కువ మంది అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా కంపెనీలను ఏర్పాటు చేసి భారతీయులతోపాటు అమెరికన్లకు, విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ హార్డ్వేర్లో పేరెన్నికగన్న 'సన్ మైక్రో సిస్టమ్స్' నుంచి ఈ మెయిల్ దిగ్గజం 'హాట్ మెయిల్' వరకు ఎన్నో ప్రసిద్ధ కంపెనీలకు ప్రాణంపోసి అమెరికన్లకు ఉద్యోగాలిచ్చిందీ భారతీయ వ్యాపారవేత్తలే. భారత్లోని బెంగళూరు నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా వరకు విస్తరించిన వెంచర్ క్యాపిటల్ సంస్థ 'ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్' డైరెక్టర్ మను రేఖి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో అమెరికాలో ఉద్యోగావకాశాలను పెంచిన భారత వ్యాపార దిగ్గజాల గురించి మరిన్ని వివరాలు పొందుపరిచారు. ఈరోజు అందరికి సుపరిచితులైన గూగుల్కు చెందిన సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్కు చెందిన సత్య నాదెండ్ల, పెప్సీ సీఈవో ఇంద్రా నూయీ, అడోబ్స్కు చెందిన శంతను నారాయెణ్లు దశాబ్దాల క్రితమే అనేక భారతీయ సంస్థలకు బీజం వేశారు. తొలితరం భారతీయ వ్యాపారవేత్తలు 1980 దశకంలో అమెరికాకు రావడం ప్రారంభమైంది. కన్వల్ రేఖి, వినోద్ ఖోస్లా, నరేన్ గుప్తా, ప్రభూ గోయల్, సుహాస్ పాటిల్ లాంటి వారెందరో సిలికాన్ వ్యాలీలో ప్రవేశించి సన్ మైక్రోసిస్టమ్స్ (తర్వాత ఓరాకిల్ స్వాధీనం చేసుకొంది), ఎక్సిలాన్, సైరస్ లాజిక్ లాంటి కంపెనీలను ఏర్పాటు చేసి ఎంతో మంది అమెరికన్లను ఉద్యోగావకాశాలను కల్పించాయని మను రేఖి తన నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలో వినియోగదారుడి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియని దశలోనే అనేక మంది భారతీయ వ్యాపారవేత్తలు అమెరికాలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో వినియోగదారుడిని ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా భారతీయులు కంపెనీలను ఏర్పాటు చేయడం, విదేశీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రారంభించారు. ఈ దశలో సబీర్ భాటియా 1996లో హాట్మెయిల్ డాట్ కామ్ ఏర్పాటు చేయడం విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో సందేహం లేదు. ఆయన ఈ సంస్థను స్థాపించక ముందు భారత్లోని బిట్స్ బిలానీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి, అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేశారు. అనంతరం ఆపిల్ కంపెనీలో పనిచేసి, సొంతంగా హాట్ మెయిల్ కంపెనీని స్థాపించారు. 1990వ దశకంలోనే భారత సంతతికి చెందిన ఎంతోమంది వ్యాపారవేత్తలు సిలికాన్ వ్యాలీలో దిగ్గజాలుగా పైకొచ్చారు. 'నెట్స్కేలర్' అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బీవీ జగదీష్, 2000 సంవత్సరంలో ఆ కంపెనీకి సీఈవో అయ్యారు. ఆయన ఇప్పటికీ కూడా కాజ్ వెంచర్స్లో మేనేజింగ్ పార్టనర్గా ఉంటూ అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరోపక్క స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు శాంటా క్లారా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా స్టార్టప్ కంపెనీలపై విద్యార్థులకు క్లాసులు తీసుకుంటున్నారు. గూగుల్ తొలి పెట్టుబడిదారుల్లో ఒకరై ఆ కంపెనీలో 130 కోట్ల డాలర్ల షేర్లు కలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ రామ్ శ్రీరామ్ అమెరికాలో అనేక స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నారు. నాస్డాగ్ ఐపీఓ జాబితాలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రముఖ కంపెనీల జాబితాలో 17 కంపెనీలు భారతీయులు స్థాపించిన లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్న కంపెనీలే కావడం ఇక్కడ విశేషం. ఈ కంపెనీల మార్కెట్ షేర్ల విలువ 2,600 కోట్ల డాలర్లకు పైమాటే. నేడు అమెరికాలోని 261 యూనికార్న్స్ (వంద కోట్ల డాలర్లకు మించిన ప్రైవేటు కంపెనీలు)లలో 14 కంపెనీలు భారత సంతతి వారివే. ఈ కంపెనీల షేర్ల విలువ 3,550 కోట్ల డాలర్లు. ఇవి కాకుండా ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో, మానవ వనరులను ఔట్ సోర్సింగ్ ఇచ్చే కంపెనీల్లో కూడా భారతీయ వ్యాపారవేత్తలు ఎంతో మంది ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement